రాష్ట్ర ప్రయోజనాల కోసం గళమెత్తండి.. కొత్త రాజ్యసభ సభ్యులతో మంత్రి లోకేష్
Publish Date:Jun 12, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున బలమైన గొంతుకగా నిలవాలని సూచించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను లోకేశ్ సామాజిక మాధ్యమం వేదికగా పంచుకున్నారు. రాష్ట్రం నుంచి నూతనంగా రాజ్యసభకు ఎన్నికైన వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్న లోకేష్ వారికి అభినందనలు తెలిపి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గట్టిగా గళం వినిపించాలని కోరానని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ప్రగతికి తోడ్పడాలని ఎంపీలకు సూచించినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా వారు సమర్థవంతంగా పనిచేస్తారన్న విశ్వాసాన్నిలోకేష్ వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/raise-voive-for-ap-benifit-36-222708.html





