తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కరెంటు కష్టాల గురించి అందరికీ తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు చేపట్టింది. ఎక్కడ విద్యుత్ అందుబాటులో ఉంటే అక్కడి నుంచి కొనుగోళ్లు జరిపింది. ఛత్తీస్ గఢ్ తో పాటు ఇతర ప్రాంతాల్లోని విద్యుదుత్పత్తి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. దీంతో అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం కరెంటు కష్టాలను అధిగమించింది, 24 గంటలు విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరుకుంది. సింగరేణి తదితర ప్లాంట్ ల విద్యుత్ కూడా తోడవడంతో అవసరానికి మించి కరెంట్ అందుబాటులోకి వచ్చింది.
ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు మితిమీరిన విద్యుత్ కొనుగోళ్లు ప్రభుత్వానికి భారంగా మారింది. కరెంట్ కొంటున్న ట్రాన్స్ కో ఉత్పత్తి చేస్తున్న జెన్ కోలు విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదు. విద్యుత్ తో పాటు బొగ్గు కొనుగోళ్లకు సంబంధించి దాదాపు రూ.10,000 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు చెల్లింపులు చేయాల్సి ఉంది. మిగిలిన ప్రైవేట్ రంగంలోని విద్యుత్ సంస్థలు ట్రాన్స్ కో నుంచి బకాయిల వసూలు అవ్వక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన విద్యుత్ ప్లాంట్ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. సరఫరా చేసిన విద్యుత్ కు సంబంధించి ట్రాన్స్ కో బిల్లులు చెల్లించడం లేదనే నెపంతో యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నెల రోజులుగా కార్మికుల వేతనాలను నిలిపివేసింది. నవంబర్ 7వ తేదీన లాకౌట్ నోటీసిచ్చి ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. సంవత్సర కాలంగా టీఎస్ ట్రాన్స్ కో నుంచి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని.. కొద్దినెలలపాటు కార్మికుల వేతనాలు సర్దుబాటు చేసినప్పటికీ ఇక మీదట భరించే స్థితిలో లేనందున తమ ప్లాంట్ ను లాకౌట్ చేస్తున్నట్టుగా శాలివాహన విద్యుత్ సంస్థ స్పష్టం చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/shalivahana-power-plant-shut-down-25-91872.html
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.