Publish Date:Sep 25, 2019
కడప జిల్లా అసలే కరువు ప్రాంతం, వర్షాలు కురిస్తే అక్కడ ఒక భయం మాత్రం ముందుగా మొదలవుతుంది. అమాంతంగా ఉన్నట్టుండి భూమి లోపలకి కుంగిపోతూ ఉంటుంది, ఏం జరుగుతుందో అర్థం కాక ఆ గ్రామ ప్రజలందరూ అలాగే చూస్తుంటారు. గ్రామ సమీపంలో ఐదు నుండి యాభై అడుగుల లోతున భూమి కళ్ల ముందే కుంగిపోతుంటాయి. గుంతలు గుంతలుగా పెద్ద పెద్ద హోల్స్ ఏర్పడుతూ ఉంటాయి. వీటిని సింక్ హోల్స్ గా చెప్తూ ఉంటారు. గతంలో కూడా ఈ సమస్య వచ్చింది అప్పుడు అసలీ సమస్యకు కారణమేంటో కనుగొనే ప్రయత్నం చేశారు కానీ తెలియలేదు.
కడప జిల్లాలో సింక్ హోల్స్ స్థానిక ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి, చింతకొమ్మదిన్నె మండలం బుగ్గమల్లేశ్వర ఆలయం సమీపం లోని గూడవాండ్లపల్లెకు చెందిన రైతు సుబ్బారాయుడు పొలంలో ఇరవై అడుగుల లోతు, అయిదు అడుగుల వెడల్పు తో భూమి లోపలకి కుంగిపోయింది. నెల రోజుల క్రితం ఇప్ప పెంట గ్రామం లోని చెరువులో భూమి కుంగిపోయి అతిపెద్ద గోతులు ఏర్పడ్డాయి. గ్రామానికి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో ఉన్న చెరువులో రెండు చోట్ల భూమి కుంగిపోయింది.
సుమారు యాభై అడుగుల మేర కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూమి కుంగిపోయే సమయంలో వచ్చిన శబ్దాలు గ్రామస్థుల్ని హడలెత్తించాయి. రాత్రి వేళ కూడా గలగలమనే శబ్దాలు వస్తాయని గ్రామస్థులు తెలిపారు. ఈ సింక్ హోల్స్ కారణంగా తమకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి చెరువులో కుంగిపోయింది కానీ, అదే నివాస ప్రాంతాల్లో కుంగితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన ప్రస్తుతం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sinkholes-scare-residents-in-kadapa-district-25-89438.html
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.