జీవితం ఎంతటి కష్టాలను ఎదురొడ్డినా, పట్టుదల మరియు ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశమే హద్దుగా విరుచుకుపడవచ్చని నిరూపించారు భారత పారా అథ్లెట్ షర్మిలా ధన్కర్. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల షాట్పుట్ F57 విభాగంలో పసిడి పతకం సాధించి చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలోనే పారా అథ్లెటిక్స్లో భారత్కు స్వర్ణ పతకం లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ అపూర్వ విజయంతో భారత పారా అథ్లెటిక్స్లో సుదీర్ఘంగా సాగిన 20 ఏళ్ల పతక నిరీక్షణకు ఈ 40 ఏళ్ల వీరనారి తెరదించారు. కానీ, అంతర్జాతీయ క్రీడా వేదికపై బంగారు పతకంతో మెరిసిపోతున్న షర్మిల ప్రయాణం సాధారణమైనది కాదు. ఆమె సాధించిన ఈ విజయం వెనుక కన్నీళ్లు, గృహహింస, సమాజం చూపిన వివక్ష మరియు ఎన్నో ఏళ్ల పోరాటం ఉన్నాయి.
హర్యానాలోని ఛిత్రౌలి గ్రామంలో 1986 ఆగస్టు 15న ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబంలో షర్మిల జన్మించారు. ఆమె తండ్రి రైతు కాగా, తల్లి దృష్టి లోపంతో బాధపడుతుండేది. దురదృష్టవశాత్తూ రెండేళ్ల వయసులోనే పోలియో బారిన పడటంతో ఆమె ఎడమ కాలు పూర్తిగా బలహీనపడింది. కేవలం శారీరక వైకల్యంతోనే కాకుండా, ఆర్థిక ఇబ్బందులతో కూడా ఆమె బాల్యం సాగింది. ఇక 19 ఏళ్ల వయసులో వివాహం జరిగాక ఆమె జీవితం మరింత చీకటిగా మారింది. మొదటి భర్త చేతిలో తీవ్రమైన గృహహింసకు గురైంది. ఒక రాత్రి రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు దారుణమైన దాడిని తట్టుకుని, తన ఇద్దరు కుమార్తెలు అంజు (15), లక్ష్మి (13)లతో కలిసి ఇల్లు వదిలి బయటకు రావలసి వచ్చింది.
సమాజంలో ఒంటరిగా మిగిలిన షర్మిల జీవితాన్ని మళ్లీ నిలబెట్టింది ఆమె రెండో భర్త అజిత్ సింగ్. ఆమెలోని పట్టుదలను గుర్తించిన అజిత్, ఆమెను క్రీడల వైపు ప్రోత్సహించారు. అలా 34 ఏళ్ల వయసులో, 2020లో కోచ్ టెక్ చంద్ శిక్షణలో షర్మిల తొలిసారి షాట్పుట్ పట్టుకున్నారు. వయసు మళ్లిన వేళ క్రీడల్లోకి రావడం కష్టమే అయినప్పటికీ, అహోరాత్రులు శ్రమించి 2021లో పారా నేషనల్ ఛాంపియన్షిప్లో 7.40 మీటర్ల త్రోతో జాతీయ రికార్డు సృష్టించి స్వర్ణం సాధించారు. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ మరియు 2023 ఆసియా పారా గేమ్స్లలో నాలుగో స్థానంలో నిలిచి పతకానికి కొద్ది దూరంలో ఆగిపోయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు.
India First Para Athletics Gold Cwg,Sharmila Dhankar Shot Put F57 Story.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sharmila-dhankar-cwg-gold-medal-36-228374.html
అదుపుతప్పి బోల్తా పడిన 100 అడుగుల లోయలో పడ్డ ప్రైవేటు బస్సు..!
నర్సంపేట మాజీ శాసనసభ్యులు, దివంగత నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొండంత అండగా నిలిచారు.
అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏజీఐసీఎల్) ఈ ఐకానిక్ సిగ్నేచర్ బ్రిడ్జికి సంబంధించిన ఫీజిబిలిటీ, డీపీఆర్, కన్సల్టెన్సీ కోసం టెండర్ల ప్రక్రియను చేపట్టింది.
ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు, నియామక ప్రక్రియకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్న ఆయన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు.
క్యాన్సర్ మందుల విపరీతమైన ధరలపై కేంద్ర ప్రభుత్వ వివరణను పార్లమెంటరీ స్థాయి సంఘం తోసిపుచ్చింది. ట్రేడ్ మార్జిన్లపై తక్షణమే పరిమితులు విధించి, ప్రాణరక్షణ ఔషధాల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు! హైదరాబాద్, విజయవాడ, విశాఖ సహా ప్రధాన నగరాల్లో నేటి 18, 22, 24 క్యారెట్ల తులం పసిడి రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
పిరమల్ ఫైనాన్స్ మరియు బైన్ క్యాపిటల్ మద్దతుగల ఇండియాఆర్ఎఫ్, బెలగావికి చెందిన అశోక్ ఐరన్ వర్క్స్ యూనిట్ ఫైన్ ఎడ్జ్ ఇంజనీరింగ్ లో దాదాపు ₹2,000 కోట్లతో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఈ బిగ్ డీల్ విశేషాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలను ఇక్కడ తెలుసుకోండి!
అమెరికా సెనెట్లో ఇటీవల జరిగిన ఓటింగ్ లో శాంశనింగ్ రష్యా, ఇరాన్ యాక్ట్ 2026 బిల్లుపై చర్చ జరిగింది. చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో ఈ బిల్లు 86-11 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. సెనెట్లో ఆమోదం పొందిన ఈ బిల్లుఈ నెల 31న అమెరికా ప్రతినిధుల సభ ముందుకు రానుంది. లోయర్ హౌస్లో కూడా ఆ బిల్లు ఆమోదం పొందితే.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకంతో చట్టంగా మారి అమల్లోకి వస్తుంది.
లైనక్స్ వినియోగదారుల కోసం NordVPN వర్షన్ 5.3.0 నూతన అప్డేట్ను విడుదల చేసింది. ఆటోమేటిక్ GUI యాప్ ఇన్స్టాలేషన్, కొత్త డయాగ్నోస్టిక్స్ కమాండ్ మరియు సిస్టమ్ సపోర్ట్ వివరాలు పూర్తి స్థాయిలో తెలుసుకోండి.
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడులకు విరామం ఇచ్చి చర్చలకు మార్గం సుగమం చేసినా.. దిగి రావడానికి ఇరాన్ ససేమిరా అంటోంది.
దశాబ్దాల నాటి పాత ఎస్క్యుఎల్ ఇంజెక్షన్ లోపం మరియు ఒరాకిల్ డేటాబేస్ ట్రిక్ ఉపయోగించి హ్యాకర్లు విండోస్ సర్వర్లను ఎలా హైజాక్ చేస్తున్నారో తెలుసుకోండి. ఖంట్ టూల్కిట్ ప్రమాదం మరియు సెక్యూరిటీ రక్షణ చిట్కాలు ఇక్కడ చూడండి.
ఒకప్పుడు గార్డెన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరులో పచ్చదనాన్ని పునరుద్ధరించేందుకు డీకే శివకుమార్ 3 కొత్త భారీ పార్కులను ప్రకటించారు. 452 ఎకరాల వైమానిక దళ స్థలంతో పాటు నగర అటవీ ప్రాంతాల్లో లాల్బాగ్ తరహా పార్కుల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఐకియా, డెలాయిట్ సమీపంలోని రూ. 2,000 కోట్ల విలువైన 10 ఎకరాల స్థలం కోర్టు వివాదాల వల్ల 15 లక్షల టన్నుల అక్రమ డంపింగ్ యార్డ్గా మారిన పూర్తి కథనం.