ఓటు చోర్ ఆందోళన... అసలు లక్ష్యం అదేనా?

Publish Date:Aug 18, 2025

Advertisement

 

కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, లోక్ సభలో, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నంత  పనిచేశారు. ఆటం బాంబు పేలుస్తా అన్నారు. పేల్చారు. భారత ఎన్నికల సంఘం, ప్రధాని మోదీ, బీజేపీలతో కుమ్ముక్కై,’ఓట్ల చోరీ’ కి పాల్పడిందని ఆరోపించారు. ఆరోపించడమే కాదు,  దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇవిగో ఆధారాలు అంటూ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన’, ద్వారా అవునా, నిజమా, నిజంగానే ఓటు చోరీ జరిగిందా, అనిపించేలా ప్రెజెంటేషన్ ఇచ్చారు. సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. అలాగే, కర్ణాటక  రాజధాని బెంగుళూరులో మరో స్టేజి షో నిర్వహించారు. 

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలు, అక్రమాల గురించి కొన్ని నిర్దిష్ట ఆరోపణలు చేశారు.అయితే ఆయన చేసిన ‘నిర్దిష్ట’ ఆరోపణల్లో,  ‘నిర్దిష్ట’ నిజాలు ఉన్నాయా లేవా, అనేది నిగ్గు తేలాలంటే, రాహుల్ గాంధీ, తాను చేసిన   ఆరోపణలను నిరూపించే సాక్ష్యాదారాలతో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని, ఎన్నికల సంఘం, కోరింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ 1960 లోని, రూల్ 20 (3)(b) కింద, ప్రమాణం చేసి,అఫిడవిట్’ దాఖలు చేయమని కోరుతూ,కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), కర్ణాటక చీఫ్ ఎలక్షన్ఆఫీసర్ ద్వారా,రాహుల్ గాంధీకి, వర్తమానం పంపింది. ఎదుకో ఏమో కానీ, రాహుల్ గాంధీ ప్రమాణ పత్రాన్ని ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. 


అయితే. రాహుల్ గాంధీ చేసిన చేస్తున్న నిర్దిష్ట ఆరోపణల్లో నిజం ఉన్న లేకున్నా, ఆయన ప్రస్తావించిన ఎన్నికల అవకతవకలు జరగడమే లేదని అనుకుంటే అది అత్మవచనే అవుతుంది. నిజానికి, 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల మొదలు, 2024 సార్వత్రిక ఎన్నికల వరకు, పంచాయతీ మొదలు పార్లమెంట్ వరకు రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఎన్నికల అక్రమాలు అవకతవకలు జరగని ఎన్నిక ఇంత వరకు జరగలేదు. ఎక్కడిదాకానో ఎందుకు, 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు రద్దయినట్లు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అనేక సందర్భాలలో  ఆరోపించారు.

ఆయన పోటీ చేసి, ఓడిపోయినా తుంగతుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలలోనూ పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఓట్లు గల్లంతు అయ్యాయని దయాకర్’ కోర్టుకు వెళ్లారు. ఆ కేసు ఇంకా ఇప్పటికీ నడుస్తోంది. అలాగే, మాజీ ఎమ్మెల్సీ రాజకీయ  విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్’ బల్క్ ఓట్లకు సంబంధించి  ఒకే గదిలో పదుల సంఖ్యలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్న స్వీయ అనుభవాన్ని, ఒక ఇంటర్వ్యూ లో వివరించారు.
 సో .. రాహుల్ గాంధీ ప్రస్తావించిన దొంగ ఓట్లు, బల్క్ ఓట్లు, డ్యూయల్ ఓట్లు, చనిపోయినవారికి ఓటు హక్కు కొనసాగడం, బతికున్న వారికీ ఓటు లేక పోవడం వంటి సవాలక్ష  అవకతవకలు, అక్రమాలు, ఎన్నికల సంఘం పురుడు పోసుకోక ముందు నుంచి ఉన్నవే. ఆనవాయితీగా వస్తున్నావే. కాంగ్రెస్, బీజేపీ, లేదా మరో పార్టీ ఏపార్టీ అధికారంలో ఎవరున్నా, ప్రధాన ఎన్నికల అధికారిగా,అలనాటి శేషన్’ ఉన్నా ఈనాటి జ్ఞానేశ్ కుమార్’  ఉన్నా, అవకతవకలు అక్రమాలు జరగని ఎన్నికలు ఇంతవరకు జరగలేదు. 

అప్పుడు ఇప్పడు జరిగే తప్పులు జరుగుతూనే ఉన్నాయి.అప్పుడే జరిగాయి, ఇప్పడు లేవు అనుకున్నా, అప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి అనుకున్నా,అది ఆత్మవంచన, పరనింద అవుతుందే కానీ, నిజం మాత్రం కాదు. నిజానికి,ఈవిషయంలో ఎదుటి వారిపై ఒక వేలు చూపిస్తే, నాలుగు వేళ్ళు మన వైపు చూపిస్తాయి. ఇప్పడు జరుగుతున్నది కూడా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ వైపు, మోదీ వైపు వేలు చూపితే, బీజేపీ కాంగ్రెస్ వైపు వేలు చూపుతుంది. ఒక విధంగా గొంగళిలో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం ఎలా ఉంటుందో, ఇలా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కూడా అంతే.. అయితే ఈ రాజకీయ క్రీడలో రాజకీయ పార్టీల ప్రతిష్ట మాత్రమే కాదు, అతి పెద్ద ప్రజాసామ్య దేశంగా ప్రపంచ దేశాల్లో మన దేశానికి, ఎన్నికల నిర్వహణలో, ‘ది బెస్ట్’  అన్న కితాబు పొందిన మన ఎన్నికల వ్యవస్థ ప్రతిష్టను కూడా దిగజార్చి వేస్తోంది. అదే అసలు విషాదం.


అయినా, కాంగ్రెస్ నాయకుడు,లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,ఇతర విపక్ష పార్టీల నాయకులు, బీహార్ ఎస్ఐఆర్’, కర్ణాటకలోఓట్ల గోల్ మాల్’ వ్యవహారాన్నికలగాపులగం చేసి, ప్రజల్లో అపోహలను సృష్టించే ప్రయత్నం, గందరగోల చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవంక, బీహార్’ లో ‘ఓటర్ అధికార యాత్ర’ పేరిట... రాహుల్ గాంధీ యాత్ర సాగిస్తున్నారు.సవాళ్ళు విసురుతున్నారు. ఎన్నికల సంఘం స్పష్టమైన సంధానాలు ఇచ్చినా, మళ్ళీ మళ్ళీ అవే ఆరోపణలు చేస్తున్నారు. 

ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల నఘం, రాహుల్ గాంధీ, ఇతర విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించింది.అంతే కాదు, విపక్షాలు చేస్తున్న ఆరోపణలను నిరూపించే సాక్ష్యాదారాలతో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని, లేదంటే, దేశానికి క్షపణ చెప్పాలని ఎన్నికల ప్రదానాధికారి, జ్ఞానేశ్ కుమార్’ ఆదివారం డిమాండ్ చేశారు.అందుకు ప్రతిగా విపక్షాలు,’ ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ రాజకీయ క్రీడలో అంతిమంగా ఏమి జరుగుతుంది

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.