ఇదంతా రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించేందుకేనా?

Publish Date:Mar 18, 2015

Advertisement

 

సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం, ఆ తరువాత జరిగిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. పార్టీకి నాయకత్వం వహిస్తున్న సోనియాగాంధీ, పార్టీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అందుకు నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. వహిస్తున్నామని చెప్పుకొన్నారు కూడా. అయితే దానర్ధం కాంగ్రెస్ పార్టీ పగ్గాలను వేరేవరిచేతిలోనో పెడతామని కాదని వారు చెప్పకనే చెప్పారు.

 

రాహుల్ గాంధీ గత పదేళ్లుగా రాజకీయాలలో ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టుసాధించలేకపోయారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆయనే దిక్కని చెప్పుకోవలసి వస్తోంది. ఆయన కూడా తనకు పదవుల మీద ఎటువంటి వ్యామోహం లేదని చెపుతూనే, తన పద్ధతి ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగాలనుకొంటారు. పార్టీలో సీనియర్ల కంటే తనే పార్టీని బాగా నడపగలననే భ్రమలో ఉన్నందున వారితో ఏవిషయంలోను ఏకీభవించలేకపొతున్నారు. ఆవిషయాన్ని పార్టీలో సీనియర్ నేత జైరామ్ రమేష్ చూచాయగా చెప్పారు. దానికి ఆయన ‘జనరేషన్ గ్యాప్’ అనే కలరింగ్ ఇచ్చుకొన్నారు. పార్టీలో సీనియర్లకి రాహుల్ గాంధీకి మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఆయన చెప్పుకొన్నప్పటికీ, అత్యంత ముఖ్యమయిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీ శలవు పెట్టివెళ్లి పోవడం, అందుకు ఆ పార్టీ నేతలు చెప్పుతున్న సంజాయిషీలు గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అంతర్గత సంక్షోభం నెలకొని ఉందని స్పష్టం అవుతోంది. ఆయన తన శలవుని మరికొన్ని వారాలు పొడిగించడంతో ఈ అనుమానాలను స్వయంగా దృవీకరిస్తున్నట్లుయింది.

 

పార్టీలో హేమహేమీలనదగ్గ నేతలు వందలమంది ఉన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో వారందరిని సంప్రదించి, వారి సలహాలు, సూచనలు తీసుకోవడం తెలివయిన నిర్ణయం అనిపించుకొంటుంది. కానీ రాజకీయాలలో రాణించడానికి అవసరమయిన నిలకడ, నేర్పు, లౌక్యం వంటి లక్షణాలేవీ బొత్తిగా లేని రాహుల్ గాంధీ ఒంటరిగా కూర్చొని పార్టీ గురించి ఆలోచించడానికి శలవు పెట్టడం విచిత్రమే. గత పదేళ్లుగా ఆయన అనేక పాఠాలు నేర్చుకొనే అవకాశం కలిగింది. అదేవిధంగా అనేకసార్లు తనను తాను నిరూపించుకొనే అవకాశాలు కలిగాయి. కానీ ఆయన వాటిని ఉపయోగించుకొని తనలో నాయకత్వ లక్షణాలున్నాయని పార్టీకి, ప్రజలకీ కూడా నమ్మకం కల్పించలేకపోయారు. కానీ అవకాశం చిక్కితే 125 కోట్ల మంది జనాభా ఉన్న సువిశాలమయిన భారత దేశానికి ప్రధానమంత్రి అయిపోదామనుకొన్నారు. ఆయన దురదృష్టమో లేకపోతే ప్రజల అదృష్టమో గానీ ఆయనకు ఆ అవకాశం కూడా దక్కలేదు. కనుక కనీసం తన పార్టీ పగ్గాలయినా చేపడుదామనుకోవడంలో అసహజమేమీ లేదు. కానీ అందుకు కూడా పార్టీలో వ్యతిరేకత ఎదుర్కోవలసి రావడం ఆ తల్లికొడుకులకు చింత కలిగించే విషయమే.

 

ఒకవేళ రాహుల్ గాంధీకి ఈ అవకాశం కూడా దక్కకపోతే ఇక ఆయన రాజకీయాలలో ఉండటమే అనవసరం. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇతరుల చేతిలోకి వెళ్ళిపోతే అప్పుడు రాహుల్ గాంధీ ఏమి చేయాలి? ఆయన భవిష్యత్ ఏవిధంగా ఉంటుంది? అనే ఆలోచనలకు జవాబులు చెప్పడం కష్టమే. అటువంటి పరిస్థితి ఎదురయ్యే వరకు వేచి చూడటం కంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిదనే ఉద్దేశ్యంతో ఈ శలవు ఐడియా చేసి ఉండవచ్చును. పార్టీలో ఆయనను వ్యతిరేకిస్తున్న సీనియర్ నేతలపై ఒత్తిడి పెంచవచ్చనే ఆలోచనతోనే ఆయన శలవు మీద వెళ్లిపోయుండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

ఇంట్లోంచి పిల్లాడు అలిగి వెళ్ళిపోయినప్పుడు, “నాయినా నువ్వు ఎక్కడ ఉన్నా వెంటనే ఇంటికి తిరిగి రా...నీ కోసం అమ్మ బెంగ పెట్టుకొంది. నిన్ను ఎవరూ ఏమీ అనము...వెంటనే ఇంటికి తిరిగి వస్తే నువ్వు అడిగినట్లే బండి కొనిస్తాము...”లేదా ఏదో చేస్తామంటూ ఆ పిల్లాడి తల్లి తండ్రులు పేపర్లో ప్రకటనలు వేయిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సరిగ్గా అదే పని చేస్తోందని చెప్పవచ్చును.

 

ఆయన శలవులో వెళ్ళిపోయినప్పటి నుండి “తిరిగి వచ్చిన తరువాత ఆయనే పార్టీ పగ్గాలు చేపడుతారు. ఆయన పార్టీకి మళ్ళీ జవసత్వాలు కలిగించబోతున్నారు. పార్టీలో సీనియర్లకు ఉద్వాసన పలుకబోతున్నారు,” అంటూ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్య పూర్వకంగానే మీడియాకు లీకులు ఇస్తున్నారు. అంటే ఆయన కండిషన్లలకు తాము అంగీకరిస్తున్నామని సందేశం పంపుతున్నారన్నమాట. కనుక ఆయన తన శలవు పూర్తి చేసుకొని రాగానే పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారేమో.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.