ట్రంప్ దూకుడికి అమెరికా సెనేట్ కళ్లెం!

Publish Date:Jun 23, 2026

Advertisement

అంతర్జాతీయ వేదికపై ఇరాన్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వదేశంలోనే ఊహించని  షాక్ తగిలింది. కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా ఇరాన్‌పై ఎలాంటి ఏకపక్ష సైనిక చర్యలు చేపట్టడానికి వీల్లేదంటూ యూఎస్ సెనేట్  తీర్మానాన్ని ఆమోదించింది. ఇరాన్ సరిహద్దుల వద్ద మోహరించిన అమెరికా సాయుధ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని  స్పష్టం చేసింది. వైట్‌హౌస్ వర్గాల నుంచి వస్తున్న యుద్ధ సంకేతాలకు కళ్లెం వేసేలా అమెరికా పార్లమెంట్ ఎగువ సభ  సెనేట్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ కీలక తీర్మానంపై సెనేట్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఓటింగ్ ప్రక్రియలో   తీర్మానానికి అనుకూలంగా 50 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 48 ఓట్లు  పడ్డాయి.  2 ఓట్ల స్వల్ప తేడాతో ట్రంప్ వైఖరిని తప్పుబడుతూ ఈ తీర్మానం ఆమోదం పొందింది.  అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు కీలక సెనేటర్లు సొంత పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వారు విపక్ష డెమొక్రాట్లతో చేతులు కలిపి ఈ యుద్ధ నిరోధక తీర్మానానికి మద్దతుగా ఓటు వేయడం సంచలనంగా మారింది.

ఇప్పటికే అమెరికా దిగువ సభ  హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోనూ ఇదే తరహా తీర్మానం భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. అమెరికా రాజ్యాంగ నియమాల ప్రకారం ఉభయ సభల ఆమోదం లభించిన ఇటువంటి సంయుక్త తీర్మానాలకు అధ్యక్షుడి అధికారిక సంతకం అవసరం లేదు. సాంకేతికంగా, చట్టబద్ధంగా ఈ తీర్మానం ట్రంప్‌ను పూర్తిగా కట్టడి చేయలేకపోయినప్పటికీ, రాజకీయంగా ఆయనపై   నైతిక ఒత్తిడిని పెంచుతుందనడంలో సందేహం లేదు.  ఇరాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన తర్వాత అమెరికా కాంగ్రెస్‌లోని రెండు సభలు ఏకతాటిపైకి వచ్చి ఇలాంటి తీర్మానాన్ని ఆమోదించడం ఇదే తొలిసారి కావడం విశేషం.  

By
en-us Political News

  
2026 లో ఈపీఎఫ్ఓ (EPFO) నిబంధనల ప్రకారం పెళ్లి, పిల్లల ఉన్నత చదువులు, సొంత ఇల్లు కొనుగోలు మరియు హోమ్ లోన్ రీపేమెంట్ కోసం మీ పీఎఫ్ అకౌంట్ నుండి ఎంత అడ్వాన్స్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చో మరియు దానికి ఉండాల్సిన సర్వీస్ అర్హతల పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
స్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ విరమణకు సరిగ్గా వారం రోజుల ముందు ఆయనను సొంత కేడర్‌కు పంపుతూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో సంజయ్ జాజు తెలంగాణ సీఎస్ గా బాధ్యతలు చేపట్టడం ఖాయమని తేలిపోయింది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సంజయ్ జాజును ఆయన సొంత కేడర్‌కు తిరిగి పంపేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
లీప్‌ఫ్రాగ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ NSE SME ప్లాట్‌ఫామ్‌పై గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక చిన్న కాంట్రాక్టర్ స్థాయి నుండి ఐపీఓ వరకు సాగిన ఈ కంపెనీ సక్సెస్ స్టోరీ, బిజినెస్ మోడల్ మరియు ఇన్వెస్టర్ల లాభాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
సిఎస్ఎమ్ టెక్నాలజీస్ ఐపీఓ (CSM Technologies IPO) జూన్ 24 నుండి ప్రారంభమైంది. ప్రైస్ బ్యాండ్, లాట్ సైజ్, లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) మరియు సబ్‌స్క్రిప్షన్ వివరాలు ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి!
బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్ కబ్బన్ పార్క్ వద్ద సాంకేతిక సమస్య పరిష్కారమైంది. ఉదయం 8:30 నుండి రైళ్లు నడుస్తున్నప్పటికీ మెజెస్టిక్, ఇందిరానగర్ లో రద్దీ కొనసాగుతోంది. ప్రత్యామ్నాయ మార్గాలు మరియు రీఫండ్ వివరాలు ఇక్కడ చూడండి.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా మహిళల జట్టు 113 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఎల్లీస్ పెర్రీ 71 రన్స్, 2 వికెట్లతో ఆల్‌రౌండ్ షో చేయగా, పాక్ 86 పరుగులకే ఆలౌట్ అయింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ఒక కీలక కేసులో నీరవ్ మోదీ.. తన కంపెనీ రుణం కోసం ఇచ్చిన వ్యక్తిగత గ్యారెంటీ కింద 10.7 మిలియన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో రూ. 100 కోట్లకు పైగా మొత్తాన్ని కచ్చితంగా చెల్లించాల్సిందేనని కోర్టు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నాగరాజు ఈ కేసులో నాగరాజు పాత్ర ఉందా? అన్న కోణంలో విచారిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం మొదలైన నాగరాజు విచారణ దాదాపు రాత్రి అంతా సాగినట్లు తెలుస్తోంది.
బాధితురాలైన వైద్య విద్యార్థిని తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అభిషేక్ పోరెల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మధ్య గత 3 ఏళ్లుగా ప్రేమాయణం సాగిందని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఆ ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలు అంటూ ఆయన పేర్కొన్నారు. ఇలా ఉండగా ఆయన రాజీనామాను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది. అయితే ఆయన వచ్చే నెల 20 వరకూ విధుల్లో కొనసాగుతారు.
నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయనీ, వీటి ప్రభావంతో ఈ నెల 20 వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 30వ వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ వర్షాల రాకతో ఎండల తీవ్రత ఒక్కసారిగా తగ్గి, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉందని తెలిపింది.
షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అక్కడ ఉన్న ఒక ఎలక్ట్రిక్ ప్యానెల్‌లో స్వల్పంగా మొదలైన మంటలు వేగంగా అక్కడి తాత్కాలిక గుడిసెలు, షెడ్లకు వ్యాపించాయి.
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే ఇటీవల సమావేశమైన ఐదుగురు కాపు నేతల్లో ఒకరిని
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.