చిట్టీల పేర మోసాల సంఘటనలు ఎన్ని జరిగినా అమాయక జనం వంచనకు గురవడం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. బ్యాంకులలో వడ్డీ అంతకంతకూ తక్కువ అవుతుండటం, బ్యాంకు లావాదేవీలు గ్రామీణులకు ఒకింత సంక్లిష్టంగా అనిపించడంతో.. నమ్మకస్తులే కదాని తమ పొదుపునకు చిట్టీ పాటదారులను ఆశ్రయిస్తున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చిట్టీల నిర్వాహకులు కోట్లాది రూపాయలకు ఎగనామం పెట్టేసి తమ వద్ద చిట్టీలు వేసిన వారి నెత్తిన కుచ్చుటోపీ పెడుతున్నారు. తాజాగా ఇటువంటి ఘరానా మోసం వరంగల్ లో జరిగింది. నగరంలోని టీఆర్టీ కాలనీలో ఓ చిట్టీల నిర్వాహకులు ఏకంగా 30 కోట్లతో పరారయ్యాడు.
గత పదేళ్లుగా కాలనీలోనే ఉంటూ చిట్టీలు నిర్వహిస్తూ స్థానికుల నమ్మకాన్ని చూరగొన్న మూడెడ్ల వెంకటేశ్వర్లు హఠాత్తుగా రూ.30 కోట్లకు ఎగనామం పెట్టి ఉడాయించాడు. పదేళ్లుగా చిట్టీలు సక్రమంగా నిర్వహిస్తుండటంతో అతడిని నమ్మి, అధిక వడ్డీ ఆశతో రూ. లక్షలు ముట్ట చెప్పారు. అయితే గత కొద్ది కాలంగా మూడెడ్ల వెంకటేశ్వర్లు చిట్టీల నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. పాడుకున్న వారికి చిట్టీ డబ్బులు తరువాత తరువాత అంటూ వాయిదా వేయడం, అలాగే డిపాజిట్ దారులకు డబ్బులు ఇవ్వడంలో కూడా తీవ్ర జాప్యం చేస్తుండటంతో స్థానికులు ఆయనను గట్టిగా నిలదీశారు. దీంతో మూడెడ్ల వెంకటేశ్వర్లు దైవదర్శనం పేరు చెప్పి కుటుంబంతో సహా పరారయ్యాడు. విషయం తెలిసిన బాధితులు లేబర్ కాలనీలోని యాజమాని ఇంటి ఎదుట నిరసనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నవెూదు చేసి విచారణ చేపట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rs-30-crores-fraud-im-warangal-25-135362.html
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.