ఇరాన్- ఇజ్రాయెల్ మ‌ధ్య‌ఈ యుద్ధం అస‌లెందుకు?.. అమెరికా పాత్ర ఎంత‌?

Publish Date:Jun 16, 2025

Advertisement

ఇజ్రాయెల్ ఒక మొండి దేశం. దీని  మెయిన్ పాల‌సీ శిక్షించు, తుద ముట్టించు. మ‌న‌తో యుద్ధం అని భావించ‌డానికే భ‌య‌ప‌డాలి. మ‌న‌పై దాడి చేయ‌డానికే ద‌డుచుకోవాలి? ఇదీ ఇజ్రాయెల్ బేసిక్ థియ‌రీ. కేవ‌లం దేశాలు వాటి సైన్యాలు ఇత‌ర‌త్రా వ్య‌వ‌స్థ‌ల మీద మాత్ర‌మే కాదు.. వ్య‌క్తుల మీద కూడా ఇజ్రాయెల్ క‌న్నేసిందంటే వారు నామ రూపాల్లేకుండా పోతారు. కావాలంటే ఇదే యుద్ధంలో చూడండి.. ఇరానీ అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను ఇజ్రాయెల్ ఏ విధంగా మ‌ట్టుబెట్టిందంటే.. టెహ్రాన్ లో కారు బాంబులు పెట్టి ఆరుగురు అణు శాస్త్ర‌వేత్త‌ల‌ను తుద‌ముట్టించేసింది. దీనికి కార‌ణ‌మేంటంటే గ‌త కొంత కాలంగా  ఇరాన్ ఇజ్రాయెల్ పై అణు దాడి చేస్తాన‌ని చెప్ప‌డ‌మే. 

కేవ‌లం మాట‌లే క‌దా? అన్న కోణంలో కొన్నాళ్ల పాటు ఏమ‌ర‌పాటుగా ఉంటూ వ‌చ్చింది ఇజ్రాయెల్. ఈ లోగా అణు నిర్వ‌హ‌ణ సంస్త ఒక ప్ర‌క‌ట‌న చేసింది. గ‌త ఇర‌వై ఏళ్ల‌లో ఎప్పుడూ లేని విధంగా ఇరాన్ అణు నియ‌మాల‌ను ఉల్లంఘించిన‌ట్టు తేల్చి చెప్పింది. దీనంత‌టికీ కార‌ణం ఇరాన్ పెద్ద ఎత్తున యురేనియం శుద్ధి చేయ‌ట‌మే. ఈ మొత్తం యురేనియంతో  9 అణుబాంబులు చేయ‌వ‌చ్చు. ఈ వార్త ఎప్పుడైతే తెలిసిందో ఇక ఇజ్రాయెల్లో ఓపిక న‌శించి పోయింది. దీంతో ఎలాంటి ప్ర‌క‌ట‌న‌ల్లేకుండా వారికెంతో ప‌విత్ర‌మైన శుక్ర‌వారం తెల్ల‌వారు జామున మూడున్న‌ర గంట‌ల స‌మ‌యంలో ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్ పై భీక‌ర దాడుల‌కు తెగ‌బ‌డింది ఇజ్రాయెల్.  ఆ దేశ అణు నిల్వలుండే ప్రాంతం న‌టాంజ్ పై భారీగా విరుచుకుప‌డింది. దీంతో నేల‌మాళిగ‌లో ఉన్న అణు కేంద్రం పై క‌ప్పు దారుణంగా దెబ్బ తినింది. ఇక టెహ్రాన్ కి వంద కిలోమీట‌ర్ల దోరంలో ఉండే మ‌రో అణు కేంద్రంపైనా దాడులు చేసింది ఇజ్రాయెల్. ఇరాన్ అణు కేంద్రాల‌పై దాడులు చేయ‌డం మాత్ర‌మే  కాకుండా.. ఆ దేశ ఆర్ధిక మూలాలైన చ‌మురు బావులు, ఇంకా గ్యాస్ నిల్వ‌ల‌పైనా దాడులు చేసింది. ఒకే సారి 11 గ్యాస్ ట్యాంకుల‌ను పేల్చ‌డంతో అవి ఒక్కొక్క‌టీ  పేలుతూ భారీ అగ్ని  కీల‌లు ఎగ‌సిప‌డ్డం ఆ ప్రాంతంలో భీతావ‌హ వాతావ‌ర‌ణం నెల‌కొంది. 

