ఏవి తల్లీ.. వలస పక్షుల కిలకిలారావాలు..?

Publish Date:Mar 12, 2022

Advertisement

వాటికి పాస్‌ పోర్ట్ అక్కరలేదు.. ఇమ్మిగ్రేషన్ అధికారుల పర్మిషన్‌ అవసరమే లేదు.. భద్రతాదళ సిబ్బంది తనిఖీలతో అస్సలు పనేలేదు.. ఖండఖండాంతరాలు దాటివచ్చి నేలపట్టులో సందడి చేస్తాయి ఆ విదేశీ వలసపక్షులు. పక్షుల పండుగ వచ్చిందంటే అక్కడి వారికి పండుగే పండుగ. అయితే అంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగే ఈ పక్షుల పండుగ గత రెండేళ్లుగా బోసిపోయిందను చెప్పాలి. కోవిడ్ కారణంగా పర్యాటకుల రాక తగ్గిపోయినా... కొన్ని విదేశీ పక్షులు మాత్రం వచ్చి యధావిధిగా సందడి చేస్తున్నాయి. ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

నెల్లూరుజిల్లా నేలపట్టులో విదేశీ వలస పక్షులు కిలకిలారావాలతో సందడి చేస్తున్నాయి. రంగు రంగుల విదేశీ పక్షులు, రకరకాల వలస పక్షులు పర్యాటకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.‌ అయితే వాటిని చూసి, పరవశించే పర్యాటకులు రాకపోవడంతో నేలపట్టులో సందడి తగ్గిపోయింది. కనుచూపుమేర పచ్చని పొలాలు.. మరోవైపు జలకళ సంతరించుకున్న చెరువులు.. దట్టంగా పరుచుకున్న చెట్లు.. ఆ చెట్లకు తెల్లటి పూలు పూసినట్టు పక్షులు.. ప్రకృతి ప్రేమికులకు కట్టిపడేసే ఈ సుందర దృశ్యం నేలపట్టు ప్రత్యేకట. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం సుందర ప్రపంచంగా మారింది. ఆసియా ఖండంలోనే నేలపట్టు పెలికాన్ ప్యారడైజ్ గా ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ విడిదిచేసే పక్షులను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు, పక్షి ప్రేమికులు వస్తుంటారు. ఆదివారం.. ఇతర సెలవు రోజుల్లో పక్షులతో పాటు సందర్శకులతో నేలపట్టు కోలాహలంగా ఉంటుంది. అయితే.. ప్రస్తుతం కోవిడ్‌ కారణంగా పర్యాటకుల రాక తగ్గిపోయింది.

ప్రతి సంవత్సరం అక్టోబరులో మనదేశంలోని హిమాలయాలు పొరుగున ఉన్న శ్రీలంక, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, కజికిస్థాన్, నైజీరియా తదితర దేశాల నుంచి పక్షులు నేలపట్టు పరిసరాలకు వస్తాయి. ఏప్రిల్ తొలి వారం వరకూ నేలపట్టులోనే ఉండి తమ సంతానాన్ని వృద్ధి చేసుకుని స్వస్థలాలకు తిరిగివెళతాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం నేలపట్టులో పక్షుల పండుగను అట్టహాసంగా నిర్వహిస్తుంది. గతంలో డిసెంబరు నెలాఖరులో కాని, జనవరి నెలలో కానీ ఈ పండుగను నిర్వహించేవారు. అయితే.. కోవిడ్ వల్ల రెండేళ్లుగా ఎవరూ పట్టించుకోకపోవడంతో నేలపట్టు బోసిపోయింది. ప్రతి ఏటా అక్టోబర్‌ లో వచ్చే ఈ పక్షులను ఆయా దేశాలలో పెలికాన్స్.. వైట్ ఐ బీసా.. ఓపన్ బిల్డ్ స్టార్క్.. లిటిల్ కార్మోరెంట్స్.. కూడ్స్ అని రకరకాల ఆకట్టుకునే పేర్లతో పిలుస్తారు. మన అటవీశాఖ అధికారులు వాటికి గూడబాతులు.. తెల్లకంకణాలు.. నత్తగుల్ల కొంగలు.. నీటి కాకులు.. నీటి బాతులు అనే పేర్లు పెట్టారు. ఇలా 31 రకాల పక్షులు నేలపట్టు వచ్చి గుడ్లు పొదిగి.. తమ పిల్లలతో సహా తమ దేశాలకు ఎగిరిపోతాయి. నేలపట్టులో ఇప్పటికే కొన్ని రకాల పక్షులు తమ పిల్లలతో చక్కర్లు కొడుతున్నాయి.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పక్షుల పండుగను మూడు రోజులు వైభవంగా నిర్వహించేది. బర్డ్‌ ఫెస్టివల్‌ ను రాష్ట్ర పండుగలో కూడా చేర్చడం విశేషం. అయితే రెండేళ్లుగా పక్షుల పండుగ అనే ఊసేలేదు లేకపోయింది. కరోనాను కారణం చూపించి పండుగను పక్కన పెట్టేశారు. ప్రభుత్వం కూడా పక్షుల పండుగ ఊసే ఎత్తకపోవడం ఏంటని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. నేలపట్టుకు వచ్చే సందర్శకులు మాత్రం పక్షుల పండుగ వాతావరణం మళ్లీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే.. పక్షుల పండుగను ఆస్వాదించే కొందరు నేలపట్టుకు వస్తూనే ఉన్నారు. ఏదైనప్పటికీ పక్షుల పండుగను ప్రభుత్వం నిర్వహించి ఉంటే బాగుంటుందని పక్షి ప్రేమికులు కోరుతున్నారు.

నేలపట్టు పక్షుల కేంద్రానికి 25 ఏళ్ల క్రితం సుమారు 113 రకాలకు చెందిన రెండు లక్షల పక్షులు వచ్చి విడిది చేసేవి. పులికాట్ సరస్సులో ఆహారం సేకరించుకుని, సంతానాన్ని అభివృద్ధి చేసుకునేవి. కాలక్రమేణా నేలపట్టు వచ్చే పక్షుల సంఖ్య వేలల్లోకి తగ్గింది. గత ఏడాది 26 వేల 499 పక్షులు మాత్రమే వచ్చినట్లు గణాంకాలు ఉన్నాయి. ప్రస్తుతం 31 రకాలకు చెందిన 24 వేల 549 పక్షులు మాత్రమే విడిదిలో ఉన్నట్టు నేలపట్టు వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. విదేశీ పక్షులు తిరిగి తమ దేశాలకు వెళ్లే సమయం మరో రెండు నెలల ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ పక్షుల పండుగను వైభవంగా నిర్వహించాలని పక్షి ప్రేమికులు, స్థానికులు కోరుతున్నారు.

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.