అయినన్ పోవలె హస్తినకు.. ఢిల్లీకి కేసీఆర్

Publish Date:Oct 28, 2022

Advertisement

తప్పులు చేసి దొరికిపోయి హెడ్మాస్టర్ దగ్గరికి వెళ్లాడు లెక్కల మాస్టరు, పిల్లలకు టెస్ట్ పెట్టి పరాగ్గా ఉండద్దని చెప్పి పంపారు పెద్దాయన..కొన్నాళ్లయ్యాక ఏకంగా హాఫియర్లీ పరీక్షల్లో ముగ్గురు వల్ల నలు గురు దొరికారని తెలిసింది. వాళ్లను మంచి విద్యార్థులే.. మా ఊరోళ్లే అని మార్కులేయించు కోవడానికి వెళ్లారు.. మళ్లీ హెడ్మాస్టర్ ఆగ్రహించారు. ఇది పొరపాటు కాదన్నారు. ఆ టీచర్ పెద్దాయన్ను సుముఖు నిగా చేసుకున్నారో లేదో గాని, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీ ఆర్ మాత్రం తనవారిని కాపాడుకోవడానికి మళ్లీ ఢిల్లీ ప్రయాణమయ్యారు. ఆమధ్యవరకూ ఢిల్లీ హైదరాబాద్ కి సమా నమా అని బహిరంగంగానే ప్రశ్నించిన తర్వాత హఠాత్పరిణామాలు ఆ ప్రశ్నకు నీవే బదులిచ్చుకో.. అంటూ పాత పాట పాడించారు కేంద్రం వారు. నిజవే.. అందుకే సొంత ఫ్లయిట్లో  మళ్లీ  ఢిల్లీ యాత్ర పయనం కావాల్సి వచ్చింది.

అసలే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పార్టీకి, రాష్ట్రానికి పరువు అమాంతం తీసేసిన కేసీ ఆర్ కుటుంబం ఇప్పుడు మరో సారి తన ప్రాంతీయులను, తన పార్టీవారిని తన వ్యూహం నుంచీ తనే తప్పించడానికి ఢిల్లీ ప్రయాణం కావల్సివచ్చింది. ఇది విచిత్రపరిస్థితి. ప్రత్యర్దులను దెబ్బతీయడానికి అనేక వ్యూహాలు, ఎత్తుగడలతో ముందంజ వేయాలి. కానీ అన్ని వ్యూహాలు బెడిసికొట్టడమే కేసీఆర్ కి మింగుడు పడటం లేదు. అన్ని ఆలోచించే రంగంలోకి దిగిన తర్వాత వ్యూహం దెబ్బతినడమేమిటని తెగ గింజుకుంటున్నా రు. లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రంలో కొత్త పథకంతో రాజ్యం చెలాయించవచ్చన్న ఆలోచన ఎలా వచ్చిందో తెలీదుగాని కుమార్తె కవిత ఎత్తుగడ తండ్రి కేసీ ఆర్ ను దిగ్భ్రమకి గురి చేసేంతగా బూమరాంగ్ అయింది. దాన్నుంచీ బయటపడేందుకు ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వచ్చింది. కేంద్రంలో ప్రధాని, హోం మంత్రిత్వ శాఖ వారిని బతిమిలాడి కుమార్తెను రక్షించుకునేందుకు తన విమానంలోనే ఢిల్లీకి పయనమై  అక్కడే మూడు నాలుగు రోజులు మకాం పెట్టారు. ఫలితం ఎలా ఉన్నా, ఏమి తేలనున్నా ఆ పర్యటన పార్టీని, రాష్ట్ర పరువును దెబ్బతీసిందనే అభిప్రాయాలు వెల్లువెత్తాయి. 

మొదటిసారి వెళితే బావగారు బాగానే పలకరించారని రెండో సారి అత్యుత్సాహంగా వెళితే అరటిగెల తేలేదని సదరు బావ తిట్టాడట.  ఇప్పుడు కేసీఆర్ రెండవ ఢిల్లీ పర్యటన పరిస్థితి అదే.  టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీ కి చేరింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ తీరును ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.

తనకు, కుమార్తెకు జరిగిన అవమానాన్ని తిప్పి కొట్టే వ్యూహం వేయాలని రోజుల తరబడి  ఆలోచించి బీజేపీ వారిని ఇరికించాలన్న వల విసిరారు. డబ్బుకు  లొంగ కుండా బయటపడిన నలుగురు పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ పరువు కాపాడా రని అందరూ పొగడ్గలతో ముంచెత్తారు. కానీ జరిగినదేమిటి.. ఆ నలుగురుని వల వేసి పార్టీలోకి తీసుకోవడానికి భారీ ప్రయత్నాలు చేయాల్సిన అవసరమే లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. అసలు వారికి అంత స్థాయే లేదని అన్నారు. అయితే అదంతా చాలా వ్యూహా త్మకంగా ఫామ్హౌస్లో ముందుగా కెమెరాల ఏర్పాట్లతోనే పకడ్బం దీగా చేయాలని అనుకున్నా రు. కానీ అనుకోగానే అన్నీ అయిపోవుగా. అసలు వారికి డబ్బు  ఆఫర్ చేస్తున్న దాఖలాలే లేవని తేలిం ది. అందువల్ల దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోనవసరం లేదని, అదంతా టీఆర్ ఎస్ పిచ్చి ఆలోచనే అని తేటతెల్లమయింది.  దీంతో తన రంగు బయటపడే సరికి తన కొంప పూర్తిగా మునిగే లోగానే, పరువు హుసేన్సాగర్ లో కలిసే లోగానే ఢిల్లీ పెద్దలను బతిమాలి బామాలి  ఈసారికీ కాసుకో దొరా అని అడగడా నికే కేసీఆర్ మరోసారి ఢిల్లీ ప్రయాణం కట్టారనేది విశ్లేషకుల మాట. 

ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు  రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ పర్యటనలో పలువురు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కేసీఆర్ కలవనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని హైదరాబాద్‌లో ఎండగట్టాలని కేసీఆర్ భావించారు. అయితే ఢిల్లీ వేదికగా మీడియా సమావేశం నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

By
en-us Political News

  
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.