భారత బ్యాంకింగ్ రంగానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక ఊహించని బూస్ట్ ఇచ్చింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంప్యాసి) రెపో రేటును 5.25 శాతం వద్దే యథాతథంగా కొనసాగించినప్పటికీ, మార్కెట్ను అమితంగా ఆకట్టుకున్నది మాత్రం వారు ప్రకటించిన విదేశీ మారక ద్రవ్య చర్యలే. రూపాయి విలువను కాపాడటానికి, వ్యవస్థలోకి డాలర్ల ప్రవాహాన్ని పెంచడానికి ఆర్బీఐ ఒక ప్రత్యేకమైన డాలర్-రూపాయి స్వాప్ ఫెసిలిటీ (డాలర్ మార్పిడి సౌకర్యం) ప్రకటించింది. ఈ అద్భుతమైన నిర్ణయంతో దేశీయ స్టాక్ మార్కెట్లో బ్యాంకింగ్ షేర్లు సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్నాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఒక శాతానికి పైగా లాభపడగా, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ వంటి దిగ్గజ బ్యాంకుల షేర్లు భారీ కొనుగోళ్లతో కళకళలాడాయి.
నిజానికి గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ నిధుల ఉపసంహరణల వల్ల రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి పడింది. మార్చి 2026 నాటికి నికర విదేశీ పెట్టుబడులు ఏకంగా మైనస్ 11.7 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఈ స్వాప్ విండో ఒక సంజీవనిలా పనిచేయనుంది. ఈ పథకం ద్వారా విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ (ఎఫ్సీఎన్ఆర్-బి) డిపాజిట్లపై బ్యాంకులు ఎదుర్కొనే పూర్తి హెడ్జింగ్ ఖర్చులను (విదేశీ కరెన్సీ హెచ్చుతగ్గుల రిస్క్) ఆర్బీఐ స్వయంగా భరిస్తుంది. దీనివల్ల బ్యాంకులకు ఎటువంటి రిస్క్ ఉండదు కాబట్టి, వారు విదేశాల్లోని ఎన్ఆర్ఐలకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేసి పెద్ద ఎత్తున నిధులను సేకరించవచ్చు. ఈ చర్య ద్వారా భారత్లోకి దాదాపు 40 నుండి 50 బిలియన్ డాలర్ల మేర తాజా విదేశీ నిధులు వచ్చే అవకాశం ఉందని బ్యాంకింగ్ రంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ (పీఎస్యూలు) విదేశాల నుండి తీసుకునే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ఈసీబీ) కోసం ఆర్బీఐ కేవలం 1.5 శాతం వార్షిక స్థిర ధరతో ఈ స్వాప్ సదుపాయాన్ని అందిస్తోంది. గతంలో ఈ హెడ్జింగ్ ఖర్చులు 3.5 శాతం నుండి 4 శాతం వరకు ఉండటంతో విదేశీ రుణాలు భారంగా మారాయి. ఇప్పుడు కేవలం 1.5 శాతానికే లభిస్తుండటంతో పీఎస్యూలకు నిధుల సేకరణ చాలా చౌకగా మారనుంది. దీనికి తోడు బ్యాంకులు ఈ డిపాజిట్లపై క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్), స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) వంటి నిబంధనల నుండి మినహాయింపు పొందాయి. ఈ మినహాయింపుల వల్ల బ్యాంకుల లాభదాయకత భారీగా పెరగనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rbi-dollar-swap-facility-lifts-bank-shares-36-222325.html
అది గరిష్టంగా 20 సంవత్సరాల పాటు లేదా సదరు వ్యక్తికి 40 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మళ్లీ ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరిగి, లైసెన్స్ను ప్రతి ఐదు లేదా పదేళ్లకు ఒకసారి రీన్యూవల్ చేయించుకోవాల్సి వస్తోంది. ఈ పాత పద్ధతికి పూర్తిగా స్వస్తి పలికి.. ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్రం సరికొత్త యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే డ్రైవింగ్ లైసెన్స్ గడువును ఏకంగా వాహనదారుడికి 50 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు పొడిగించేలా మార్పు తీసుకురావాలని భావిస్తోంది.
