స్నేహితుడు గౌతమ్ కు జగన్ చిరు కానుక!

Publish Date:Mar 12, 2022

Advertisement

'స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..’ అంటూ ఓ సినీకవి స్నేహం గొప్పదనం గురించి అద్భుతంగా వివరించారు. నిజమే.. సృష్టిలో తీయనిది స్నేహమేనోయి అంటారు దాని విలువ తెలిసినవారు. అలాంటి స్నేహబంధానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఏపీ సీఎం వైఎస్ జగన్ స్నేహం పట్ల తనకున్న అపార విశ్వాసాన్ని చాటుకున్నారు. గుండెపోటుతో ఇటీవలే అకస్మాత్తుగా తుదిశ్వాస విడిచిన తన ఆత్మీయ మిత్రుడు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి అసెంబ్లీలో ఘనంగా నివాళి అర్పించారు. తమ స్నేహానికి గుర్తుగా నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెట్టాలని, తద్వారా తన మిత్రుడి పేరును శాశ్వతం చేయాలని జగన్ నిర్ణయించారు. అంతేకాదు.. మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరిన మూడు కోరికలను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ప్రజలు, ముఖ్యంగా గౌతమ్ రెడ్డి సొంత నియోజకవర్గం ఆత్మకూరు ప్రాంత ప్రజలు, అభిమానులు, అనుచరులు జగన్ నిర్ణయాలతో ఎంతో సంతోషించారు.

స్నేహితులు అందరికీ ఉండవచ్చు. నేస్తాలు లేని వారు ఎవరూ ఉండకపోవచ్చు. చాలామంది స్నేహానుబంధాలు కాలక్రమంలో కరిగిపోవచ్చు. స్నేహితుల పట్ల తమకున్న అభిమానాన్ని కలకాలం మనసులో నిలుపుకోవడం ఏ కొద్దిమందికో సాధ్యమవుతుంది. అందులోనూ కొద్దిపాటి అధికారం లేదా పదవులు వచ్చినా చాలు.. బాల్యస్నేహితులు, పాతమిత్రులను మరిచిపోయే రోజులివి. అలాంటిది సీఎం స్థాయిలో ఉన్న జగన్ తనకు చిన్ననాటి నుంచి స్నేహితుడు, చిరకాల మిత్రుడైన గౌతమ్ ను మరచిపోలేకపోతున్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గౌతమ్ పేరు తలచుకుంటే చాలు..ఆయనతో తన స్నేహానుబంధాన్ని గుర్తుచేసుకుని బాధపడుతున్నారు జగన్. ఒక సీఎం తన స్నేహితుని పట్ల ఇంత అభిమానాన్ని.. ఆదరాన్నిచూపడం అందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేస్తోంది. మంచితనంతో.. మానవత్వంతో.. మచ్చలేని రాజకీయాలతో.. అందరికీ ఆదర్శంగా జీవించిన గౌతమ్ రెడ్డి వ్యక్తిత్వానికి ఇది మచ్చుతునక అంటున్నారు.

పరిశ్రమలశాఖ మంత్రిగా రాష్ట్రానికి అనేక పరిశ్రమలు, పెట్టుబడులు సాధించుకొచ్చిన యువనేత గౌతమ్ రెడ్డి ఉత్సాహాన్ని చూసి ఓర్వలేక మృత్యువు గుండెపోటు రూపంలో పొట్టనబెట్టుకుంది. తన మిత్రుడు ఇలా హఠాత్తుగా మరణించడాన్ని ఊహించలేకపోయారు సీఎం జగన్. వెంటనే హైదరాబాదులోని గౌతమ్ నివాసానికి సతీసమేతంగా వెళ్ళి, నిశ్చేష్టులయ్యారు. ఆ తర్వాత ఆత్మకూరులో జరిగిన అంతిమయాత్రలో పాల్గొని తీరని వేదనతో కుమిలిపోతున్న కుటుంబ సభ్యులను ఊరడించి ధైర్యం చెప్పారు. కుటుంబ పెద్ద, తమ కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన గౌతమ్ తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి దంపతులను ఓదార్చారు. గౌతమ్ రెడ్డి లేరనే ఊహే భరించలేకపోతున్నానని సీఎం ఆవేదనతో చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది. గౌతమ్ రెడ్డి తనకంటే ఒక ఏడాది పెద్దవారని, అయినా తనను అన్నగా భావించి ఆత్మీయంగా ఉండేవారన్నారు.

గౌతమ్ రెడ్డి మంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలు మరపురానివని, అలాంటి ఆత్మీయుడిని కోల్పోవడం తనకే కాదు.. రాష్ట్రానికి కూడా తీరని లోటు అని చెప్పారు. గౌతమ్ సంగం బ్యారేజీ అని నామకరణం చేస్తామని, త్వరలోనే సంగం బ్యారేజీ పూర్తిచేసి ప్రారంభిస్తామని సీఎం ప్రకటించడంతో గౌతమ్ రెడ్డి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గౌతమ్ తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరినట్లు ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీకి గౌతమ్ పేరు పెట్టి వ్యవసాయం, ఉద్యాన రంగాల బోధనా కళాశాలగా ఏర్పాటుచేస్తామని ఉత్తమ కళాశాలగా తీర్చిదిద్దుతామని జగన్ పేర్కొనడం గమనార్హం. ఉదయగిని ప్రాంతానికి సాగునీళ్ళిస్తామని, ఉదయగిరి డిగ్రీ కాలేజీలో ‘నాడు-నేడు' పథకం కింద వసతులు పెంచుతామని సీఎం హామీ ఇవ్వడం శోకసంద్రంలో ఉన్న గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఊరటనిచ్చినట్లయింది.

గౌతమ్ రెడ్డి భౌతికంగా లేకపోయినా.. ఆయన కోరుకున్న విధంగా వెనుకబడిన ప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరిల్లో జరుగుతున్న అభివృద్ధి పథకాలను చూసి ఆయనకు జన్మనిచ్చిన గడ్డ గర్వపడుతోంది.

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.