Publish Date:Apr 23, 2022
తెలంగాణ గవర్నర్ తమిళిసై చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయా? లేక ఆమె స్వయంగా వివాదాలను ఆహ్వానిస్తున్నారా తెలియడం లేదని పరిశీలకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె తాను వివాదాస్పదురాలిని కాననీ పదే పదే చెప్పుకుంటున్నా...ఒక దాని తరువాత ఒకటిగా వివాదాలు ఆమెను చుట్టుముడుతున్నాయి. తాజాగా ఆమె పీఆర్వోను నియమించుకున్న ఉదంతం మరో వివాదంగా మారింది. ఆమె తన పీఆర్వోగా నియమించుకున్న వ్యక్తి తమిళనాడు బీజేపీ పీఆర్వో కావడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణ గవర్నర్ గానే కాకుండా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళిసై తన ప్రజా సంబంధాల అధికారిగా తమిళనాడుకు చెందిన వ్యక్తిని నియమించుకున్నారు. సదరు వ్యక్తి తమిళనాడు బీజేపీకి పీఆర్వ్వోగా వ్యవహరిస్తున్నారు.
దీంతో ఇప్పటికే తమిళిసై పై, ఆమె వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న తెరాస విమర్శలపర్వానికి తెర తీశారు. పీజీ మెడికల్ సీట్ల బ్లాక్, రాష్ట్రంలో తల్లీ కుమారుడి ఆత్మహత్య వంటి అంశాలపై ఆమె ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చేసి వ్యాఖ్యలతో అసలే అంతంత మాత్రంగా ఉన్న ప్రభుత్వం- రాజ్ భవన్ సంబంధాలు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో తమిళిసై పీఆర్వో వ్యవహారం వెలుగులోకి రావడంతో విమర్శలకు తెరాసకుపదునైన ఆయుధం దొరికినట్లైంది.
సాంకేతికంగా గవర్నర్ తమిళిసై పీఆర్వో బీజేపీకి చెందిన వ్యక్తి అవ్వడం నిబంధనలకు వ్యతిరేకం కాకపోయినప్పటికీ, నైతికంగా పార్టీలతో సంబంధం లేని వ్యక్తిని అటువంటి విధులలో చేర్చుకోవడం విధాయకమని పరిశీలకులు అంటున్నారు. అయితే తెరాసతో గవర్నర్ సంబంధాలు ఉప్పు-నిప్పుగా మారిన తరుణంలో తమిళిసై సహజంగానే సాంకేతిక అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అశం నుంచి....మెడికల్ సీట్ల కేటాయింపు వరకూ, నియామకాల నుంచి నీటి వరకూ ప్రతి అంశంపైనా ఆరా తీస్తున్నారు. ప్రతి అంశంపైనా తనదైన శైలలో అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఆ అభిప్రాయాలన్నీ దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిగానే ఉంటున్నాయి.
త్వరలోనే రాష్ట్ర గవర్నర్ మార్పు ఉంటుందన్న వార్తలు వినవస్తున్నాయి. ఈ వార్తలు ప్రచారంలోనికి వచ్చిన తరువాత తమిళిసై తన దూకుడును మరింత పెంచారు. రానున్న రోజులలో తమిళిసై పీఆర్వో అంశం మరింతగా రాజ్ భవన్- ప్రభుత్వం మధ్యా దూరం పెంచేందుకు దోహదపడే అవకాశాలు కనిపిస్తున్నాయనడంలో సందేహం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/governer-tamiisye-in-another-dispute-39-134837.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది