గ్లోబల్ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ ఐపీఓకు తెరలేచింది. టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎలోన్ మస్క్కు చెందిన ప్రసిద్ధ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX) స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ఈ బిగ్గెస్ట్ ఐపీఓకు అంతర్జాతీయ మార్కెట్లో ఊహించని రేంజ్లో డిమాండ్ వ్యక్తమవుతోంది. బ్లూమ్బెర్గ్ నివేదికల ప్రకారం, ఇప్పటికే పలు పెద్ద పెద్ద సంస్థాగత ఇన్వెస్టర్లు ఏకంగా 10 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో షేర్లను కొనుగోలు చేయడానికి ఆర్డర్లు పెట్టేయడం గమనార్హం.
గతంలో అంటే 2019వ సంవత్సరంలో సౌదీ అరామ్కో సంస్థ ఏకంగా 29.4 బిలియన్ డాలర్ల నిధుల సేకరణతో సృష్టించిన బిగ్గెస్ట్ ఐపీఓ రికార్డును స్పేస్ఎక్స్ ఇప్పుడు బద్దలు కొట్టబోతోంది. చరిత్రలోనే అత్యంత భారీ ఓపెనింగ్తో స్టాక్ మార్కెట్లలో సరికొత్త చరిత్రను లిఖించడానికి ఈ అంతరిక్ష సంస్థ దూసుకుపోతోంది. ఈ మెగా ఐపీఓకు సంబంధించిన షేర్ల ధరల ఖరారు ప్రక్రియ జూన్ 11న జరగనుంది. ఆ మరుసటి రోజే, అంటే శుక్రవారం, జూన్ 12, 2026 నుండి స్టాక్ ఎక్స్ఛేంజ్లలో స్పేస్ఎక్స్ షేర్ల ట్రేడింగ్ అధికారికంగా ప్రారంభం కానుంది.
ఈ భారీ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా కంపెనీ మొత్తం 555.6 మిలియన్ షేర్లను విక్రయానికి ఉంచింది. ప్రతి ఒక్క షేరు ధరను 135 డాలర్ల ఫిక్స్డ్ ప్రైస్గా నిర్ణయించడం విశేషం. ఈ మెగా ఐపీఓ ద్వారా కంపెనీ ఏకంగా 75 బిలియన్ డాలర్ల భారీ నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధుల సేకరణ విజయవంతంగా పూర్తయితే స్పేస్ఎక్స్ కంపెనీ మొత్తం మార్కెట్ వాల్యుయేషన్ ఏకంగా 1.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. మనలాంటి సాధారణ రీటైల్ ఇన్వెస్టర్లకు కూడా కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మెగా ఐపీఓలో సాధారణ రీటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ ఏకంగా 30 శాతం షేర్లను కేటాయించింది. కొన్ని ప్లాట్ఫారమ్లలో రీటైల్ ఇన్వెస్టర్లు బుధవారం లోపే తమ ఆర్డర్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరోపక్క, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కూడా బుధవారం సాయంత్రంతోనే గడువు ముగియనుంది.
ఈ మెగా ఐపీఓను విజయవంతం చేసేందుకు ప్రముఖ మోర్గాన్ స్టాన్లీ బ్యాంక్ తన న్యూయార్క్ హెడ్క్వార్టర్స్లో దాదాపు 300 మంది బిగ్ ఇన్వెస్టర్లతో కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్లో స్పేస్ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్వెల్, సీఎఫ్ఓ బ్రెట్ జాన్సన్ పాల్గొని ఇన్వెస్టర్ల సందేహాలను నివృత్తి చేశారు. కేవలం రాకెట్ లాంచ్లు మాత్రమే కాకుండా, స్టార్లింక్ శాటిలైట్ సేవలు, స్పేస్ రీసెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X నిర్వహణ వంటి పలు రంగాలలో స్పేస్ఎక్స్ దూసుకుపోతోంది. తాజాగా ఈ కంపెనీ గూగుల్ మాతృసంస్థ Alphabet తో ఒక భారీ క్లౌడ్ సర్వీసెస్ డీల్ కుదుర్చుకుంది. దీని ప్రకారం 2029 వరకు ఆల్ఫాబెట్ సంస్థ స్పేస్ఎక్స్కు నెలకు 920 మిలియన్ డాలర్లు చెల్లించనుంది. అలాగే ప్రముఖ ఏఐ కంపెనీ Anthropic తో కూడా స్పేస్ఎక్స్ ఒప్పందం చేసుకుంది. మార్కెట్లో దీనికి ఆంత్రోపిక్తో పాటు 850 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ ఉన్న ఓపెన్ ఏఐ (OpenAI) నుండి గట్టి పోటీ ఎదురవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/spacex-ipo-listing-date-elon-musk-36-222316.html
అది గరిష్టంగా 20 సంవత్సరాల పాటు లేదా సదరు వ్యక్తికి 40 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరిగి, లైసెన్స్ను ప్రతి ఐదు లేదా పదేళ్లకు ఒకసారి రీన్యూవల్ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికి.. ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్రం సరికొత్త యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే డ్రైవింగ్ లైసెన్స్ గడువును ఏకంగా వాహనదారుడికి 50 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు పొడిగించేలా మార్పు తీసుకురావాలని భావిస్తోంది.
