Publish Date:Apr 23, 2022
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హస్తిన పర్యటన ఏపీ రాజకీయాలలో పలు ఊహాగానాలకు తెరతీసింది. తన హస్తిన పర్యటనలో భాగంగా గవర్నర్ బిశ్వజిత్ రాష్ట్రపతితోనే కాకుండా ప్రధాని మోడీతో కూడా భేటీ అవ్వనున్నారు. రాష్ట్రపతిలో గవర్నర్ భేటీ సహజంగానే తీసుకున్నా... ఇంత హఠాత్తుగా హస్తిన పర్యటన పెట్టుకుని, మోడీతో బిశ్వజిత్ భేటీకి కారణమేమిటన్నదానిపై రాజకీయ సర్కిళ్లలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి లేదా పీకే సలహా మేరకు కాంగ్రెస్ తో పొత్తు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సమాచారం విశ్వసించదగ్గదిగా లేదని భావించిన కేంద్రం వాస్తవాలను గవర్నర్ నుంచి తెలుసుకోవడం కోసమే గవర్నర్ ను ఢిల్లీకి పిలిపించుకున్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ అవసరాలకు సైతం అప్పు లేకుండా అడుగు ముందుకు పడని పరిస్థితుల్లో సతమతమౌతున్న పరిస్థితుల్లో అసలు వాస్తవ పరిస్థితిపై కేంద్రం సమగ్ర నివేదికను ఇవ్వాల్సిందిగా గవర్నర్ ను కోరినట్లు చెబుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సమాచారం సమగ్రంగా లేదని కేంద్రం భావిస్తున్న నేపథ్యంలోనే గవర్నర్ నవేదికను కోరిందని అంటున్నారు.
అలాగే ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలన్న పీకే సూచన మేరకు ముందుకు సాగడానికి జగన్ నిర్ణయించుకున్నారన్న సమాచారంపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కూడా గవర్నర్ ను హస్తినకు పిలిచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏది ఏమైనా ఏపీ గవర్నర్ హస్తిన పర్యటన రాజకీయ ఊహాగానాలకు తావిస్తున్నది. ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి, ఆర్థిక సంక్షోభం, కొత్త రాజకీయ సమీకరణాల చర్చోపచర్చల నేపథ్యంగా గవర్నర్ హస్తిన పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reason-behind-ap-governer-delhi-tour-39-134840.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది