ఐపీఎల్ లో స్లో ఓవర్ రేట్.. ప్లేయర్లకు కాదు.. అంపైర్లకు జరిమానా!

Publish Date:Apr 17, 2026

Advertisement

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన   ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లకు స్లో ఓవర్ రేట్ ఒక పెద్ద ఇబ్బందిగా మారింది. నిర్ణీత సమయం కంటే గంటల తరబడి మ్యాచ్ లు కొనసాగుతూ ఉండడానికి, ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారడానికి స్లో ఓవర్ రేట్ కారణమంటున్నారు క్రికెట్ పండితులు.  స్లో ఒవర్ రేట్ కు ప్లేయర్లకు జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదంటున్నది  మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ. ఎంసీపీ క్రికెట్ విభాగం అధిపతి ఫ్రేజర్ స్టీవర్ట్  అయితే.. స్లో ఓవర్ రేట్ సమస్యకు ఆటగాళ్లను మాత్రమే బాధ్యులను చేయడం  కాదని, దీనికి అంపైర్లను కూడా బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. 


ఇటీవల ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సుమారు 4 గంటల 22 నిమిషాల పాటు సాగింది. ఈ మ్యాచ్‌ను స్వయంగా వీక్షించిన స్టీవర్ట్.. ఆట సాగిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫీల్డింగ్ మార్పులు, ఆటగాళ్ల మధ్య చర్చలు, అనవసర విరామాల వల్ల తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.  ఈ నేపథ్యంలోనే ముంబైలో జరిగిన  ఒక కార్యక్రమంలో  మాట్లాడిన ఆయన.. అంపైర్ల ఉదాశీనత వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. 

ప్రస్తుత నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్ నమోదైతే కేవలం జట్టు కెప్టెన్లకు లేదా ఆటగాళ్లకు మాత్రమే జరిమానా విధిస్తున్నారు. కానీ మైదానంలో నిబంధనల ప్రకారం, నిర్ణీత సమయంలో మ్యాచ్ ముగిసేలా చూడాల్సిన బాధ్యత ఉన్న అంపైర్లకు కూడా జరిమానా విధించితేనే ఈ సమస్య పరిష్కారమౌతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 నియమావళిలో ఆట వేగాన్ని మందగింప చేసేలా వ్యవహరిస్తున్న ఆటగాళ్లకు, జట్లకు హెచ్చరికలు చేసే అధికారం, ఐదు పరుగుల పెనాల్టీ విధించే అధికారం, అవకాశం అంపైర్లకు ఉందనీ, వారు మాత్రం ఆ అధికారాన్నీ, అవకాశాన్ని ఉపయోగించకుండా ఉదాశీనంగా వ్యవహరించడం వల్లనే స్లో ఓవర్ రేట్ సమస్య తలెత్తుతోందని ఫ్రేజర్ స్టీవర్ట్  విమర్శించారు. అంపైర్లు కఠినంగా వ్యవహరించనంత కాలం మ్యాచ్‌లు ఇలాగే సాగుతాయని, ఒకవేళ ఓవర్ రేట్ తగ్గితే అంపైర్ల వేతనంలో కోత విధించేలా నిబంధనలు తీసుకువస్తే మార్పు వస్తుందని చెప్పారు. ఇదే విషయాన్ని తాను బీసీసీఐకి కూడా చెప్పానని తెలిపాడు.  చూడాలి మరి ఎంసీసీ ప్రతిపాదనపై బీసీసీ ఎలా స్పందిస్తుందో?