తమ ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు సుమారు రూ.1.5 కోట్ల నగదు, పలు స్థలాలకు సంబంధించిన పత్రాలను కోడలు బంధువులు తీసుకెళ్లారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి గురించి ప్రశ్నించగా ఓ రౌడీషీటర్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దాడుల సమయంలో ఆయన నివాసంలో సుమారు 60 లక్షల రూపాయల నగదు లభించగా.. బ్యాంక్ ఖాతాల్లో మరో కోటి అరవై లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు.ఇక బంగారం విషయానికి వస్తే దాదాపు రెండున్నర కిలోల బంగారు బిస్కెట్లు.. అలాగే పెద్ద మొత్తంలో బంగారు ఆభర ణాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కిలోల కొద్దీ వెండి వస్తువులు కూడా దొరికినట్లు సమాచారం.
ఇటీవల లూసియానా రాష్ట్రంలోని ఓ సరస్సులో జరిగిన ప్రమాదంలో తన స్నేహి తులు చిక్కుకున్న సమయంలో వారిని కాపాడే ప్రయత్నంలో నీటిలోకి దిగిన అనురూప్ రెడ్డి, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పలువురు హృద యాలను కదిలించివేసింది
నగరంలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యంచెప్పారు. మంత్రి లోకేష్ వెంట హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు ఉన్నారు.
శరీర భాగాలైన తల, కాళ్లు, చేతులు లేకపోవడంతో తొలుత ఎటువంటి ఆధారాలు లభించ లేదు. అయితే మృతదేహం పై ఉన్న దుస్తులు కీలక క్లూగా మారాయి. ఆ దుస్తులు ఒక ప్రముఖ బ్రాండెడ్ కంపెనీకి చెందినవిగా గుర్తించిన పోలీసులు..దర్యాప్తులో భాగంగా ఆ దుస్తుల బార్కోడ్ను స్కాన్ చేయడం ద్వారా.. అవి ఎక్కడ కొనుగోలు చేయబడ్డాయో గుర్తించారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన గ్యాస్ సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9 నుండి 4 కి తగ్గిస్తూ కోత విధించింది. అసలు కారణం, సామాన్యులపై పడే ప్రభావం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రముఖ వ్యాపారి నివాసం ఉంటున్నారు. ఇంట్లో నేపాలీ దంపతులను పనిలోకి పెట్టుకున్నారు. నెల రోజుల క్రితమే ఈ నేపాల్ దంపతులను వ్యాపారి ఇంటి పనుల కోసం నియమించుకున్నారు కొద్దిరోజుల క్రితం వ్యాపారి తన కుటుంబ సభ్యుల తో కలిసి ముంబై కి వెళ్లి తిరిగి, ఇంటికి వచ్చిన సమయంలో నేపాలి దంప తులు ఇంట్లో కనిపించలేదు.
కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా క్రూ సభ్యులు ఒక్కసారిగా కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థ తకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై విమా నాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) సుమారు 20,000 మంది అభ్యర్థుల హైరింగ్ పరీక్షలను అకస్మాత్తుగా రద్దు చేసింది. ఆన్లైన్ ఎగ్జామ్స్లో జరిగిన అక్రమాలే దీనికి కారణమా? ఫ్రెషర్ల ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్లలో ఎన్ఆర్ఐలు, ఓసీఐలు సెబీ రిజిస్ట్రేషన్ లేకుండానే భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆర్బీఐ కీలక సడలింపులు ఇచ్చింది. బడ్జెట్ 2026 పరిమితుల కంటే మరింత ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తూ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఐదేళ్లలో 690% మరియు పదేళ్లలో 1040% భారీ లాభాలను అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ గ్యాబ్రియేల్ ఇండియా (Gabriel India) పై మోతీలాల్ ఓస్వాల్ సానుకూల రేటింగ్ ఇచ్చింది. మరో 30% లాభాల అంచనాతో రూ. 1266 టార్గెట్ ధరను ప్రకటించింది. ఈ స్టాక్ పూర్తి వివరాలు, ఆర్థిక బలం మరియు భవిష్యత్తు వృద్ధి అంచనాలను ఇక్కడ చూడండి.
ఆర్బీఐ సరికొత్త డాలర్-రూపాయి స్వాప్ ఫెసిలిటీ నిర్ణయంతో నిఫ్టీ బ్యాంక్ పరుగులు పెడుతోంది. SBI, ICICI, IDFC ఫస్ట్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లలో భారీ లాభాలు రావడానికి గల అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.