తమ ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు సుమారు రూ.1.5 కోట్ల నగదు, పలు స్థలాలకు సంబంధించిన పత్రాలను కోడలు బంధువులు తీసుకెళ్లారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటి గురించి ప్రశ్నించగా ఓ రౌడీషీటర్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దాడుల సమయంలో ఆయన నివాసంలో సుమారు 60 లక్షల రూపాయల నగదు లభించగా.. బ్యాంక్ ఖాతాల్లో మరో కోటి అరవై లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు.ఇక బంగారం విషయానికి వస్తే దాదాపు రెండున్నర కిలోల బంగారు బిస్కెట్లు.. అలాగే పెద్ద మొత్తంలో బంగారు ఆభర ణాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కిలోల కొద్దీ వెండి వస్తువులు కూడా దొరికినట్లు సమాచారం.
ఇటీవల లూసియానా రాష్ట్రంలోని ఓ సరస్సులో జరిగిన ప్రమాదంలో తన స్నేహి తులు చిక్కుకున్న సమయంలో వారిని కాపాడే ప్రయత్నంలో నీటిలోకి దిగిన అనురూప్ రెడ్డి, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పలువురు హృద యాలను కదిలించివేసింది
నగరంలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యంచెప్పారు. మంత్రి లోకేష్ వెంట హోంమంత్రి వంగలపూడి అనిత, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు ఉన్నారు.
శరీర భాగాలైన తల, కాళ్లు, చేతులు లేకపోవడంతో తొలుత ఎటువంటి ఆధారాలు లభించ లేదు. అయితే మృతదేహం పై ఉన్న దుస్తులు కీలక క్లూగా మారాయి. ఆ దుస్తులు ఒక ప్రముఖ బ్రాండెడ్ కంపెనీకి చెందినవిగా గుర్తించిన పోలీసులు..దర్యాప్తులో భాగంగా ఆ దుస్తుల బార్కోడ్ను స్కాన్ చేయడం ద్వారా.. అవి ఎక్కడ కొనుగోలు చేయబడ్డాయో గుర్తించారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన గ్యాస్ సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను 9 నుండి 4 కి తగ్గిస్తూ కోత విధించింది. అసలు కారణం, సామాన్యులపై పడే ప్రభావం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రముఖ వ్యాపారి నివాసం ఉంటున్నారు. ఇంట్లో నేపాలీ దంపతులను పనిలోకి పెట్టుకున్నారు. నెల రోజుల క్రితమే ఈ నేపాల్ దంపతులను వ్యాపారి ఇంటి పనుల కోసం నియమించుకున్నారు కొద్దిరోజుల క్రితం వ్యాపారి తన కుటుంబ సభ్యుల తో కలిసి ముంబై కి వెళ్లి తిరిగి, ఇంటికి వచ్చిన సమయంలో నేపాలి దంప తులు ఇంట్లో కనిపించలేదు.
కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మహిళా క్రూ సభ్యులు ఒక్కసారిగా కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థ తకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమై విమా నాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) సుమారు 20,000 మంది అభ్యర్థుల హైరింగ్ పరీక్షలను అకస్మాత్తుగా రద్దు చేసింది. ఆన్లైన్ ఎగ్జామ్స్లో జరిగిన అక్రమాలే దీనికి కారణమా? ఫ్రెషర్ల ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్లలో ఎన్ఆర్ఐలు, ఓసీఐలు సెబీ రిజిస్ట్రేషన్ లేకుండానే భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆర్బీఐ కీలక సడలింపులు ఇచ్చింది. బడ్జెట్ 2026 పరిమితుల కంటే మరింత ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పిస్తూ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఐదేళ్లలో 690% మరియు పదేళ్లలో 1040% భారీ లాభాలను అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ గ్యాబ్రియేల్ ఇండియా (Gabriel India) పై మోతీలాల్ ఓస్వాల్ సానుకూల రేటింగ్ ఇచ్చింది. మరో 30% లాభాల అంచనాతో రూ. 1266 టార్గెట్ ధరను ప్రకటించింది. ఈ స్టాక్ పూర్తి వివరాలు, ఆర్థిక బలం మరియు భవిష్యత్తు వృద్ధి అంచనాలను ఇక్కడ చూడండి.
1999లో ఒక రైతు కుటుంబం పార్కు కోసం కేవలం 10 డాలర్లకే 87 ఎకరాల భూమిని ఇస్తే, టేలర్ నగరం దాన్ని 10 మిలియన్ డాలర్లకు డేటా సెంటర్ నిర్మించడానికి అమ్మేసింది. ఈ గుండె బరువెక్కించే పూర్తి కథనం చదవండి.