బిజెపికి ఎమ్మెల్యే రాజాసింగ్  గుడ్ బై ?

Publish Date:Feb 14, 2025

Advertisement

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిల్చిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో మారు వార్తల్లోకెక్కారు. ఈ సారి ఆయన ఏకంగా పార్టీ అధిష్టాపంపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. క్రమశిక్షణకు మారు పేరుగా నిల్చిన బిజెపిలో తిరుగు బాటు జెండా ఎగరడం చర్చనీయాంశమైంది.  రాజాసింగ్ పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల బిజెపి  జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది. తొలుత 19 మంది జిల్లా అధ్యక్షులను,  తాజాగా గురువారం నలుగురు జిల్లా అధ్యక్షులను పార్టీ అధిష్టానం నియామకం చేసింది. ఈ నలుగురి పేర్లలో తాను సూచించిన గోల్కొండ అధ్యక్షుడి పేరు లేకపోవడమే వివాదానికి కేంద్రబిందువయ్యింది. గోల్కొడ బిజెపి అధ్యక్షుడు ఉమా మహేశ్ పేరును అధిష్టానం ప్రకటించడాన్ని రాజాసింగ్ కు మింగుడు పడలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా తన పేరు ప్రకటించిన సమయంలో ఉమా మహేశ్ సహకరించలేదు. ఇది రాజాసింగ్ ఆరోపణ. కాంగ్రెస్ , ఎంఐఎం పార్టీలతో ఉమా మహేశ్ కుమ్ముక్కయినట్లు రాజాసింగ్ అంటున్నారు. తాను సూచించిన పేరు కాకుండా ఉమా మహేశ్ పేరు పదిరోజుల క్రితమే పార్టీ అధిష్టనానం ప్రకటించింది. అప్పట్లో రాజాసింగ్ వ్యతిరేకించడంతో పార్టీ అధిష్టానం గోల్కొండ జిల్లాను పెండింగ్ లో పెట్టింది. తాజాగా ప్రకటించిన జిల్లా అధ్యక్షుల పేర్లలో గోల్కొండ జిల్లా అధ్యక్షుడుగా ఉమా మహేశ్ పేరును అధిష్టానం  మరో మారు ప్రకటించింది. దీంతో రాజాసింగ్  తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆడియో ఒకటి విడుదల చేశారు.  నా అవసరం లేదంటే పార్టీ నుంచి నన్ను వెళ్లిపోమంటే వెళ్లిపోతానని ధిక్కారస్వరం వినిపించారు.  ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో రాజాసింగ్  2009లో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. టిడిపి కార్పోరేటర్ గా ఆయన మంగళ్ హాట్ డివిజన్ నుంచి తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 2014లో ఆయన బిజెపి అభ్యర్థిగా గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రెండో సారి కూడా ఆయన అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. హిందుత్వ వాదాన్ని బలంగా వినిపించడంతో ఆయన పేరు ప్రఖ్యాతులు దేశ వ్యాప్తంగా ఉన్నాయి. హిందుత్వ వాదాన్ని బలపరిచే పార్టీలతో బాటు వివిధ సంస్థల ద్వారా తన వాదాన్ని బలంగా వినిపించేవారు ఆయన. మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పదవ్యాఖ్యలతో బిజెపి ఆయన్ను సస్పెండ్ చేసింది. దాదాపు రెండేళ్లు ఆయన సస్పెండ్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిజెపి అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించకపోవచ్చని ప్రచారం జరిగింది. చివరిక్షణంలో ఆయన పేరును ప్రకటించింది. ప్రస్తుత కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో ఆయనపై ఉన్న సస్పెన్షన్ వేటును బిజెపి ఎత్తేసింది.మూడోసారి బిజెపి టిక్కెట్ దక్కించుకున్నారు రాజాసింగ్. బిజెపి నుంచి మూడోసారి గెలిచి హట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. అయినప్పటికీ బిజెపి ఆయనకు పెద్ద పీట వేయలేదు. హైద్రాబాద్ లోకసభ నుంచి పోటీ చేయలనుకున్న రాజాసింగ్ కు ఆదిలోనే హంసపాదుపడింది. రాజాసింగ్ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వరిస్తుందని కొందరు వ్యతిరేకించారు. అప్పటివరకు బిజెపి సభ్యత్వం కూడా లేని మాధవిలత పేరును  అధిష్టానం ప్రకటించింది. పార్టీలో మగాళ్లే దొరకలేదా అని రాజాసింగ్ ధిక్కారస్వరం వినిపించారు. మాధవిలత ఎన్నికల ప్రచారానికి కూడా రాజాసింగ్ దూరంగా ఉన్నారు. 
హిందుత్వ వాదిగా ముద్ర ఉన్న రాజా సింగ్ హైద్రాబాద్ నుంచి గెలిచిన ఏకైక బిజెపి ఎమ్మెల్యే. ప్రతీ బహిరంగ సభలో ముస్లింలను దూషించడంతో ఆయనకు వివాదాలు చుట్టుముట్టాయి. ఫేస్ బుక్ అకౌంట్లు సీజ్ అయ్యాయి. ముస్లిం తీవ్రవాద సంస్థల హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా ఆయనకు అనేక సార్లు అరెస్ట్ వారెంట్లు పట్టుకుని హైద్రాబాద్ వచ్చేవారు. అక్కడి కోర్టుల్లో రాజాసింగ్ విచారణ ఎదుర్కొనేవారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న రాజాసింగ్ కు స్వంత పార్టీలో పరాభవం చెందడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. 
రాజాసింగ్ మాతృసంస్థ టిడిపిలో చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. 

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.