అయోధ్యవిరాళాల చోరీ కేసులో రాజకీయ జోక్యంపై సుప్రీం అసహనం.!

Publish Date:Jul 20, 2026

Advertisement

అయోధ్య రామమందిర విరాళాల చోరీ వివాదంపై సీబీఐ దర్యాప్తు లేదా కాగ్ (CAG) ఆడిట్ కోరుతూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం (జులై 20) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు వెలుపల జరుగుతున్న రాజకీయ చర్చలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.  ఇది కేవలం ఒక నేరపూరిత ఉదంతం. దీనిని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని పేర్కొంది. కోర్టులు రాజకీయాలు చేసే వేదికలు కావంటూ..  పిటిషనర్లకు, రాజకీయ పక్షాలకు ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టం తన పని తాను చేసుకుపోయేలా, నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగేలా చూడడమే తమ పరిధి అని వెల్లడించింది.

ఇదలా ఉండగా.. ఈ కేసు దర్యాప్తును కేవలం స్థానిక పోలీసులకే పరిమితం చేయకుండా,  పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి క్లిష్టమైన ఆర్థిక అక్రమాలను ఛేదించడంలో అపారమైన అనుభవం ఉన్న ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) పునర్వ్యవస్థీకరించాలని యూపీ సర్కార్ ను ఆదేశించింది.  దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు ఐజీ   రేంజ్ స్థాయి అధికారిని ఈ సిట్‌లో నియమించాలని సూచించింది.

Ayodhya Ram Mandir, Donation Theft Case, Supreme Court Status Report, Shri Ram Janmabhoomi Trust, SIT Probe

By
en-us Political News

  
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన శాంతియుత నిరసనలు, పోలీసుల లాఠీఛార్జ్ వ్యవహారం ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం మెట్లుక్కింది.
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో మరియు జాతీయ పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న వరుస అక్రమాలు, అవకతవకలకు నిరసనగా విద్యార్థి సంఘాలు పోరాటబాట పట్టాయి.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం..!
10 ఏళ్లలో 152 లీకేజీలు..రాహుల్ సంచలన ఆరోపణలు..!
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన అధికారిక ఎక్స్ (X) వేదికగా తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించిన తాజా ఊరటపై స్పందించారు.
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రమాదానికి గురై ఎడమ మోకాలికి గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సహజ వనరుల నిర్వహణ, ముఖ్యంగా ఇసుక విధానం అనేది కేవలం ఒక పరిపాలనా నిర్ణయంగా కాకుండా ప్రభుత్వాల భవిష్యత్తును తేల్చే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది.
నరేంద్ర, ధర్మెంద్ర ఇద్దరూ దేశాన్ని దోచుకుంటున్నారు..!
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై పార్లమెంట్ వేదికగా సమగ్రంగా చర్చించేందుకు తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కోట్లాది మంది భక్తులు ఆరాధ్యదైవంగా పూజించే తిరుమల కొండకు వెళ్లే మార్గంలో ఆంజనేయ స్వామి విగ్రహం మాయమవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నిత్యం వేలాది మంది భక్తుల నమస్కారాలు, నిత్య ధూపదీప నైవేద్యాలు అందుకునే ఆలయంలోనే ఈ దొంగతనం జరగడం భక్తుల తిరుమలలో భద్రతా చర్యలలోని డొల్ల తనాన్ని బట్టబయలు చేసింది.
జమ్మూకాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి తమ క్రూరత్వాన్ని బయటపెట్టారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ)లో మహిళ ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో నమోదైన కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.