Publish Date:Sep 18, 2025
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ రెబల్ మాత్రమే కాదు అంతకు మించి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నేరుగా సొంత పార్టీ ప్రభుత్వాన్నే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఆయన దాటని హద్దు లేదు. తొలుత తనకు మంత్రి పదవి హామీ ఇచ్చి మాట తప్పారంటూ తన విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసుకున్నా.. ఇటీవలి కాలంలో ఏకంగా పార్టీనే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.
మంత్రిపదవి దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి.. తొలుత సీఎం రేవంత్ పై, ఇప్పుడు మొత్తంగా కాంగ్రెస్ పై తిరుగుబావుటా ఎగురవేశారు. తాజాగా తెలంగాణ లిబరేషన్ డే సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 17) ఆయన అమరవీరుల స్ఫూపం వద్ద నివాళి అర్పించారు. ఆ సందర్భంగా ఆయన తెలంగాణ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో పరిస్థితిని నేపాల్ లో పరిస్థితితో పోల్చి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కార్ పై ప్రజలు తిరుగుబాటు చేసి తరిమికొట్టే పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.
అయినా కాంగ్రెస్ నుంచి చిన్నపాటి స్పందన కూడా లేదు. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్టానుసారంగా పార్టీ పరువు మంటగలిసేలా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నా.. కాంగ్రెస్ చర్య తీసుకునే విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందన్నది అంతుపట్టడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఏకంగా కాంగ్రెస్ సర్కార్ పై ప్రజా తిరుగుబాటు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన తరువాత కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై తనకు ఎటువంటి ఫిర్యాదూ రాలేదని టీపీసీసీ చీఫ్ అనడం పలు సందేహాలకు తావిస్తున్నది. అసలు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ సుమోటోగా తీసుకుని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్న కాంగ్రెస్ వర్గాల నుంచే వినవస్తున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reason-behind-congress-soft-stance-on-komatireddy-rajagopalreddy-39-206380.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.