క్రికెట్ ఆడటానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి..!

Publish Date:Jul 26, 2026

Advertisement

 

కూకట్‌పల్లిలో టిప్పర్ ఢీకొని యువకుల దుర్మరణం..!

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ స్కూటీని బలంగా ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువ కుడు తీవ్రంగా గాయప డ్డాడు. మహేష్ (17), లక్ష్మీ తేజ (17)తో పాటు మరో యువకుడు ఆదివారం ఉదయం స్కూటీపై క్రికెట్ ఆడేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డుపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన టిప్పర్ లారీ వారి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. 

ఢీకొన్న వేగానికి స్కూటీ నుజ్జు నుజ్జు కాగా, మహేష్, లక్ష్మీ తేజ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో స్థాని కులు వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివే గమే ఈ ప్రమాదానికి కారణమా అనే కోణంలో విచారణ చేపట్టారు. అలాగే ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొనగా, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి.
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా అడిగి తెలుసుకున్నారు.
దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.
భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సరిహద్దుల భద్రతను కాపాడేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ
బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
ఇటీవల హైదరాబాద్‌ నగరంలో సంచలనం సృష్టించిన రిచ్ కిడ్ కేసు మరువకముందే..అలాంటి తరహాలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
రాజకీయ ప్రవేశంపై కాక్రోచ్ జనతా పార్టీ క్లారిటీ..!
నల్గొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు వద్ద ఆదివారం తెల్లవారుజామున తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది.
ధరణి పోర్టల్‌లో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలు, సాంకేతిక లోపాలు, ప్రభుత్వానికి జరిగిన రెవెన్యూ నష్టంపై సమగ్ర విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
జింబాబ్వే పర్యటనలో భారత క్రికెట్ జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
నైతిక బాధ్యతతో రాజీనామా చేసిన భారత కేంద్రమంత్రుల చరిత్ర..!
దేశరాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.