రాహుల్ అంతర్జాతీయనేత..! సోనియా విశ్వమాత...!
Publish Date:Sep 20, 2012
Advertisement
ఎవరి గొప్ప వారు చెప్పుకోవడంలో ఎవరికెవరూ తీసిపోరని మోడీ. రాహుల్ స్థాయిల విషయంలో చోటు చేసుకున్న మాటల యుద్ధం రసపట్టుగా మారింది! వ్యక్తి పూజకే అగ్రతాంబూల మిచ్చే కాంగ్రెస్లో పొగడ్తలు శృతి మించిపోతున్నాయ్! బొగ్గు కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని మన్మోహన్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటును స్తంభింపజేసిన బి.జె.పి అంటే కాంగ్రెస్ నేతలు గుర్రుగానే ఉన్నారన్నది నిజం! తమ నాయకుల మనసులో చెలరేగి పోతున్న అలజడిని గమనించిన కొందరు కార్యకర్తలు ఆ కచ్చను గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడిపై వెళ్ళగక్కడానికి ప్రయత్నిస్తూ తమ నేత రాహుల్ గాంధీ జాతీయ నాయకుడైతే, మోడీ కేవలం ప్రాంతీయ నాయకుడంటూ తమ నాయకుడిని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు! అందుకు మోడీ స్పందిస్తూ `తాను నిజంగానే ప్రాంతీయ నాయకుడినేనని ఒప్పేసుకుంటూ రాహుల్ గాంధీ మాత్రం అంతర్జాతీయ నాయకుడనీ, ఆయన ప్రపంచంలో ఎక్కడినుంచైనా పోటీ చేస్తారనీ, అవసరమైతే ఇటు భారత్, అటు ఇటలీ ఎన్నికల్లోనూ పోటీ చేసెయ్యగల రంటూ సెటైర్ విసిరారు! ఆ వ్యాఖ్యకు ఎలాస్పందించాలో ఆర్థం కాక తల నెరసిన పెద్ద నాయకులు తలలు పట్టుకుకూర్చుంటే `ఛోటా నాయకులు మాత్రం మోడీ వ్యాఖ్యలపై స్పందించకపోతే తమ పరువేంగావాలనుకున్నారో ఏమో గానీ `రాహుల్ గాంధీ ప్రపంచ దేశాలను ప్రభావితం చెయ్యగల అంతర్జాతీయ నాయకుడేనని చెప్పేస్తున్నారు! ఇంతటితో వీళ్ళు ఊరుకుంటారా...? లేక మరో అడుగు ముందుకేసి సోనియమ్మ విశ్వమాతంటూ కితాబిచ్చి `ఆమె ఏ గ్రహంలోనైనా పోటీ చేసేస్తారంటూ చెప్పేస్తారో వేచిచూడాల్సిందే! ఉరుమురిమి ఎక్కడో పడ్డట్టు మోడీపై చెళుకు లెయ్యాలని ప్రయత్నిస్తే సోనియా విదేశీయత వివాదం మరోసారి తెరమీదికి తెస్తున్నట్లవుతోంది కదూ...!
http://www.teluguone.com/news/content/rahul-international-leader-24-17508.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





