సింగరేణి దొంగలకు తాళాలు అప్పగిస్తున్న ప్రభుత్వం?
Publish Date:Sep 18, 2012
Advertisement
దొంగలకే తాళాలు అప్పగిస్తే అనే పెద్దల మాటను తూ.చ. తప్పకుండా ప్రభుత్వం అనుసరిస్తోంది. సింగరేణి పరిశ్రమలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన వారందరికీ పదోన్నతులు కల్పించి బదిలీ చేసిన ఘనత కూడా ప్రభుత్వానికే దక్కింది. సిఎండి సంతానం, శాస్త్రి పని చేసిన కాలంలో అతిపెద్ద కుంభకోణాలు వెలుగుచూశాయి. వీరిద్దరూ ప్రధానపాత్రధారులనీ తేలింది. అప్పట్లో ప్రభుత్వం నియమించిన రాంరెడ్డి కమిషన్ నివేదిక ఇప్పటిదాకా వెలుగుచూడలేదు. 1995లో గోదావరి ఖని ఓసీ`2లో టెక్నాలజీ కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపణ వచ్చింది. దీనిపై శాసనసభాకమిటీ వేశారు. ఆ కమిటీ 150మంది అధికారులపై ఆరోపణలను విచారించి 27మందిని దోషులుగా తేల్చింది. ఇప్పటి వరకూ ఆ దోషులపై చర్యలు తీసుకోలేదు. సింగరేణి డైరెక్టర్ పర్సనల్గా అయ్యంగార్ సీఎస్ఎల్ ట్యూబ్లైట్ల కొనుగోలులో కోట్లరూపాయల కుంభకోణం వెలుగుచూసింది. ఆయన్ని బదిలీ చేశారు. ఆ తప్పుపై కనీసం విచారణ కూడా నిర్వహించలేదు. గోదావరి ఖని 7ఎల్ఈపీ, జీడీకే 8ఏ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు చనిపోయిన ఘటనలపై జస్టిస్ బిలాల్ నక్వీ విచారణ కూడా వెలుగులోకి రాలేదు. తాజాగా సత్తుపల్లి ఓసీలో బొగ్గుగ్రేడ్ మార్చి అమ్మిన కుంభకోణం 2005`2011 మధ్యన వెలుగుచూసింది. దీనికి కారణమైన డైరెక్టర్ సింగరేణి వదిలి వెళ్లిపోయారు. దర్జాగా విదేశాల్లో ఆయన ఉద్యోగం చేస్తున్నారు. ఇదే కుంభకోణంలో పాత్రధారులైన కొందరికి పదోన్నతులు లభించాయి. గోదావరి ఖని మేడిపల్లి ఓసీలో వెలుగుచూసిన మరో కుంభకోణంపై ప్రధుత్వ ప్రధానకార్యదర్శి విచారణ ప్రారంబించారు. ఈ విచారణ న్యాయంగా జరగాలని కోరుతూ తానేమీ నేరం చేయలేదని ఒక డైరెక్టర్ ఇటీవలే సీఎస్కు రాశారని సమాచారం. భూపాలపల్లిలో సత్తుపల్లి తరహాలోనే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిలో దోషులనైనా శిక్షిస్తారో? క్షమిస్తారో వేచి చూడాలి. అసలు ఇన్ని కుంభకోణాలు వరుసగా వెలుగులోకి వచ్చినా దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారో అన్న అంశంలోనే దొంగలకు తాళాలు అప్పగించే వైఖరి బయటపడుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/singareni-theifs-24-17457.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