By
en-us Political News

  
ఈశాన్య భారత రత్నమైన సిక్కిం రాష్ట్రంలో అనూహ్య రీతిలో సంభవించిన ఘోర దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇంగ్లండ్‌తో జరిగిన 3వ వన్డేలో 110 బంతుల్లో 138 పరుగులు చేసిన రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ సంచలన విషయాలు వెల్లడించారు. 2011, 2023 వరల్డ్‌కప్ గాయాలు, 2027 వన్డే ప్రపంచ కప్ సాధించే వరకు హిట్‌మ్యాన్ రిటైర్ కాకపోవడానికి గల అసలు కారణాలు తెలుసుకోండి.
అల్పైన్ టెక్స్‌వర్ల్డ్ ఐపీఓ NSE, BSE లలో రూ. 105 వద్ద ఫ్లాట్‌గా లిస్ట్ అయింది. రూ. 126.25 కోట్ల విలువైన ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ వివరాలు, కంపెనీ బిజినెస్ ప్లాన్స్, పూర్తి స్టాక్ విశ్లేషణ ఇక్కడ చదవండి.
ఆల్ట్రాటెక్ సిమెంట్ క్యూ1 ఫలితాల్లో నికర లాభం 17% పెరిగి రూ. 2,599 కోట్లకు చేరింది. నువామా మరియు ఇతర బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్ ధరను రూ. 15,209 వరకు పెంచాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
పేటీఎం క్యూ1 ఫలితాల్లో నికర లాభం 79% పెరిగి రూ. 220 కోట్లకు చేరింది. షేర్లు లాభాల్లో దూసుకుపోతుండగా, గోల్డ్‌మన్ శాక్స్, సిటీ సంస్థలు భారీ టార్గెట్స్ ఇచ్చాయి. పూర్తి వివరాలు ఇక్కడే చదవండి.
2026 జూలై 21 నాటి NYT Strands Game 870 హింట్స్, స్పాంగ్రామ్ మరియు అన్ని సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి. Write there థీమ్‌తో ఉన్న ఈ పజిల్‌ను సులభంగా సాల్వ్ చేయడానికి కావలసిన క్లూస్ మరియు పూర్తి సమాచారం మీకోసం!
ఐటీఆర్‌లో వీఆర్‌ఎస్ నిధులను అడ్వాన్స్ శాలరీగా తప్పుగా పేర్కొన్నప్పటికీ, పూణే ఐటీఏటీ రూ.65.21 లక్షల మొత్తానికి పన్ను మినహాయింపు ఇస్తూ కీలక తీర్పు వెలువరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
జాతీయ రహదారుల వినియోగదారులకు NHAI ఊరట! రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ద్వారా 20 కిలోమీటర్ల పరిధిలోని వారికి డిజిటల్ లోకల్ పాస్ మరియు 22 భాషల్లో సేవలు అందించే మార్గమిత్ర హెల్ప్ సెంటర్‌ను ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
గతంలో కరోనా మహమ్మారి సృష్టించిన వినాశనం, తీవ్ర భయాందోళనలు ప్రజల మనస్సుల్లో ఇంకా సజీవంగానే ఉండటంతో ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ వ్యాపతి తీవ్ర ఆందోళనకు కరాణమౌతోంది. అయితే రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ కొత్త కరోనా వేరియంట్ పెద్ద ప్రమాదకరమనది కాదని స్పష్టం చేసింది.
ఆమెతో ఏడాది నుంచి రిలేషన్‌లో ఉన్న..సూసైడ్‌ నోట్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి..!
ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా సులభంగా యూపీఐ పేమెంట్స్ చేసేలా ఎన్‌పీసీఐ సరికొత్త ఎన్ఎఫ్సీ ఆఫ్‌లైన్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. ఫోన్ నెట్‌వర్క్ లేని ప్రదేశాల్లోనూ రూ. 2,000 వరకు పిన్ లేకుండా చెల్లించే విధానం మరియు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఇంగ్లండ్‌తో జరిగిన లార్డ్స్ వన్డేలో 138 పరుగులతో సెంచరీ సాధించిన రోహిత్ శర్మకు పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ అద్భుతమైన మద్దతు తెలిపారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలకు, విమర్శకులకు చెక్ పెడుతూ అక్మల్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి.
భారత్ వర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్ 2026 పూర్తి షెడ్యూల్, కొత్త మ్యాచ్ టైమింగ్స్, శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు వివరాలు మరియు ఉచిత లైవ్ స్ట్రీమింగ్ సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.