Publish Date:Feb 13, 2025
ఏపీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరి ఆరు రోజులయ్యిందో లేదో.. జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ పగ్గాలు విజయమ్మకు అప్పగించాలంటూ జగన్ గాలి తీసేశారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై పోరాడేందుకే తాను వైసీపీలో చేరానని చెప్పిన శైలజానాథ్, ఆ లక్ష్యం నెరవేరాలంటే వైసీపీ పగ్గాలు జగన్ చేతిలో కాదు విజయమ్మ చేతిలో ఉండాలని అన్నారు.
తాను వైఎస్సార్ కు వీరాభిమానినని చెప్పుకున్న ఆయన.. జగన్ భావాలు, ఆలోచనలు తన ఆలోచనలకు దగ్గరగా ఉన్నందునే తాను కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరానన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ పగ్గాలను జగన్ నుంచి విజయమ్మ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. శైలజానాథ్ కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరి కేవలం ఆరు రోజులే అయ్యింది. ఇంతలోనే ఆయన జగన్ నాయకత్వంపై అపనమ్మకాన్ని, అయిష్టతను వ్యక్తం చేసి విజయమ్మకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అనడం వైసీపీలో సంచలనం సృష్టించింది. జగన్ సీటు కింద శైలజానాథ్ బాంబు పెట్టారన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది.
పార్టీ పగ్గాలు విజయమ్మకు అప్పగిస్తే పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వైసీపీలో చేరతారన్న సంకేతాలను శైలజానాథ్ తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు. వైఎస్సార్ కు రాష్ట్రంలో అసంఖ్యాక అభిమానులు ఉన్నారనీ, వారంతా కూడా ఆయన కుటుంబంలో ఆస్తుల తగాదా పట్ల తీవ్ర ఆవేదనతో ఉన్నారని చెప్పిన శైలజానాథ్.. వైఎస్సార్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో విజయమ్మకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ తో జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ ఓకే కానీ జగన్ నాయకత్వం మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పకనే చెప్పారు. అది కూడా విజయమ్మ తన కుమారుడు, కోడలు అబద్ధాలు చెబుతున్నారంటూ బహిరంగంగా చెప్పిన రెండు రోజులకే పార్టీ నాయకత్వం విజయమ్మకు ఇస్తేనే వైపీపీ బలోపేతం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
సరస్వతి పవర్ వాటాల విషయంలో జగన్, భారతి అబద్ధాలు చెప్పారని విజయమ్మ కుండబద్దలు కొట్టిన తరుణంలో శైలజానాథ్ వైసీపీ పగ్గాలను విజయమ్మకు అప్పగించాలడం సంచలనం సృష్టించింది. శైలజానాథ్ వ్యాఖ్యల పట్ల వైసీపీలో కూడా సానుకూలత వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద కోరి తెచ్చుకున్న శైలజానాథ్ జగన్ సీటుకే ఎసరు పెట్టారన్న టాక్ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sailajanath-gives-big-shock-to-jagan-39-192843.html
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.