లంచం కోసం దళారి.. ఇంట్లో నోట్ల కట్టలు..!

Publish Date:Aug 15, 2026

Advertisement

 

రైల్వే సీనియర్ డీఎంఈ అన్మోల్ ఉకే అరెస్ట్..!

లంచం తీసుకునేందుకు దళారిని రంగంలోకి దింపిన రైల్వే ఉన్నతా ధికారిని సీబీఐ రెడ్‌హ్యాం డెడ్‌గా పట్టుకుంది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ఎస్ఈసీఆర్) భిలాయ్ డివిజన్‌లో సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అన్మోల్ ఉకే లంచం కేసులో అరెస్టయ్యారు. ఫిర్యాదుదారుడికి సంబం ధించిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలంటే రూ.2 లక్షలు ఇవ్వాల్సిందేనంటూ అన్మోల్ ఉకే డిమాండ్ చేసినట్లు సీబీఐ వెల్లడిం చింది. అనంతరం జరిగిన చర్చల్లో ఆ మొత్తాన్ని రూ.1 లక్షకు తగ్గించేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలిపింది.

అయితే..లంచం తీసుకునే సమయంలో నేరుగా చేతికి డబ్బు తీసుకోకుండా తనకు నమ్మకమైన దళారి ద్వారా డబ్బులు ఇప్పించేందుకు అధికారి పథకం వేసినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ సమాచారంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు.ఆగస్టు 13న రూ.50 వేల లంచం దళారి ద్వారా అందుకుంటున్న సమయంలో అన్మోల్ ఉకేను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. లంచం వ్యవహారంపై అరెస్టుతో ఆగకుండా సీబీఐ అధికారులు తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు. 

రాయ్‌పూర్, భిలాయ్‌లోని అన్మోల్ ఉకే నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.ఈ సోదా ల్లో బయటపడిన నగదు చూసి అధికారులే అవా క్కయ్యారు. సుమారు రూ.77 లక్షల నగదు, మరో రూ.14 లక్షల విలువైన ఆభరణాలు గుర్తించినట్లు సీబీఐ వెల్లడించింది. లంచం కేసులో అన్మోల్ ఉకేను దళారితో పాటు ఆగస్టు 14న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను విచారించాల్సి ఉందని సీబీఐ కోరగా, న్యాయ స్థానం నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. లంచం డిమాండ్ నుంచి దళారి ద్వారా వసూళ్లు, ఆ తర్వాత సీబీఐ వల.. చివరకు సోదాల్లో భారీగా నగదు, ఆభరణాలు బయటపడటంతో ఈ కేసు రైల్వే వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇంకా కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

SECR DME Anmol Uke arrested, South East Central Railway, Bhilai Division, CBI,Anmol Uke, indian railways

By
en-us Political News

  
కాంగ్రెస్ ఎమ్మెల్యే, జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అది ఓ ఆలయం.. అమ్మ వారి సన్నిధి. భక్తులు వచ్చి వెళ్లే పవిత్రమైన ప్రదేశం.
రాష్ట్రంలో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు
వికసిత్ భారత్ సంకల్పంలో ఏపీ భాగస్వామ్యం..!
ఖమ్మం నగరంలో అత్యంత నివ్వెరపరిచే విషాద ఘటన చోటుచేసుకుంది.
విజయవాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన లోకేశ్..!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్మార్ట్ కార్డులు, రేషన్ బియ్యం పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతిలోని రాయపూడి పరేడ్ గ్రౌండ్స్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి
గోల్కొండ కోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
చెన్నై స్వాతంత్ర్య వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా త్రిష..!
స్వాతంత్ర్య వేడుకల్లో రామనారాయణరెడ్డి అస్వస్థత..!
హైదరాబాద్‌లోని చారిత్రాత్మక గోల్కొండ కోట వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక స్వాతంత్ర్య వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
చోరీ చేసిన చీరే దంపతులను పట్టిచ్చింది..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.