ఆర్టీసీ సమ్మె.. మంత్రి తీరుపై సీఎం ఆగ్రహం!

Publish Date:Apr 24, 2026

Advertisement

 

రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం దాల్చడం, తద్వారా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయారంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై సీఎం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మె అంశం చర్చకు రాగా, ముఖ్యమంత్రి మంత్రుల తీరుపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమ్మె ఇంతవరకు వెళ్లే వరకు ఏం చేస్తున్నారని, కార్మికులను కట్టడి చేయడంలో ఎందుకు విఫలమయ్యారని ఆయన మంత్రిని పరోక్షంగా నిలదీసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

సాధారణ సమస్యలను కూడా ముందుగా పసిగట్టి, వ్యూహాత్మకంగా వ్యవహరించి పరిష్కరించాల్సింది పోయి, వాటిని తన స్థాయి వరకు తీసుకురావడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న ఘటనలు కార్మికులను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని, సమ్మె ఉధృతమైతే పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం ఉందని సీఎం హెచ్చరించారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో అధికారులు, మంత్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉందని సీఎం భావిస్తున్నారు. అందుకే, రవాణా శాఖపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రికి సూచించినట్లు తెలుస్తోంది.

మంత్రివర్గ సమావేశంలో జరిగిన ఈ పరిణామాలు రవాణా శాఖలో కలకలం రేపుతున్నాయి. సమ్మెను తక్షణమే నిలిపివేసి, కార్మికులతో చర్చలు జరిపి సాధారణ పరిస్థితిని నెలకొల్పాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించడంతో, మంత్రి పొన్నం ప్రభాకర్ తదుపరి కార్యాచరణపై అందరి దృష్టి నెలకొంది.

By
en-us Political News

  
అజిత్ దోవల్ రియాద్ పర్యటన, అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూఏఈ చర్చలు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలన్నీ ఎనర్జీ-సెక్యూరిటీ ప్రణాళికలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్. గోపాలరావు(90) గురువారం కన్నుమూశారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకారవాణాకు అంతరాలు.. ఇవన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా.. తన చమురు, గ్యాస్ సరఫరా నిరంతరతను పరిరక్షించుకోవడానికి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరును మరోసారి చాటిచెప్పింది.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు.
అర్హత కలిగిన డేటా సెంటర్లు తమ ప్రాజెక్టు పరిధిలో సొంత విద్యుత్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు. దీనివల్ల అవి నేరుగా విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుండి లేదా నర్జీ ఎక్స్ఛేంజీల నుండి విద్యుత్తును సేకరించుకోవచ్చు. సాధారణంగా డేటా సెంటర్లు నిరంతరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను కోరుకుంటాయి. ప్రస్తుత గ్రిడ్ వ్యవస్థలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు ఈ భారీ కేంద్రాలకు ఆటంకం కలగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఏపీ సర్కార్ డీడీఎల్ విధానాన్ని తీసుకువచ్చింది.
చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించాలని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు పోలీసు అధికారులకు పదోన్నతి కల్పిస్తే.. వారిలో ఒక్క సజ్జనార్ ప్రమోషన్ పట్ల మాత్రమే సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతుండటం ప్రత్యేకత, ప్రాధాన్యత సంతరించుకుంది.
భర్త హత్యకు ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దింపిన భార్య ఘటన వైయస్సార్ కడప జిల్లాలో సంచలనం రేపింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
టెక్ రంగానికి ప్రాణాధారమైన హెచ్-1బీ వీసాల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత ఏడాదిలో వీసాల జారీ 25 శాతం తగ్గడమే కాకుండా.. పిటిషన్లపై లక్ష డాలర్ల భారీ ఫీజు విధించడం వల్ల కంపెనీల దరఖాస్తులు ఏకంగా 87 శాతం పడిపోయాయి. దీనివల్ల ప్రతిభామంతులైన భారతీయ యువతకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు దక్కడం గగనంగా మారుతోంది.
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
డొనాల్డ్ ట్రంప్ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన ప్రవాస విధానాలు మరింత కఠినతరమయ్యాయి. అమెరికా ఫర్ అమెరికన్స్ ఓన్లీ అనే రాజకీయ నినాదం, వాస్తవానికి వలస వ్యతిరేక భావజాలానికి అధికారిక ముద్ర వేసినట్లుగా అనేక విశ్లేషకులు అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.