షర్మిలే రైట్.. వైసీపీ అంగీకరించేసిందా?

Publish Date:Oct 28, 2024

Advertisement

చేతులు పూర్తిగా కాలిపోయాకా.. ఆకుల కోసం వెతికినట్లుంది వైసీపీ తీరు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన కనీస ముందు చూపుకూడా లేని పార్టీగా ఇప్పటికే వైసీపీ పలు సందర్భాలలో రుజువు చేసుకుంది. ఆ పార్టీ పూర్తిగా వైసీపీ అధినేత జగన్  ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడిచే పార్టీ. అధికారంలో ఉన్న ఐదేళ్లూ దోచుకోవడం, దాచుకోవడం, ప్రత్యర్థులపై దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులు అన్నట్లుగా సాగింది. ఎందుకంటే అవే జగన్ కు ఇష్టం కనుక. ప్రత్యర్థులను అనుచిత వ్యాఖ్యలతో విమర్శించే వారికే పార్టీలో గుర్తింపు అన్న విధానం కారణంగా ఆ పార్టీ నేతలంతా నోరేసుకుని పడిపోయేవారు. బూతుల పంచాంగంలో నిష్ణాతులుగా గుర్తింపు పొందారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ అభివృద్ధి మాటే ఎత్తక, కేవలం కక్ష సాధింపు చర్యలే పాలన అన్నట్లుగా వ్యవహరించిన కారణంగానే జగన్ పార్టీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక అధికారం కోల్పోయిన తరువాతైనా పార్టీ అధినేతలో, నేతల్లో మార్పు వచ్చిందా అంటే లేదనే చెప్పాలి. ఈవీఎంల కారణంగానే ఓడిపోయాం. ప్రజా మద్దతు తమవైపే అంటూ స్వోత్కర్ష వినా.. పార్టీ ఓటమికి కారణాలపై ఇంత వరకూ ఆ పార్టీ సమీక్షించింది లేదు. ఆత్మ విమర్శ చేసుకున్నది లేదు. 

ఇక తాజాగా జగన్, ఆయన సోదరి మధ్య ఆస్తి తగాదా పార్టీ ప్రతిష్టను మరింతగా దిగజార్చింది. వైఎస్ కుటుంబ ప్రతిష్ఠను పాతాళంలోకి పడిపోయేలా చేసింది. అయితే షర్మిలపై జగన్ ఏమైనా మాట్లాడితే ఏదో సొంత గొడవ అనుకోవచ్చు. కానీ షర్మిలపై విమర్శలు గుప్పించడం, ఆమె ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయడమే పార్టీ విధానం అన్నట్లుగా  పార్టీ నేతలు మైకుల ముందుకు వచ్చి చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి తీరని నష్టం చేశాయి చేస్తున్నాయి.

ఈ రెండు వారాలలో వైసీపీ నేతలు షర్మిలను దూషించడానికే తక్కువలో తక్కువ రెండు డజన్ల ప్రెస్ మీట్లు పెట్టారు. కేతిరెడ్డి, జూపూడి, పేర్నినాని, రాచమల్లు, సతీష్ రెడ్డి, సుధాకర్ బాబు, వరుధు కల్యాణి, గుడివాడ అమర్నాథ్, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి.. ఇలా వైసీపీ నేతలందరూ షర్మిలపై బురద జల్లడానికే మైకుల ముందుకు వచ్చారు. ఇక జగన్ సొంత మీడియా  అయితే షర్మల వ్యక్తిత్వ హననమే లక్ష్యం అన్నట్లుగా డిబేట్లు నిర్వహించింది. కథనాలు వండి వార్చింది. అయితే ఆలస్యంగానైనా షర్మిల విషయంలో పార్టీ పరంగా ఇలా విరుచుకుపడటం వల్ల ప్రయోజనం సంగతి అటుంచి నష్టం జరుగుతోందని తెలుసుకున్న వైసీపీ ఇప్పుడు షర్మిలకు వ్యతిరేకంగా నోరెత్తవద్దని నిర్ణయించుకుంది. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియాలో షర్మిలపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేద్దామని పిలుపు నిచ్చింది. కోర్టులు ఉన్న అంశం కనుక అక్కడే తేల్చుకుందామని, రాజకీయ చర్చలు వద్దని స్ఫష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ ఎక్స్ వేదికగా ఓ ప్రకటన చేసింది.  

అయితే అసలీ రచ్చను మొదట మొదలెట్టిందే వైసీపీ. జగన్ సహా ఆ పార్టీ నేతలంతా మూకుమ్మడి దాడి చేసినట్లుగా షర్మిలపై విరుచుకుప్పడారు. కనీస లాజిక్ కూడా అందకుండా.. వైఎస్ మరణాన్ని తెలుగుదేశం, కాంగ్రెస్ లకు ఆపాదిస్తూ అటువంటి వారి మేలు కోసం షర్మిల పని చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఆస్తుల విషయంలో షర్మిలను జగన్ దగా చేశారని జనం నమ్ముతున్నారనీ, ఈ విషయంలో తాము షర్మిలపై ఎంతగా విమర్శలు చేస్తే అంతగా నష్టపోవడం ఖాయమనీ నిర్ధారించుకున్న తరువాత ఇక ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అయితే అప్పటికే అలస్యమైపోయింది. షర్మిల విషయంలో వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ ప్రతిష్ఠ పూర్తిగా మంటగలిసిపోయింది. చేతులు పూర్తిగా కాలిపోయిన తరువాత ఇప్పుడు ఆకుల కోసం వెదుకుతున్న చందంగా వైసీపీ షర్మిల విషయంలో ఇక నోరెత్తకూడదని తీసుకున్న నిర్ణయం వల్ల వైసీపీకి ఒనగూడే ప్రయోజనం ఏం లేదు సరికదా.. ఇప్పటి దాకా తాము చేసిన విమర్శలన్నీ తప్పు, అవాస్తవాలని స్వయంగా ఒప్పుకున్నట్లైంది. 

By
en-us Political News

  
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా  అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. 
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (ముఖ్యంగా పట్టణ, నగర పాలక సంస్థల) చుట్టూ తిరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..!
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.