అంపశయ్యపై "కరుణ"

Publish Date:Jul 30, 2018

Advertisement

తాను ఎప్పుడు మరణించాలో నిర్ణయించుకున్న మహానుభావుడు భీష్ముడు. భారతంలో భీష్ముడ్ని మించిన ధీరుడు లేడు. భారతంలో భీష్ముడికి మించిన యోధుడూ లేడు. దక్షిణ భారతదేశంలో ఆనాటి భీష్ముడికి సరితూగే నాయకుడు తమిళనాట పుట్టాడు. ఆయనే నేడు అంపశయ్యపై ఉన్న కలియుగ భీష్ముడు ముత్తువెల్ కరుణానిధి. నేటి రాజకీయాలను... నేటి సినిమాలను... నేటి సమాజాన్ని చూసి కరుణానిధిని అంచనా వేయడం ఏమంత మంచిది కాదు. ఆయన దీక్షాదక్షతులు తెలియాలంటే కాసింత వెనక్కి వెళ్లాల్సిందే. విప్లవ పోరాటమంటే తెల్లగుర్రమ్మీద స్వారీ అనుకున్నావా నా స్వామీ అన్నాడు ఓ విప్లవ కవి.ఆ మాటలు కరుణానిధికి సరిగ్గా అతికినట్లు సరిపోతాయి. రాజకీయ పోరాటమంటే తెల్ల గుర్రం మీద స్వారీ కాదని కరుణానిధికి ఎప్పుడో... ఏనాడో తెలిసింది. పోరాటం గురించి తెలుసుకోవాలంటే కరుణానిధి గురించి తెలుసుకోవాలి.

 

 

నిరంతరం నల్ల కళ్లాద్దాల వెనుక దాగి ఉన్న ఆ కళ్లలోని కసిని... ఆరాటాన్ని.... ఏదో చేయాలనే ఆరాటాన్ని తెలుసుకోవాలంటే కష్టమే. ఆ పనిని ఆయన వారసులే చేయలేకపోయారు. అందుకే చెట్టుకొకరు... పుట్టకొకరుగా మారారు. కరుణానిధి అంటే ఓ ముఖ్యమంత్రే కాదు.... ఆనాటి సమాజానికి మిగిలిన ఏకైక తీపి గురుతు. ఆ తీపి గురుతు అందర్ని వదిలి వెళ్లిపోవాలనుకుంటోంది. నిజంగా అలాగే అనుకుంటున్నారా కరుణానిధి. అదే కోరుకుంటున్నారా... కాదు అంటున్నారు ఆయనే. అందుకే గడచిన కొన్ని రోజులుగా ఆయన అంపశయ్యపై ఊగిసలాడుతున్నారు. ఏదో చేయాలనే తపనతో కొట్టిమిట్టాడుతున్నారు. ఆయన ప్రాణాలు తమిళ ప్రజల కోసం ఆరాటపడుతున్నాయి. చావు అందరికి సమానమే అయినా... చావు అందరినీ సమానంగా ప్రేమించలేదు.... సరిగ్గా కరుణానిధి విషయంలోనూ అదే జరిగింది. అదే జరుగుతోంది. 94 నాలుగేళ్ల వయసులో కరుణానిధి మరణంతో పోరాడుతున్నారు. కాదు... కాదు... ఓ విఫలయత్నంతో ఆరాటపడుతున్నారు.

 

సమాజాన్ని మార్చాలనుకోవడమే ఆ విఫల యత్నం. విఫలం అనేది కరుణానిధి ప్రయత్నమే తప్ప లక్ష్యం కాదు... అందుకే 94 ఏళ్ల వయసులోనూ ఆయన శరీరం మరణం వైపు చూడడం లేదు. 1969 సంవత్సరంలో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికి 50 సంవత్సరాలు అయ్యింది. అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఇరవై ఏళ్లకే కరుణానిధి తన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటి వరకూ ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసిన కరుణానిధికి ఆ పదవి కంటే కూడా కవిత్వం... రచనలు... సాహితీ చర్చలంటేనే ఎక్కువ ఇష్టం. ఆయన జీవితమంతా రచనలతోనూ.... వివిధ స్క్రిప్టులతోనే గడిచింది. తొలినాళ్లలో నాటక రంగంలోనూ... ఆ తర్వాత సినీ రంగంలోనూ రచయితగా వెలుగొందిన కరుణానిధి... తన మిత్రుడు, తమిళ మహా నటుడు ఎం.జీ.ఆర్ గా పిలువబడే ఎం.జి.రామచంద్రన్ తో కలిసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

