రోహిత్ శతకం వృధా.. లార్డ్స్ లో ఇంగ్లాండ్ విజయం.. సిరీస్ కైవశం.!

Publish Date:Jul 19, 2026

Advertisement

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్  ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ  స్కోరును సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్ 141 పరుగులతో   శతకబాదాడు.  జాకబ్ బెథెల్ 91 పరుగులతో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యంతో బలమైన పునాది వేశారు. ఆ తర్వాత వచ్చిన జో రూట్ 74 పరుగులు, కెప్టెన్ జాస్ బట్లర్ కేవలం 13 బంతుల్లోనే   41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.    భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణకు 2 వికెట్లు దక్కగా, మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

388 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ న ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు  147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత అభిమానుల్లో విజయంపై ఆశలు రేపారు. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ 84 బంతుల్లో 77 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను   ముందుకు నడిపించాడు. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 74 పరుగులు చేసి రాణించాడు. వీరు రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించడంతో భారత జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది.

ఇటీవలి కాలంలో ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతూ.. జట్టులో స్ధానమే అనుమానమన్న రీతిలో విమర్శలు ఎదుర్కొన్న  రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. 85 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో సెంచరీ పూర్తి చేసిన రోహిత్, మొత్తం 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 పరుగులు చేశాడు. ఈ శతకంతో రోహిత్ శర్మ క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన మొదటి భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. అ . ఇది రోహిత్‌కు 34వ వన్డే సెంచరీ కావడం విశేషం.

కానీ  బెథెల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ అవుటైన తర్వాత, భారత మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఇషాన్ కిషన్ 14 పరుగులు, శ్రేయస్ అయ్యర్ డకౌట్ కాగా, కెఎల్ రాహుల్ 12 పరుగులకే వెనుదిరిగారు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ 4 వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు. భారత్ ఇంగ్లాండ్ కు దీటుగా పోటీ ఇవ్వగలిగిందంటే.. అది రోకో (రోహిత్, కోహ్లీల) పోరాటంతోనే సాధ్యమైంది. టీమ్ ఇండియా బ్యాటర్లలో స్కిప్పర్ శుభమన్ గిల్, రోకో వినా మిగిలిన ఆటగాళ్లంతా ఇటా వచ్చి అలా వెళ్లారు. దీంతో టీమ్ ఇండియా  50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 27 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.  

Rohit Sharma Century Lords, India vs England 3rd ODI, Rohit Sharma 138 Runs,  IND vs ENG ODI Series 2026

By
en-us Political News

  
సీఐబీటీలో చదివిన ఉదయ్ రుద్రరాజు ఓపెన్ ఏఐ కంప్యూట్ విభాగానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీటీవోగా నియమితులయ్యారు ఒక సాధారణ ప్రాంతీయ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగిన తెలుగు తేజం ప్రస్థానం.. అంకితభావం, నైపుణ్యం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది.
ఈ సందర్భంగా కోర్టు వెలుపల జరుగుతున్న రాజకీయ చర్చలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక నేరపూరిత ఉదంతం. దీనిని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని పేర్కొంది.
ఈ తీవ్రమైన ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ, అవన్నీ అసత్యాలని, బేస్‌లెస్ ఆరోపణలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలతో సదరు మహిళా అధికారిణిపై కేసు పెడతానని మీడియాకు మెసేజ్ పంపారు. అయితే ఈ వార్త జాతీయ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం కావడం, తన ప్రతిష్ఠకు భంగం కలిగిందన్న మానసిక ఆందోళనకు ఆయన గురై.. హైదరాబాద్ మోతీనగర్‌లోని తన బంధువుల ఇంట్లో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా కల్చర్, పొగాకు రంగాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని
ప్రధాని మోడీకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెబుతూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చే నెల మొదటి తేదీన భోగాపురం రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం సమీపంలోని చాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 900 చదరపు గజాల ఖాళీ స్థలం కబ్జాలక్ష్యంగా.. ఆ భూమి అసలు యజమానులకు సంబంధం లేకుండా, స్థలాన్ని కబ్జా చేసేందుకు, లేని వ్యక్తులను ఉన్నట్లుగా, ఉన్న వారిని మరణించినట్లుగా చూపిస్తూ బోగస్ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. తద్వారా న్యాయబద్ధమైన వారసుల పత్రాలను ఫోర్జరీ చేసి అక్రమంగా యాజమాన్య హక్కులను పొందడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠ భరిత పరిణామాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది.
రాష్ట్రంలో మాతా–శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోన్న ప్రభుత్వం
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఉభయ సభలను నీట్ వివాదం కుదిపేసింది.
సీజేపీ చలో పార్లమెంట్ ఉద్రిక్తం, పోలీసుల ఆంక్షలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.