దాదాపు అరవై ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో లక్షన్నర కోట్లలోపు అప్పు ఉంటే రాష్ట్ర విభజన తర్వాత సుమారు 88వేల కోట్ల రూపాయల రుణం ఏపీ వాటాగా వచ్చింది. ఇక, నవ్యాంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 2019 వరకు అది రెండున్నర లక్షల కోట్లకు చేరింది. అంటే, ఐదేళ్లలోనే లక్షన్నర కోట్లకు పైగా అప్పు పెరిగింది. ఏడాదికి 30వేల కోట్ల చొప్పున అప్పు చేశారు. అయితే, ఆర్నెళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి... దూకుడుగా సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఒకవైపు పన్ను రాబడి తగ్గింది... మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా సకాలంలో అందని పరిస్థితి... అయినాసరే జగన్ మాత్రం పథకం మీద పథకాన్ని ప్రకటిస్తూ... ప్రజల మన్ననలు పొందాలని తాపత్రయం పడుతున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తున్న... అమలు చేస్తున్న పథకాలకు నిధులు ఎక్కడ్నుంచి వస్తున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆ ట్రిక్ ఏమిటో మంత్రులకు కూడా అంతుపట్టడం లేదు. కొందరు మంత్రులైతే బహిరంగ వేదికలపైనే తమ మనసులో మాటను బయటపెడుతున్నారు.
అయితే, ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తన ఆర్నెళ్ల పాలనలో 28వేల కోట్ల రూపాయల అప్పుల భారం మోపారని అన్నారు. దుబారా ఖర్చులు తగ్గిస్తామంటూనే కేవలం ఆర్నెళ్లలో దాదాపు 30వేల కోట్ల అప్పులు చేశారని, ఇలాగైతే ఏడాదికి 60వేల కోట్లు... ఐదేళ్లలో 3లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడం ఖాయమన్నారు. అలాగే, హైదరాబాద్లోని లోటస్ పాండ్ ఇంట్లో సౌకర్యాల కోసం లక్షల లక్షల ప్రజాధనాన్ని కేటాయించడం... అదేవిధంగా తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ కు కోట్లాది రూపాయలు వెచ్చించడం ఏమిటని ప్రశ్నించారు. దుబారా తగ్గిస్తామంటోన్న జగన్మోహన్ రెడ్డి... ఇలా ప్రజాధనాన్ని సొంత ఇళ్ల కోసం వినియోగించడం సరికాదన్నారు. అలాగే, ప్రజలపై మరింత అప్పుల భారం మోపకుండా పాలన సాగించాలని సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/six-months-rule-of-ys-jagan-25-91875.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.