తొలి రోజు అంటే శుక్ర‌వారం చేసిన దాడిలో ఇరానీయ‌న్ సైనిక  అధికారుల‌తో పాటు, అణు సైంటిస్టుల‌ను సైతం మ‌ట్టుబెట్ట‌డంతో పాటు వంద మంది వ‌ర‌కూ చ‌నిపోయిన‌ట్టు చెప్పింది ఇరాన్ స్టేట్ టీవీ. ఇదిలా ఉంటే శ‌నివారం ఆర్ధిక మూలాల‌పై దెబ్బ తీసి దారుణ‌మైన న‌ష్టాన్ని  క‌లిగించింది. ఇది మా దేశంపై ఆర్ధికంగా ఎంతో ప్ర‌భావం చూపుతుంద‌ని ప్ర‌క‌టించింది ఇరాన్ చ‌మురు మంత్రిత్వ శాఖ‌. ఆదివారం ఒక అపార్ట్ మెంట్ పైనా ఇజ్రాయెల్ దాడి చేయ‌డంతో 29 మంది చిన్నారుల‌తో పాటు 60 మంది పౌరులు మ‌ర‌ణించారు.

ఇరాన్ సైతం ఇజ్రాయెల్ పై క్షిప‌ణి దాడులు చేసింది. మే నాలుగున ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి త‌మ ద‌గ్గ‌ర 1200 కి. మీ రేంజ్ అత్యాధునిక మిస్సైల్ ఉంద‌ని. అది ఇజ్రాయెల్ పై వాడ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించిన‌ట్టే వాటిని వాడింది. హ‌జ్ ఖాసిం బాలిస్టిక్ క్షిప‌ణి ప్ర‌యోగం చేసింది. ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్లోనూ మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  అయితే ఈ దాడుల వెన‌క అమెరికా పాత్ర ఉన్న‌ట్టు అనుమానిస్తోంది ఇరాన్. కార‌ణం గ‌త కొంత కాలంగా ఇరాన్- అమెరికా మ‌ధ్య అణు ఒప్పందా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇవి ఎంత‌కీ తెల‌డం లేదు. దీంతో అమెరికా ఇజ్రాయెల్ చేత ఈ దాడులు చేయిస్తున్న‌ట్టుగా అనుమానిస్తోంది ఇరాన్. అన్న‌ట్టుగానే ట్రంప్ కూడా మాతో అణు ఒప్పందం ఇక‌నైనా చేసుకోవాల్సిందిగా అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇప్పుడు చేసుకోకుంటే ఇరాన్ సామ్రాజ్యంలో ఏదీ మిగ‌ల‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

అయితే దీన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ఖండిస్తోంది. ఈ స‌మ‌యంలో అణు ఒప్పందాలు చేసుకోవ‌డ‌మేంట‌న్న‌ది ఇరాన్ వాద‌న‌. అంతే కాదు ఒక ప‌క్క ఇజ్రాయెల్ దాడుల‌కు మ‌ద్ధ‌తు తెలుపుతూ మ‌రో ప‌క్క మాతో ఒప్పందాలు చేసుకోడానికి ఎగ‌బ‌డ్డ‌మా? అన్న‌ది ఇరాన్ ప్ర‌ధాన‌ ఆరోప‌ణ‌.

అయితే అమెరికా మాత్రం అక్క‌డ యుద్ధం జ‌రుగుతుందా లేదా? అన్న‌ది చూడ‌దు. ర‌ష్యాతో ఉక్రెయిన్ యుద్ధంలో ఉండ‌గానే.. ప‌దేళ్ల ఖ‌నిజ ఒప్పందం చేసుకోవ‌డం చూసే ఉంటాం. భార‌త్- పాక్ మ‌ధ్య ఘ‌ర్ష‌న  సైతం క్యాష్ చేసుకోవాల‌ని చూసింది యూఎస్. ఇప్పుడు ఇరాన్- ఇజ్రాయెల్ వార్ వంతు.  ఈ దాడుల‌తో త‌మ‌కెలాంటి సంబంధం లేదంటూనే తాను చెబితే ఈ యుద్ధం క్ష‌ణాల్లో ఆగిపోతుంద‌ని అంటున్నారు ట్రంప్.. ఒక ప‌క్క చూస్తే క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు 150 డాల‌ర్ల‌కు పెరిగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ్.

దీనంత‌టి వెన‌క అమెరికా యుద్ద ప‌న్నాగం  ఉన్న‌ట్టుగా అంచ‌నా వేస్తున్నారు ప‌శ్చిమాసియా వ్య‌వ‌హారాల నిపుణులు. ఈ యుద్ధం ఇప్ప‌ట్లో ఆగ‌ద‌ని వైట్ హౌస్ చేస్తున్న ప్ర‌క‌ట‌న బ‌ట్టీ చూస్తుంటే.. ఇందులో ఒప్పందాల తాలూకూ ఒత్తిడులున్నాయ‌ని. ఇజ్రాయెల్ ని  ఒక బూచిగా చూపించి ఇరాన్ చేత అణు ఒప్పందాలు చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా అమెరికా ఇదంతా చేయిస్తోంద‌న్న మాట వినిపిస్తోంది.

By
en-us Political News

  
ఒడిశా బాలాసోర్‌లోని ఒక కళాశాలలో ఘోర విషాదకర ఘటన జరిగింది. గురువు లైంగిక వేధింపులకు భరించలేక ఓ విద్యార్థిని కాలేజిలోనే నిప్పంటించుకుంది.
నంద్యాల జిల్లా శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. డ్యామ్ గేట్లను ఎత్తడంతో శ్రీశైలానికి భారీగా తరలివస్తున్నారు.
శ్రీకాళహస్తి మాజీ జనసేన ఇంచార్జ్ వినూత కోట డ్రైవర్ హత్య కేసులో నిందితుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ వినూత కోట, ఆమె భర్త చంద్రబాబుతో సహా శివకుమార్, షైక్ తాసాన్, గోపిలను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎంత పెద్ద రెడ్ బుక్ రాసిన లోకేష్ కూడా.. మేం చట్ట ప్రకారం మాత్రమే.. శిక్షిస్తామని చెబుతారు. బాబు కూడా జగన్ని జైల్లో పెట్టడం ఎంత సేపు? కానీ పెట్టాలని పెట్టడం మన అభిమతం కాదని అంటారు.
హర్యానా టెన్నిస్ క్రీడాకారిణి రాధికను చంపిన కేసులో అరెస్ట్‌యిన ఆమె తండ్రి దీపక్ యాదవ్ పశ్చాత్తాపానికి గురయ్యారు. ఆవేశంతో కుతురిపై కాల్పులు జరిపానని తనను ఉరితీయాలని పోలీసులను దీపక్ వేడుకున్నాట్లు ఆయన సోదరుడు విజయ్ తెలిపారు.
వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లాలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారని టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు అవనిగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు.
గోదావరి జలాల పై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది .. ఈనేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకునే పనిలో ఉభయ రాష్ట్రాలు నిమగ్నమయ్యాయి.. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించే ప్రయత్నాలను ఆంధ్రప్రదేశ్ ప్రారంభించింది.
కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల్లోని నగరాలకు వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని అయిదు మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాలు ఆ పురస్కారాలు దక్కించుకున్నాయి.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ 3 ముద్దాయి ఉమా శంకర్ రెడ్డి కి బెదిరింపు ఫోన్ వచ్చింది. ఈ మేరకు ఆయన పులివెందుల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఇవాళ ఫిర్యాదు చేశారు.
కృష్ణాజిల్లా గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడ పాలిటిక్స్ హీటెక్కింది. కుప్పంలో చంద్రబాబు గెలవరని గతంలో మాజీ మంత్రి కొడాలి నాని చేసిన సవాల్‌ను గుర్తు చేస్తూ తెలుగు దేశం పార్టీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఏపీలో 590 మంది వేద పండితులు నిరుద్యోగులుగా ఉన్నారని.. వారికి నెలకు రూ.3 వేల భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వెల్లడించారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోట. అటువంటి ఆ జిల్లాలోని మునుగోడు నియోజక వర్గంలో మాత్రం జిల్లా మంత్రులకు ఎంట్రీ లేదంట. తన ఇలాకాలో జిల్లా మంత్రులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ఎంట్రీ పాస్ ఇవ్వడం లేదంట. ఒక విధంగా చెప్పాలంటే నో ఎంట్రీ బోర్డు పెట్టేశారంట. ఆ నియోజకవర్గంలో పర్యటనకు జిల్లా మంత్రులే కాదు.. ఇతర మంత్రులు కూడా వెనకంజ వేస్తున్నారంట.
శ్రీకాళహస్తి జన సేన ఇంచార్జ్ వినుతకోట మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్‌ రాయుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులో వస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.