Publish Date:Sep 26, 2019
దేశ వ్యాప్తంగా ఇ-సిగరెట్ లను కేంద్రం నిషేధించింది. స్కూలుకు వెళ్ళే పిల్లలు నుంచి కాలేజికి వెళ్లే యువకుల వరకూ అందరూ ఇ-సిగరెట్లను వాడటంతో కేంద్రం దీనిపై నిషేదాన్ని విధించింది. ఎవరైనా అమ్మితే చట్ట పరంగా చర్యలు తీసుకునే ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. వ్యాపారస్తులు ఇ-సిగరెట్ లను వెంటనే పోలీసులకు అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు, ఆయన హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా ఇ-సిగరెట్ లను అమ్ముతున్న వారిని పాతబస్తీలో దాడులు నిర్వహించి, టాస్క్ ఫోర్స్ తో పెద్ద మొత్తంలో సిగరెట్ లను సీజ్ చేశారు.
మామూలు సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదముందో ఇ-సిగరెట్లు తాగితే కూడా అంతే ప్రమాదముందని, ఇ-సిగరెట్లలో టొబాకో,నికోటిన్,కార్బన్ ఇవేవీ లేకపోయినా దాని నుంచి వచ్చే పొగ అత్యంత ప్రమాదకరమైందని అధికారులు చెబుతున్నారు. ఇ-సిగరెట్లు అత్యధికంగా విదేశాల నుంచే దిగుమతి అవుతుందని అధికారులు వెళ్లడించారు. ఇ-సిగరెట్ ఒక్కోదాని విలువ వెయ్యి నుంచి మూడు వేల లోపు ఉంటుందని చెబుతున్నారు. అది ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కావడం వల్ల అది సిగరెట్ అని ఎవరూ గుర్తించరు దీంతో కుటుంబ సభ్యులకు కూడా ఎటువంటి అనుమానం కూడా రాదు. దాని పరిమాణం చిన్నగా ఉండటం వల్ల పిల్లలు సులభంగా తీసుకెళ్ళగలుగుతున్నారు. ఇది విస్తరిస్తే దేశం మొత్తాన్ని నాశనం చేస్తుందనే ఆలోచనతో కేంద్రం దీనిపై నిషేదాన్ని విధించింది. అక్రమంగా ఎవరైనా దీనిని విక్రయించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకు రావాలని ఒక ఆర్డినెన్సును కూడా ప్రవేశ పెట్టింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/health-risks-of-e-cigarette-25-89460.html
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.