Publish Date:Apr 19, 2024
జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే. అక్కడితో ఆగకుండా పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆయన కనుసన్నలలోనే నడుస్తాయి. అంతేనా సీఎం జగన్ విదేశీ పర్యటనలలో ఉన్న సమయంలో ఆయనే డిఫాక్టో సీఎం కూడా. అంతే కాదు ప్రభుత్వం నుంచి లక్షల్లో వేతనం తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికార ప్రతినిథిగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం తరఫునే కాదు, పార్టీ తరఫున మాట్లాడాలన్నా మీడియా ఎదుట సజ్జలే సాక్షాత్కరిస్తారు. సజ్జల గారి అతి కారణంగా వైసీపీలోనే పలుమార్లు అసంతృప్తి వ్యక్తమైన సంగతి తెలిసిందే.
అటువంటి సజ్జల నోటికి తాళం వేసుకోమని ఎన్నికల సంఘం హుకుం జారీ చేసింది. కోర్టుల తీర్పులనే లెక్క చేయని వైసీపీ నేతలకు ఈసీ హుకుంలు ఒక లెక్కా అని తీసిపారేయలేం. కోడ్ అమలులో ఉంది కనుక ఈసీ వాక్కు ను తుచ తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి ఉంది. వైసీపీ తరఫున రోజూ మీడియా ముందుకొచ్చే సజ్జల నోరుమూసుకోవలసిన పరిస్థితి వస్తే ఎలా? ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ప్రభుత్వం నుంచి జీతభత్యాలు పొందుతున్న 40 మంది ఏపీ సలహాదారులు కోడ్ పరిధిలోనికి వస్తారని ఈసీ పేర్కొంది. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని ఇకపై అది కూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఆదేశాలు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎలా తీసుకున్నారో కానీ సజ్జల మాత్రం ఇజ్జత్ కీ సవాల్ అన్నట్లుగా భావిస్తున్నారు. తనను నియంత్రించడానికి ఈసీ ఎవరు అన్న భావన వ్యక్తం చేస్తున్నారు. అవసరం అయితే ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో పార్టీ కోసం పని చేయడానికైనా రెడీ అంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల ప్రభ వెలుగుతోంది. సజ్జల నోటి వెంట ఒక మాట వచ్చిందంటే అది జగన్ నోటి వెంట వచ్చినట్లేనని పార్టీ వర్గాలు భావిస్తుంటాయి.
అలాంటి ఆయన ఇక మీడియాకు కనిపించకూడదు అంటే పార్టీ వాయిస్ వినిపింొచడం ఎలా? అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీంతో సజ్జల ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా యేసేయడానికి రెడీ అయిపోయారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
అదీ కాక ఇప్పుడు ఎలాగూ ఎన్నికల కోడ్ ఉంది. జగన్ కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. దీంతో ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన కార్యకలాపాలు కానీ, వ్యవహారాలు కానీ ఏవీ ఉండవు. అటువంటప్పుడు హోదా కోసం, వేతనం కోసం ముఖ్య సలహాదారుగా కొనసాగడం కంటే పార్టీ నేతగా ఉండి వ్యవహారాలు చక్కబెట్టడమే బెటర్ అని సజ్జల భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కీలక స్థానాలను అస్మదీయులు, అనుకూలురతో నింపేశారు. ఇప్పుడు ఇక అధికారులకు దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలు వారికి అర్ధమైపోయాయి. సో పార్టీ నేతగా ప్రచార కార్యక్రమాలు, మీడియాతో సమన్వయం వంటి పనులు చూడటమే బెటర్ అన్న అభిప్రాయంతో సజ్జల ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sajjala-to-resign-confine-25-174123.html
ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క ఎంపీ స్థానం.. అది కూడా మెదక్ ఎంపీ స్థానం దక్కుతుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వున్నాయి.
జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఓ రేంజ్ లో ఉంది. వేసవి వడగాడ్పులు ఎన్నికల హీట్ ముందు శీతల పవనాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో ఎన్నికల పోరు మరో ఎత్తు అన్న భావన నిన్నమొన్నటి దాకా ఉండేది. ఎన్నికలు 11 రోజుల్లో జరగనున్నాయి. ఫలితాలు రావడానికి జూన్ 4 దాకా వేచి చూడాలి.
ఓయులో కరెంట్ , నీటి కటకట ఉందని ఈ కారణంగానే హాస్టల్స్ మూసి వేస్తున్నారని బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఓయు చీఫ్ వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో క్రిషాంక్ ను చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ నుంచి పవన్ కు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఒక సారి గెలిచిన పార్టీ మరో సారి ఓడిపోతుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సహజం. అయితే ఒక్కో సారి మాత్రం ఒక ఓటమి ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. అంటే కళ్ల ముందరే ఓడలు బళ్లు అయిన దృశ్యం సాక్షాత్కరిస్తుందన్న మాట. సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలా ఉంది.
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.