శాసన సభలో తెలంగాణపై బిల్లు కోసం సీమాంధ్ర సభ్యుల ఆలోచన

Publish Date:Jun 28, 2013

Advertisement

 

నేడో రేపో తెలంగాణా అంటూ రాష్ట్ర రాజధానిలో మొదలయిన హడావుడిని చూసి మళ్ళీ సమైక్య నేతలు నిద్రలేచి, దానిని నిలువరించేందుకు సమావేశాలు మొదలుపెట్టేసారు. ముందుగా రేపు రాష్ట్ర పర్యటనకి వస్తున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కి రాష్ట్రాన్ని విడదీయవద్దంటూ వినతిపత్రం ఈయడంతో తమ కార్యక్రమాలు మొదలు పెట్టి, తెలంగాణాను అడ్డుకొనేందుకు క్రమంగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని వారు నిశ్చయించుకొన్నారు. రాయల తెలంగాణాను వ్యతిరేఖిస్తూ కర్నూలు లేదా అనంతపురం జిల్లాలలో ఒక బహిరంగ సభను నిర్వహించాలని కూడా యోచిస్తున్నారు. అయితే దీని ప్రధానోదేశ్యం రాయల తెలంగాణాను వ్యతిరేఖించడమే కాక, అసలు రాష్ట్ర విభజనను వ్యతిరేఖించడమే.

 

ఇక, ఇటునుంచి వీలుకాకపోతే అటు నుంచి నరుక్కు రావాలని సీమాంధ్ర నేతలు ఆలోచిస్తున్నారు. ఇంత వరకు తెరాస నేతలు శాసన సభలో తెలంగాణపై బిల్లు పెట్టమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తుండటం, దానిని ప్రభుత్వం తిరస్కరిస్తుండటం జరుగుతోంది. అయితే ఈసారి తామే తెలంగాణా బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని సీమంద్రా నేతలు భావిస్తున్నారు. తద్వారా సభలో దాదాపు సగంపైగా ఉన్న సీమంధ్ర సభ్యులు బిల్లుకి వ్యతిరేఖంగా ఓటేసి, తెలంగాణావాదానికి చట్ట సభలో కానీ, రాష్ట్రంలో గానీ పూర్తి మద్దతు లేదని తెలియజెప్పాలనుకొంటున్నారు. అయితే, ఇది వారు ఊహిస్తున్నంత తేలిక కాదు. సభలో సీమంద్రాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు 175 మంది సభ్యులున్నపటికీ, ఒకసారి బిల్లు ప్రవేశపెడితే, అప్పుడు తెరాస కూడా ఇదే అదునుగా చేసుకొని కాంగ్రెస్, వైకాపా, తెదేపా అధినేతలకు ‘తెలంగాణకు అనుకూలమో, వ్యతిరేఖమో తేల్చుకోమంటూ మరో మారు అగ్నిపరీక్ష పెట్టక మానదు. అటువంటి పరిస్థితులను చేజేతులా ఏ పార్టీ ఆహ్వానించుకోదు గనుక, దీనిని తెరాస తప్ప అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేఖించవచ్చును.

By
en-us Political News

  
పాక్ భారత్ లోకి ఉగ్రవాదుల చొరబాట్లకు అన్ని రకాలుగా సహాయపడుతోందన్నడానికి మరో తిరుగులేని ఆధారాన్ని భారత భద్రతా దళాలు కనిపెట్టాయి.
ప్రధాని నరేంద్ర మోదీ జీ అమరావతి పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ అమరాతి పనుల పున: ప్రారంభోత్సవానికి మే 2వ రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం సమీపిస్తుండటంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు.
ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేల సంఖ్యలో జనం ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఛత్తీస్‌గఢ్‌లో  ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.  ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ధర్మ తాళ్లగూడెంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. నక్సల్స్ ముక్త ఆపరేషన్ లో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో గత కొంత కాలంగా భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఎన్ కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు.
గ‌త కొన్నేళ్ల నుంచి కొత్త క‌శ్మీరం ఆవిష్క‌రిస్తున్న వేళ‌.. ఎన్న‌డూ లేని విధంగా ప‌ర్యాట‌కులు సంద‌డి చేస్తున్న స‌మ‌యాన‌.. కాశ్మీరం నిజంగానే ఒక భూత‌ల స్వ‌ర్గ‌మా అనిపించింది. క‌శ్మీర్ భార‌త్ లో భాగం అయితే మ‌న‌కు ఇంత‌టి భాగ్యం ల‌భిస్తుందా? అన్న కోణంలో స్థానిక క‌శ్మీరీలు కూడా ఎంతో ఆనందంగా ఉన్న సంద‌ర్భం కూడా ఇదే.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడితో.. భారత్ మొత్తం రగిలిపోతోంది. హిందూ టూరిస్టులే లక్ష్యంగా తీవ్రవాదులు జరిపిన కాల్పులతో.. దేశం ఏ క్షణమైనా పేలేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా మారింది. టెర్రరిస్టులు కేవలం హిందువులనే ఎంపిక చేసుకొని మరీ దాడి చేయడానికి కారణమేంటి? హిందువులను చంపడం వల్ల.. వారు సాధించేదేమిటి? పహల్గాం ఉగ్రదాడి వెనకున్న అసలు కోణమేంటి? అన్నది పెద్ద డిబేట్‌గా మారింది.
కాశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రవాదుల కిరాతక దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలకు సిద్ధం అయ్యింది.  ప్రాథమికంగా కొన్ని చర్యలను తీసుకుంది. అందులో భాగంగా దేశ సరిహద్దులను మూసేసింది.  వివిధ పనుల నిమిత్తం ఇండియాకు వచ్చిన  పాక్ జాతీయులు మే ఒకటవ తేదీ లోగా భారత్ విడిచి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అనంతరం ఇండియా కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని నిర్ధారణ కావడంతో ఇండియా కఠిన చర్యలకు రెడీ అయ్యింది.
మాజీ మంత్రి విడదల రజనీని విశాఖ విమానాశ్రయంలో నిర్బంధించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వైసీపీ హయాంలో యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ స్టోన్‌ క్రషర్స్ నిర్వాహకులను బెదిరించి రూ.2. 20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి విడుదల రజని, ఆమె మరిది గోపి, అలాగే వీరికి సహకరించిన అధికారి జాషూవా, మాజీ మంత్రి విడదల రజని పీఏ రామకృష్ణపైనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.
వైసీపీ నాయ‌కురాలు, చిలకలూరి పేట మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీకి భారీ షాక్ త‌గిలింది. ఆమె మ‌రిది.. విడ‌ద‌ల గోపీనాథ్ ను ఏసీబీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. విడదల గోపీనాథ్ విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారన్న కచ్చితమైన సమాచారంలో ఏసీబీ పోలీసులు ఆయనను హైదరాబాద్ లో ఈ తెల్లవారు జామున అదుపులోనికి తీసుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (ఏప్రిల్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 9 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మరో మూడు రోజుల్లో ( ఏప్రిల్ 27) ఇరవై నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుని రజతోత్సవ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను ఘనంగా జరుపుకునేందుకు సిద్దమవుతోంది. ఒక విధంగా ఇదొక అపూర్వ సందర్భం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.