సెజ్ భూములను అమ్మేస్తున్న పారిశ్రామికవేత్తలు
Publish Date:Apr 2, 2012
Advertisement
కాకినాడ ప్రాంతంలో ప్రత్యేక ఆర్థికమండలి కోసం రైతులనుంచి సేకరించిన భూములను సెజ్ నిర్వాహకులు దుర్వినియోగం చేస్తున్నారు. సెజ్ పేరుతొ వేలాది ఎకరాల భూమిని రైతులనుంచి అతి తక్కువ రేటుకు సేకరించారు. 2005 ప్రత్యేక ఆర్థికమండలి చట్టం ప్రకారం సెజ్ కోసం సేకరించిన భూమిని అమ్మే హక్కు ఎవరికీ లేదు. కానీ ఈ సెజ్ లో పరిశ్రమలు నెలకొల్పు తామంటూ ముందుకొచ్చిన కొందరు బోగస్ పారిశ్రామికవేత్తలు మొదట ఈ భూములను తమ పేర బదలాయించుకొంటున్నారు. తరువాత ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి బదులు ఆ బూములను చిన్న చిన్న పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారవేత్తలకు ఇష్టం వచ్చినట్లు విక్రయిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ సెజ్ భూములను ఎవరు తీసుకున్నారో వారే ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలి. వారికి ఇతరులకు లీజ్ కు ఇచ్చే హక్కు కూడా ఉండదు. కాని ఇక్కడ మాత్రం అన్ని నిబంధనలకు విరుద్ధంగానే జరుగుతున్నాయి. కొంతమంది వ్యక్తులకు సెజ్ ల్లో భూములు సేకరించి విక్రయించుకోవడం, లీజ్ కి ఇవ్వడం పెద్ద వ్యాపారంగా మారింది. దీంతో సెజ్ ల లక్ష్యం నెరవేరడం లేదు. పేద రైతులు మాత్రం తమకున్న కొద్దిపాటి భూములను కోల్పోయి నానా యాతనలు పడుతున్నారు.
http://www.teluguone.com/news/content/sez-lands-24-13102.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





