ఆ మూడూ కలిసినట్టే!.. జ‌గ‌న్‌కి మూడినట్టే!?

Publish Date:Mar 21, 2022

Advertisement

ఏపీ రాజకీయ రాజకీయ సమీకరణాల్లో మార్పులు జరగబోతున్నాయా? అధికార వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయా? ఇప్పటికే జనసేన- బీజేపీల మధ్య స్నేహం బలంగానే ఉందని, మరో పార్టీ తెలుగుదేశం విషయంలోనే మరి కాస్త స్పష్టత రావాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మూడు పార్టీలు ఒక్కటై వచ్చే ఎన్నికల్లో బరిలో దిగితే ఏపీ ప్రజలు 151 సీట్లు ఇచ్చారని విర్రవీగిపోయి ప్రవర్తిస్తున్న వైసీపీకి ఏ గతి పడుతుంది? అనే దానిపై అంచనాలు జోరుగా సాగుతున్నాయి.

అమరావతి ప్రాంతంలో ఇటీవల నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభా వేదికగా ఆ పార్టీ అధినేత ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోం’ అంటూ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చైతన్యం పెరిగిపోయింది. జనసేనాని ప్రకటనతో జనంలో కూడా అప్పుడే 2024 ఎన్నికల ఊపు వచ్చిన సంకేతాలు వస్తున్నాయి. ఆ తర్వాత సీఎం జగన్ సొంత జిల్లా కేంద్రం కడపలో బీజేపీ నిర్వహించిన ‘రాయలసీమ రణభేరి’ సభలో ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేనతో తమ బంధం బలంగానే ఉందని పేర్కొన్నారు. దాంతో పాటు ప్రధాన ప్రతిపక్షం కూడా తమతో చేతులు కలిపితే.. వైసీపీ మెడలు వంచడం మరింత ఈజీ అవుతుందనే ధోరణిలో చెప్పడం గమనార్హం.

ఒక పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇంకో పక్కన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాటల నేపథ్యంలో అధికార వైసీపీ అప్రమత్తం అయిందంటున్నారు. ఏడాది తర్వాత రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే హడావుడి ప్రారంభించిందట. సాక్షాత్తుగా సీఎం జగనే ఇందుకు సంబంధించి తమ పార్టీ నేతలకు కీలక సూచనలు చేయడం విశేషం. నిరంతరం ప్రజల్లోనే ఉండాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు జగన్ ఆదేశాలు జారీచేశారు. జనసేన- బీజేపీ- టీడీపీ ఏకమై వెల్లువెత్తితే తన పార్టీ పార్టీకి పుట్టగతులుండవనే అంచనాతోనే ఆయన ముందుగానే జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. మరో పక్కన సీఎం జగన్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సర్వేలు చేయించుకుంటున్నారు. ఆ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెగాసస్ వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చారని అంటున్నారు. పెగాసస్ స్పైవేర్ ను చంద్రబాబు హయాంలో కొనుగోలు చేశారని చెప్పడం విశేషం. ఇప్పుడా వ్యవహారం అధికార వైసీపీ, ప్రతిపక్షటీడీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి, సవాళ్లు, ప్రతిసవాళ్లకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీపైన, చంద్రబాబుపైన బురదజల్లి లబ్ధిపొందాలనే ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగానే పెగాసస్ వ్యవహారం బయటికి వచ్చిందంటారు. ఎందుకంటే అటు మమతా బెనర్జీకి ఇటు జగన్ కు కూడా వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోరే వ్యవహరిస్తున్నారు మరి.

నిజానికి 2014 లో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ప్రారంభించినా అప్పటి ఎన్నికల్లో బరిలో దిగలేదు. బీజేపీ- టీడీపీలకే డైరెక్ట్ గాను జనసేనాని మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి ఎన్నికల్లో ఆయన టీడీపీ, బీజేపీ తరఫున ప్రచారం కూడా చేశారు. అయితే.. 2019 ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయ పరిణామాలు మారాయి. టీడీపీ- జనసేన- బీజేపీలు విడివిడిగానే బరిలో దిగాయి. వచ్చే ఎన్నికల్లో కూడా గతంలో మాదిరిగానే ఈ మూడు పార్టీలూ విడివిడిగానే పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నప్పటికీ తమకు ఉమ్మడి శత్రువైన వైసీపీని ఎదుర్కోవాలంటే ఒక్కటి కాక తప్పని పరిస్థితి ఎదురవుతోంది.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామనడం.. పవన్ ప్రకటనకు కొనసాగింపుగా జనసేనతో తమ పొత్తు ఉంటుందని, జనసేనతో ఎన్నికలకు కలిసే వెళ్లామని కూడా ప్రకటించడం వెంటవెంటనే జరిగిపోయాయి. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం తాను ఎదురు చూస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ అమరావతి సభలో అన్న మాటలకు కూడా సోము వీర్రాజు కడప సభలో సానుకూలంగా స్పందించడం విశేషం. బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధమైందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేది తమ అభిప్రాయమని పేర్కొనడం గమనార్హం. మరో పక్కన టీడీపీ- జనసేన మధ్య బంధం కూడా పరోక్షంగా బలంగానే కొనసాగుతోందంటున్నారు. స్థానిక ఎన్నికల్లో కొన్ని చోట్ల టీడీపీ- జనసేన పొత్తుతో బరిలో దిగిన విషయం తెలిసిందే.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూడా బీజేపీ- జనసేన కూటమితో కలిసి నడుస్తుందా అనే విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. టీడీపీతో పొత్తు గురించి తాము ఎక్కడా చెప్పలేదని సోము వీర్రాజు అన్నప్పటికీ ఆంతరంగికంగా ఆ దిశగా పావులు కదులుతున్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా టికెట్ల ధరలను జగన్ రెడ్డి సర్కార్ తగ్గించినప్పుడు ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, పలువురు నేతలు పవన్ కళ్యాణ్ కు బహిరంగంగానే మద్దతిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన ద్వారా మార్గం సుగమం చేసుకునేందుకు.. బీజేపీతో వచ్చే ఎన్నికల్లో ఒక్కటయ్యేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నదనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే బీజేపీతో పొత్తు ఉండదని టీడీపీ ఎక్కడా చెప్పలేదు.. అలాంటి సంకేతాలు కూడా ఎప్పుడు ఇవ్వకపోవడం ఇందుకు ఉదాహరణగా విశ్లేషకులు చెబుతున్నారు.

ఏదేమైనా భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏపీలో రాజకీయ సమీకరణాలు మారాల్సిన ఆవశ్యకత ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా పోలరైజేషన్ కావాలంటే జనసేన- బీజేపీ- టీడీపీ ఏకం కావడం ఒక్కటే మార్గం అంటున్నారు. అదే జరిగితే అధికార వైసీపీకి  ‘జజ్జనకర జనారే’ తప్పదేమో! అనే అభిప్రాయాలు వస్తున్నాయి.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.