Publish Date:Feb 11, 2025
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ రాంకీ ఎస్టేట్స్ ఆధ్వర్యంలో రాంకీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) రెండో సీజన్ ఈనెల 15 నుంచి ప్రారంభం కానుంది. ఆర్పీఎల్ రెండో సీజన్కు సంబంధించి సన్నాహక కార్యక్రమం గచ్చిబౌలిలోని రాడిసన్ లో ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో టీమ్ ఇండియా మాజీ ప్లేయర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ ముఖ్యతిథిగా పాల్గొన్నారు. ఎంఎస్కే ప్రసాద్ తో పాటు రాంకీ గ్రూప్ సీఎఫ్వో ఎన్ఎస్ రావు, ప్రాంతీయ డైరెక్టర్ శరణ్ అల్ల జ్యోతిప్రజ్వలన చేశారు. ఆర్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా రాంకీ ఎస్టేట్స్ లోని కుటుంబాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందడి. కుటుంబాల మధ్య ఐక్యత పెరుగుతుంది. ఎస్టేట్ లో జీవనం సాగించే కుటుంబాల మధ్య మరపురాని, మరువలేని జ్ఞాపకాలను నెలకొల్పేందుకు ఆర్పీఎల్ దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
గత ఏడాది జరిగిన టోర్నీకి అద్భుతమైన స్పందన వచ్చిందని, దాంతో ఈ సారి ఆర్పీఎల్ ను మరింత విస్తరించామనీ నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడు టోర్నీలోని మ్యాచ్ లు రాత్రివేళల్లోనూ జరగనున్నాయి. గ్రూప్ దశ మ్యాచ్లు ఎప్పటిలాగే కొనసాగనుండగా.. ఫైనల్స్ ప్లడ్లైట్స్ కింద జరగనుంది. రామ్కీ ఎస్టేట్స్ లో పదివేలకుపైగా కుటుంబాలు టోర్నీలో చురుగ్గా పాల్గోనున్నాయి. గత సంవత్సరం ఆర్పీఎల్ క్రికెట్ టోర్నీలో పన్నెండు జట్లు ఆడగా.. ఈ సీజన్ లో 16 జట్లకు అవకాశం కల్పించారు. రాంకీ ఎస్టేట్స్ లోని పన్నెండు సముదాయాల నుంచి 16 జట్లు ఈ టోర్నీలో పాల్గోంటున్నాయి. 31 మ్యాచ్ లు జరుగుతాయి. రాంకీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ శనివారం (ఫిబ్రవరి 15) నుంచి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్లతో పాటు నాలుగు క్వార్టర్ ఫైనల్స్, రెండు సెమీ ఫైనల్స్ జరుగుతాయి. మార్చి 8వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఎమ్మెస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతుంది.
రాంకీ ఎస్టేట్స్లో నివాసదారుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించడంలో మేము మా పాత్రను పోషిస్తున్నామని రాంకీ ఎస్టేట్స్ గ్రూప్ సీఎఫ్ఓ ఎన్.ఎస్. రావు అన్నారు. రాంకీ ఎస్టేట్స్ ప్రాంతీయ డైరెక్టర్ శరణ్ అల్లా రామ్కీ ఎస్టేట్స్ లోని నివాసదారులు అత్యుత్తమ జీవనశైలిని అనుభవిస్తూనే వారి మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆర్పీఎల్ దోహదపడుతుందన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rpl-season-two-begins-from-febraury15th-39-192735.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.