హైదరాబాద్ నగరంలో మరోసారి రౌడీ షీటర్ల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక రెస్టారెంట్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. బిల్లు చెల్లించమని అడిగిన సిబ్బందిపై కత్తులు, కట్టెలతో విరుచుకుపడిన దుండగులు హింసకు దిగడంతో ఈ ఘటన నగరంలో రచ్చ రచ్చ సృష్టించింది. ఈ నెల 2వ తేదీన రాత్రి సమయంలో కొంతమంది యువకులు సరూర్నగర్లోని అర్బన్ రెస్టారెంట్కు వచ్చి భోజనం చేశారు. భోజనం అనంతరం రెస్టారెంట్ సిబ్బంది బిల్లు చెల్లించమని కోరగా, మొదట వాగ్వాదానికి దిగారు. క్షణాల్లోనే ఆ వాగ్వాదం తీవ్రరూపం దాల్చి, దుండగులు రెస్టారెంట్ సిబ్బంది మరియు యాజమాన్యంపై దాడికి పాల్పడుతూ హంగామా సృష్టించారు.
దుండగులు ముందే సిద్ధంగా వచ్చినట్లు అనిపించేలా కత్తులు మరియు కట్టెలతో హోటల్ సిబ్బందిపై విరచికుపడుతూ హోటల్లో ఉన్న అద్దాలు ఫర్నిచర్ మరియు ప్లేట్లు పగలగొడుతూ కస్టమర్లను బయటకు వెళ్లి పొమ్మంటూ బెదిరింపులకు గురి చేస్తూ నానా హల్చల్ సృష్టించారు. రెస్టారెంట్లో ఉన్న కస్టమర్లు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపట్లోనే అక్కడి వాతావరణం యుద్ధరంగంలా మారిపోయింది. ఈ దాడిలో పలువురు సిబ్బంది తీవ్ర గాయాలయ్యాయి.
ప్రస్తుతం బాధితులు హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు. రెస్టారెంట్ యాజమాన్యం ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సేకరించి నిందితుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా నేరచరిత్ర కలిగిన ఏదుల ప్రసన్ రెడ్డి మరియు ఏదుల యశ్వంత్ రెడ్డి అనుచరుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి పరారీలో ఉన్నారు. వారిని పట్టు కునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గతంలో వనస్థలిపురంలో సొంత అక్క భర్త లలిత్ను ప్రసన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి ఈ ఇద్దరు దారుణంగా హత్య చేశారు.
ఈ నిందితులను పట్టుకునేం దుకు పోలీసులు జల్లడ పడుతున్నారు. ఈ ఘటనతో సరూర్నగర్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని, రౌడీ షీటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సంఘటన మరోసారి నగరంలో రౌడీ షీటర్ల అల్లర్లు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో చూపిస్తోంది. .
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rowdy-sheeters-violence-in-saroornagar-36-219042.html
మే 8న హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. మే 16వ తేదీన భగీరథ్ను అరెస్ట్ చేశారు. అప్పటి నుండి అంటే దాదాపు 45 రోజులకు పైగా అతడు చర్లపల్లి జైలులోనే జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.
తమ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నందుకు ప్రతీకారంగానే పాక్ సైనిక కేంద్రాలపై దాడులు చేస్తున్నామని బలూచ్ రెబల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సైన్యంపై మరిన్ని భారీ ఎత్తున దాడులు చేస్తామని స్పష్టం చేశాయి.
తంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఖాసిం సులేమానీ మతికి ప్రతీకారంగా ట్రంప్ను టార్గెట్ చేస్తూ ఇరాన్ ఎత్తుగడలు వేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ నివేదికలు, రక్షణ రంగ తాజా విశ్లేషణల మేరకు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాల జాబితాలో భారత్ మూడవ స్థానానికి దూసుకెళ్లింది. అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో నిలవగా, అత్యాధునిక యుద్ధ పరిజ్ఞానం కలిగిన రష్యా రెండో స్థానంలో ఉంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఇప్పటివరకు మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చిన చైనాను అధిగమించి ఇండియా ఈ ఘనత సాధించింది.
స్టాక్ మార్కెట్లో సరైన ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్ చేసి ₹2 లక్షలు ఎలా పోగొట్టుకున్నానో ఈ వెబ్ స్టోరీలో చూడండి. కొత్త ఇన్వెస్టర్లు ఫోమో FOMO, స్టాప్ లాస్ లేకపోవడం వంటి ఏ తప్పులు చేయకూడదో మరియు రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల FII 60 బిలియన్ డాలర్ల అమ్మకాల సునామీకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. ముడి చమురు ధరల తగ్గుదలతో మారిన మార్కెట్ సమీకరణాలు మరియు దేశీయ ఇన్వెస్టర్ల రికార్డు కొనుగోళ్లపై పూర్తి విశ్లేషణ.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తొలిసారి అధికారికంగా కరూర్ జిల్లాలో పర్యటించనున్నారు. గతేడాది జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ పత్రాలను అందజేయడంతో పాటు, నూతన పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కేవలం 4 నెలల్లోనే 140 శాతం పెరిగి, 3 రోజుల్లో 18 శాతం లాభంతో సరికొత్త రికార్డు సృష్టించిన స్మాల్క్యాప్ ఏరోస్పేస్ స్టాక్ ఏక్వస్ (Aequs) గురించిన పూర్తి వివరాలు, భవిష్యత్ టార్గెట్ ధరలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. పాత ఎయిర్పోర్ట్ నుంచి విమానాలన్నీ ఇక్కడికే మారాయి. ప్రయాణ సమయం, దూరం, టెర్మినల్ అప్డేట్స్ మరియు విమానయాన సంస్థలు జారీ చేసిన కీలక జాగ్రత్తల పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
స్విగ్గీ మరియు ఎటర్నల్ షేర్లు 7 శాతం వరకు భారీగా పెరిగాయి. విదేశీ పెట్టుబడుల వాటా 50 శాతం కంటే తగ్గడం మరియు క్విక్ కామర్స్ మార్జిన్ల బూస్ట్ అవకాశాలపై బ్రోకరేజ్ సంస్థల లేటెస్ట్ రేటింగ్స్, టార్గెట్ ధరల పూర్తి వివరాలు మీకోసం.
భారతదేశంలోని మహిళా సంక్షేమ పథకాలతో లబ్ధిదారుల బ్యాంకు బ్యాలెన్స్ 84% పెరిగింది. మహారాష్ట్ర లాడ్కీ బహిన్ , ఒడిశా సుభద్ర యోజన పథకాల వల్ల నెలవారీ ఖర్చులు, యూపీఐ డిజిటల్ లావాదేవీలు మరియు కుటుంబ ఆర్థిక స్థిరత్వం ఎలా పెరిగాయో EAC PM తాజా నివేదిక ఆధారంగా తెలుసుకోండి.
భారత్ vs ఇంగ్లాండ్ 4వ టీ20 మ్యాచ్లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. సంజు శాంసన్ రీఎంట్రీ ఇస్తుండగా, తిలక్ వర్మ మరియు వైభవ్ సూర్యవంశీ అవుట్ కానున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వాతావరణ అప్డేట్స్, ట్రాఫిక్ జామ్స్ మరియు వర్షపాతం వివరాలు ఇక్కడ తెలుసుకోండి.