 

 

ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ ఉన్నంత వరకూ కరుణానిధికి ఢోకా లేకుండానే పోయింది. ఆయన మరణంతో ఓ మంచి మిత్రుడ్ని కోల్పోయిన కరుణానిధికి రాజకీయ పోరు అప్పుడే జయలలిత రూపంలో ఎదురైంది. జయలలిత బతికి ఉన్నంత వరకూ ఈ ఇద్దరు నేతల మధ్య నీరు కూడా నిప్పుగా మారింది. వీరిద్దరి ఆధిపత్య పోరులో ఒకసారి ఒకరిది పైచేయి అయితే... మరొకసారి వేరొకరిది పైచేయిగా నిలిచింది. అయితే, జయలలిత అధికారంలో ఉండగా చూపించిన కక్షపూరతి చర్యలను కరుణానిధి మాత్రం ఎప్పుడూ చూపించలేదు. ఇది ఆయన రాజకీయ విచక్షణకు గీటురాయి. జయలలిత ముఖ్యమంత్రి అయిన కొన్నాళ్లకే కరుణానిధి ఇంటికి అర్ధరాత్రి పోలీసులను పంపించి ఆయనను అరెస్టు చేసిన తీరును తమిళ ప్రజలే కాదు... యావత్ దేశ ప్రజలందరూ తప్పు పట్టారు. అప్పటికే ముదుసలి అయిన కరుణానిధిని తమిళ పోలీసులు కాళ్లు చేతులు కట్టేసి బలవంతంగా ఆయన్ని అరెస్టు చేశారు. ఇది తమిళ ప్రజలకు... ముఖ్యంగా డిఎంకె కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. రాజకీయ కక్షలకు ఆ సంఘటన ఓ మచ్చుతునక. కరుణానిధిలో పరిణితి చెందిన  ఓ రాజకీయ నాయకుడ్ని తమిళ ప్రజ చూసింది. ఆయనలోని పట్టుదల... మూర్తీభవించిన మానవత్వం... ప్రజలకు ఏదో చేయాలనే తపనే ఆయనకు ఇంతటి పేరు తీసుకువచ్చింది.

 

 

తన రచనల్లోనే కాదు... తన ఏలికలో కూడా తమిళనాడులోని బడుగు, బలహీన వర్గాల వారికి కరుణానిధి చేసిన మేలు వారు మరువలేనిది. ఆయన ప్రభుత్వంలో చేపట్టిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లకు ఆదర్శంగా నిలిచాయి. బహుశా అందుకేనేమో... కరుణానిధిని చికిత్స నిమిత్తం చేర్పించిన కావేది ఆసుపత్రికి లక్షలాది మంది చేరుకుంటున్నారు. తమ నాయకుడిని చూడాలని... ఆయన తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని కోరుకుంటున్నారు. తమిళనాట అన్ని దేవాలయాలు... మసీదు... చర్చిలు.. ఇతర ప్రార్ధనా మందిరాల్లోనూ కరుణానిధి ఆరోగ్యం కోసం పూజలు జరుగుతున్నాయి. ఒక నాయకుడికి ఇంతకంటే ఏం కావాలి. ఆయన సంపాదించిన కోట్ల ఆస్తులు... తన వారసులు.. తన గెలుపోటముల కంటే ప్రజాదరణ ఎంతో గొప్పదో మరోసారి బహిర్గతమైంది. నిరంతరం ప్రజల కోసం ఆరాటపడే వారి వెంట ప్రజలు వెల్లువలా ఉంటారనడానికి కరుణానిధే ఓ సజీవ సాక్ష్యం. అంపశయ్యపై ఉన్న కరుణానిధి సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారని ఆశిద్దాం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.