సీసీ కెమెరాల పేరుతో కడప రెడ్డమ్మ వసూళ్లు?

Publish Date:Jan 7, 2026

Advertisement

 

రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి.. కడప ఎమ్మెల్యే గా గెలిచిన రోజు నుంచి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుఉన్నారు.. పార్టీ ఏదైనా సరే తనపై వచ్చే విమర్శలకు అంతే ధీటుగా స్పందిస్తారు. దశాబ్దా కాలంగా కడప కార్పొరేషన్ మేయర్‌గా ఉన్న సురేష్ బాబు చెక్ పెట్టి పదవి నుంచి దించేశారు. తన వ్యవహార శైలితో సొంత పార్టీ నేతలను దూరం పెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

ఇదంతా ఓ లెక్కైతే ఇప్పుడు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆమె భర్త టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి కడపలో సీపీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం జిల్లాలో దూమారం రేపుతోందట.. 2024 ఎన్నికల ముందు కడప నగరంలో నేరాలు అరికడతామని, గంజాయి స్మగ్లర్లకు చెక్ పెడతామని హామీ ఇచ్చారు కడప రెడ్డెమ్మ. ఇప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు నరగంలో సీసీ కెమెరాలు అవసరమని దాతల సహకారంతో పి4 పద్దతిలో నిధుల సమీకరణకు ఎమ్మెల్యే దంపతులు చేపట్టారంట.

నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం సొంత పార్టీకి చెందిన మైనారిటీ నేత రబ్బానిని రూ.10 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి కోరారు. ఇవ్వకపోతే పార్టీకి మీతో సంబంధాలు కట్ చేస్తాం మీ కథ చూస్తాం అని హెచ్చరించడం ఇప్పుడు జిల్లాలో దూమారం రేపుతోంది. సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం అని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు సీసీ కెమెరాల పేరుతో వసూళ్లు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో మైనారిటీ నేత రబ్బాని తండ్రి జిలాని  అస్వస్ధతకు గురికావడం చర్చినీయంశంగా మారిందట. జిలానిని శ్రీనివాసులు బెదిరించడం వల్లే అనారోగ్యానికి గురై హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.  

కడప నగరంలో సీసీ కెమెరాల వివాదం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడితున్నారు మాజీ డిఫ్యూటీ సియం అంజాద్ బాషా. అయితే ఎమ్మెల్యే మాత్రం ఎవరు ఏం అనుకున్నా ఎన్ని ట్రోల్స్ చేసినా తగ్గేదేలే అంటున్నారు. కడప నగరం గంజాయికి అడ్డాగా మారిందని, గంజాయి ఫెడ్లర్లకు చెక్ పెట్టాలంటే ప్రతి గల్లీలో సిసి కెమెరాలు అవసరం అంటున్నారు.

సీసీ కెమెరాల కోసం కోటి రూపాయలకి పైగా నిధులు అవసరం అని అందుకే పి4 మోడల్లో నిధులు సమీకరిస్తున్నామని ఆమె సమర్ధించుకుంటున్నారు.  అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు దాతలు ముందుకు రావాలని సీసీ కెమెరాలు అందించే కంపెనీ పేరుతో చెక్ ఇవ్వాలని కోరుతున్నారు . అయితే మీ పార్టీ అధికారంలో ఉంది... ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి కెమెరాలు ఏర్పాటు చేయాలి కానీ ఇలా బెదిరించి వసూలు చేయడం ఏంటని వైసీపీ విమర్శులు చేస్తుంది.

By
en-us Political News

  
హైదరాబాద్‌ నగర శివారులోని మీర్‌పేట్ ప్రాంతంలో చోటు చేసుకున్న విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు.
పక్క రాష్ట్రంతో సయోధ్య లేకుండా తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డికి హైకోర్టులో కీలక ఊరట లభించింది.
పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల్లో ఆయన మాట్లాడారు.
ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది. గవర్నర్ కార్యాలయానికి ఈ- మెయిల్ అందగానే ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు.
గుడిమల్కాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నిందితుడిగా చేర్చడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ కేసుపై విస్తృతంగా వాదనలు విన్న హైకోర్టు.. నవదీప్ వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలూ స్వాధీనం కాలేదని స్పష్టం చేసింది.
టాలీవుడ్ హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేరుతో...ఫేక్ నెంబ ర్ తో..ఆయన ఫొటోతో వాట్సాప్ క్రియేట్ చేసి మెస్సేజ్ లు పంపిస్తున్నారని వెల్ల డైంది.
జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ వైద్యులకు కరోనా మహమ్మారి నుంచి రక్షణకు కనీసం మాస్కులు కూడా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించడమే జగన్ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టడానికి కారణమైంది. ప్రభుత్వ డాక్టర్ అని కూడా చూడకుండా.. విశాఖపట్నం వీధుల్లో ఆయనను అర్థనగ్నంగా చేసి, చేతులు వెనక్కి విరిచి కట్టి పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.
న్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పశ్చిమబెంగాల్ లోని ఐప్యాక్ ప్రధాన కార్యాలయంలో జరిపిన సోదాలలో.. గతంలో ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎన్నికల వ్యూహాలపై సహకారం అందించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గుట్టు బయటపడింది. ఆ ఆర్థిక అవకతవకలపై కూడా ఇప్పుడు ఈడీ దృష్టి సారించినట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఆ పరిస్థితి లేకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది.
ఆవకాయ అన్నది కేవలం ఆహారం కాదనీ, అది మన సంప్రదాయం సాంస్కృతిక వైభవానికి చిహ్నమనీ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ హోటళ్లు ఉన్నా, అక్కడ ఏపీ షెఫ్ లు ఉంటారనీ, అదీ ఆంధ్రా వంటలకు ఉన్న ప్రత్యేకత అనీ చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.