22ఏ సెక్షన్ రద్దు చేయకుంటే ప్రజా యుద్ధం.. ఏబీ వెంకటేశ్వరరావు.!

Publish Date:Jul 8, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన 22ఏ  సెక్షన్ కింద రైతుల భూములను ఆంక్షల జాబితాలో పెట్టడంపై ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సమర శంఖారావం పూరించారు.  ప్రభుత్వాలు రాత్రికి రాత్రే లక్షలాది ఎకరాల రైతుల సొంత భూములను ప్రభుత్వ భూములుగా మార్చేస్తూ 22ఏలో బందీ చేశాయని మండిపడ్డారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తక్షణమే 22 ఏ సెక్షన్‌ను  పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో  రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి  తిరుగుబాటుతప్పదని హెచ్చరించారు. ఆ ప్రజా తిరుగుబాటు.. మరో రామ-రావణ యుద్ధాన్నితలపింప చేయడం ఖాయమన్నారు. రావణుడు సీతను అపహరించి లంకలో దాచిన విధంగా ప్రభుత్వాలు 22ఏ లంకలో పేదల భూములను బందీ చేశాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

చరిత్ర కాలం నుంచి ఇప్పటివరకు ఏ ముస్లిం రాజులు కానీ, బ్రిటిష్ పాలకులు కానీ తాకని రైతుల భూ హక్కులను నేటి పాలకులు కాలరాస్తున్నారని ఏబీ వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి రైతులు సాగుచేసుకుంటున్న వంశపారంపర్య భూములను, కంప్యూటరీకరణ పేరుతో ఒకే ఒక్క రోజులో నిషేధిత జాబితాలోకి చేర్చారని విమర్శించారు. నోటీసులు ఇవ్వకుండా, కనీస సమాచారం లేకుండా రైతుల భూములను లాక్కోవడం దారుణమన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల బాపట్ల జిల్లాను 22ఏ విముక్త జిల్లాగా మారుస్తామని చేసిన ప్రకటనలపై ఆయన ఘాటుగా స్పందించారు.  పని చేయాల్సింది కలెక్టర్ అయితే.. క్రెడిట్ తీసుకుని పట్టాలు పంచేది మీరా?  అంటూ మండిపడ్డారు. వచ్చే 5 వారాల్లోగా బాపట్ల జిల్లాను 22ఏ సెక్షన్ నుంచి పూర్తిగా విముక్తం చేయకుంటే అక్కడి కలెక్టర్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ నుంచి కలెక్టర్, బ్రోకర్ల వరకు ఉన్న భూ విషవలయం ప్రభుత్వానికి తెలియంది కాదని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. 

రైతులు తమ భూమిని తమదిగా నిరూపించుకోవడానికి కోర్టుల చుట్టూ తిరుగుతూ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి రావడం దుర్మార్గమన్నారు. నోటీసు ఇవ్వకుండా 22ఏ జాబితాలో పెట్టిన ప్రతి సెంట్ భూమిని తక్షణమే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, బాపట్ల కలెక్టరేట్ వేదికగా ఈ ప్రజా ఉద్యమం  మొదలైందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. 

ABV, 22A Land Issue AP, Chandrababu Naidu, Bapatla Collector Challenge, Farmers Protest AP, Revenue Department Corruption

By
en-us Political News

  
డిలీట్ చేసిన డేటా కోసం పోలీసులు ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. రావణ్ అమాయక యువతులను టార్గెట్ గా చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం.. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు ఫోరెన్సీక్ ల్యాబ్ నివేదికలో వెల్లడైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ప్రముఖ నాయకులపై నిస్సిగ్గుగా విమర్శలు చేసినందుకు పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ప్రస్తుత చట్టాల ప్రకారం ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో కోర్టులో అతనికి తక్షణమే బెయిల్ లభించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 9 ప్రముఖ AI టూల్స్ యొక్క బలహీనతను వాడుకుని హాకర్లు భారీ బాట్‌నెట్ నెట్‌వర్క్‌లను సృష్టిస్తున్నారు. హాలూస్క్వాటింగ్ (HalluSquatting) అనే ఈ సరికొత్త సైబర్ ముప్పు గురించిన పూర్తి వివరాలు మీకోసం.
2026 సంవత్సరంలో ఉక్కపోత మరియు వేసవి ఎండలను తరిమికొట్టే సరికొత్త షార్క్, డైసన్ మరియు డ్రియో కంపెనీల టాప్ 5 కూలింగ్ ఫ్యాన్స్ వివరాలు, ధరలు మరియు వాటిలోని AI మోషన్ ట్రాకింగ్, వాటర్ మిస్ట్ టెక్నాలజీ ప్రత్యేకతలు మీకోసం.
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఫలితాల తర్వాత గ్లోబల్ చిప్ మార్కెట్లో భారీ పతనం. అమెరికా వాల్ స్ట్రీట్‌లో ఇంటెల్, ఏఎండీ, శాన్‌డిస్క్ షేర్లు కుప్పకూలాయి. నాస్‌డాక్ 500 పాయింట్లు పడిపోవడానికి గల పూర్తి కారణాలు, చమురు ధరల పెరుగుదల వివరాలు ఇక్కడ చూడండి.
అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు ఏపీసీఆర్‌డీఏ భారీ ఊరటనిచ్చింది. ఎకరాకు రూ. 40,000 కౌలు పెంపు, మరో 15 ఏళ్ల పొడిగింపుతో పాటు రూ. 1.5 లక్షల రుణమాఫీ ప్రకటనతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ ధర రూ.49 లక్షలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ నిజాలు, ఆ బాటిల్ ప్రత్యేకతలు ఇక్కడ చూడండి.
ఫీఫా వరల్డ్ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్ ముందు ఊహించని పరిణామం క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్, మరియు హోస్ట్ యూఎస్ఏ జట్లు టోర్నీ నుండి అవుట్ కావడంతో క్వార్టర్ ఫైనల్ టికెట్ల ధరలు భారీగా పడిపోయాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత్ ఘోర ఓటమి తర్వాత సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడంపై వివాదం చెలరేగింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన వివరణ, స్టేడియం బయట ఫ్యాన్స్ హంగామా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) మరియు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఉపయోగించి దీర్ఘకాలంలో కోట్ల రూపాయల సంపదను ఎలా సృష్టించాలో ఉదాహరణలతో సులభంగా తెలుసుకోండి.
బ్రిటన్ గ్రామీణ ప్రాంతాల్లో 14 చిన్న తరహా అణు రియాక్టర్ల (SMR) ఏర్పాటు కోసం పోలిష్ బిలియనీర్ 35 బిలియన్ పౌండ్ల భారీ పెట్టుబడిని ప్రకటించారు. AI డేటా సెంటర్ల విద్యుత్ అవసరాల కోసం గూగుల్ భాగస్వామ్యంతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు చూడండి.
హోమ్ సెక్యూరిటీ కెమెరాలు అనవసరమైన ఖర్చు అనుకుంటున్నారా? అర్ధరాత్రి వేళ ఇద్దరు దొంగలు గోడ దూకిన ఈ భయంకరమైన నిజ జీవిత సంఘటన మరియు కెమెరాల ప్రాముఖ్యత గురించి ఇప్పుడే చదవండి.
బిట్‌డిఫెండర్ ఐడెంటిటీ థెఫ్ట్ ప్రొటెక్షన్‌తో ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయండి. బడ్జెట్ ధరలో $1 మిలియన్ ఇన్సూరెన్స్, డార్క్ వెబ్ మానిటరింగ్ మరియు క్రెడిట్ అలర్ట్స్ పొందే పూర్తి వివరాలు మీకోసం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.