కాంగ్రెస్ నేతలకి రాష్ట్ర ప్రజల మీద ఇంత ప్రేమ ఏర్పడింది ఏమిటబ్బా?

Publish Date:Mar 18, 2015

Advertisement

 

రాష్ట్రాన్ని పదేళ్ళపాటు పాలించిన తరువాత ఇప్పుడు కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు కూడా అర్హత కోల్పోయిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల కోసం అంటూ ఇప్పుడు రోడ్ల మీద ధర్నాలు చేసుకొంటూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. లక్షలాదిమంది ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రోడ్లమీదకు వచ్చి దాదాపు రెండున్నర నెలలపాటు ఎన్ని ఉద్యమాలు చేసినా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. విభజన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కిటికీలు, తలుపులు మూసివేసి, టీవీ చానళ్ళ ప్రసారాలు నిలిపివేసి అత్యంత హేయమయిన పద్దతిలో విభజన బిల్లుని ఆమోదింపజేసుకొంది.

 

ఆనాడు ప్రజాభిప్రాయానికి పూచికపుల్లెత్తు విలువీయని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అదే ప్రజల కోసం ఎందుకు పరితపించిపోతున్నారు? ఆనాడు ఆంద్రప్రదేశ్ ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే అవ్వన్నీ ఒట్టి డ్రామాలు...వారిని కొన్ని రాజకీయ పార్టీల నేతలు వెనుకనుండి ఆడిస్తున్నారని అవహేళనగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అకస్మాత్తుగా రోడ్లమీదకు వచ్చి ప్రజల కోసం మొసలి కన్నీరు కారుస్తూ ఎందుకోసం డ్రామాలు చేస్తున్నారు? ఆనాడు ఆంద్రప్రదేశ్ ప్రజల గోడుని పట్టించుకోని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇప్పుడు పార్లమెంటులో వారికోసం ఎందుకు పోరాటం మొదలుపెట్టారు? ఇంతకాలం వారందరూ నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఊరుకొన్నారు? ఇప్పుడే ఎందుకు ఈ డ్రామాలు మొదలుపెట్టారు? అనే ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలెవరూ సమాధానాలు చెప్పేందుకు ఇష్టపడక పోవచ్చును. కోడికూయకపోతే తెల్లారకుండా ఉండదు. వారు సమాధానాలు చెప్పకపోయినా రాజకీయ విశ్లేషకులు చెప్పకుండా ఉండబోరు.

 

రాహుల్ గాంధీకి త్వరలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పట్టాభిషేకం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆయన శలవు నుండి తిరిగి రాగానే ఏప్రిల్ నెలలో జరిగే పార్టీ సమావేశాలలో బహుశః ఆ నిర్ణయం తీసుకోవచ్చును. ఒకవేళ ఆయన పట్టాభిషిక్తుడు అయితే పార్టీలో ముసలి గుర్రాలనన్నిటినీ బయటకు పంపడమో లేక పక్కనపెట్టడమో చేస్తారని కాంగ్రెస్ నేతలే స్వయంగా అంగీకరిస్తున్నారు. కనుక రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరూ అప్పుడే ఆయనను ప్రసన్నం చేసుకొనేపనిలో పడ్డారు. అందుకే ఇంతకాలం వేరే పార్టీలలోకి మారుదామని విశ్వప్రయత్నాలు చేసి విఫలం అయిన కాంగ్రెస్ నేతలు అందరూ ఇప్పుడు హడావుడిగా తమ ముందు ఉన్న ఈ ఒక్క అవకాశాన్ని వినియోగించుకొంటూ ధర్నాలు చేసి ఇటు రాష్ట్ర ప్రజల దృష్టిలో, అటు రాహుల్ గాంధీ దృష్టిలో పడాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు కూడా స్థానిక అంశాలను దొరకబుచ్చుకొని హడావుడి చేస్తుండటం గమనిస్తే ఈ అనుమానం నిజమేనని అర్ధమవుతుంది.

 

ఇక కీలకమయిన బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన తన కొడుకుపై ఈగ వాలకుండా చూసుకోనేందుకే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అందివచ్చిన ప్రతీ అంశంతో కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేస్తోంది. ఆమె వ్యూహం ఫలించినట్లే ఉంది. అందుకే పార్లమెంటులో సభ్యులు ఎవరూ రాహుల్ గాంధీ ప్రసక్తి తేవడం లేదు. ఈ విషయం గురించి బీజేపీ, ఎన్డీయే సభ్యులు కూడా పార్లమెంటులో లేవనెత్తకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

శలవు మీద వెళ్లిన రాహుల్ గాంధీ తిరిగివచ్చి ఏమి మాయ చేస్తాడో...అని ప్రజలందరూ చర్చించుకొంటున్నారు. ఆనక ఆయన తుస్సుమనిపిస్తే ఆయన ప్రతిష్టతో బాటు కాంగ్రెస్ ప్రతిష్ట కూడా మంట కలుస్తుందనే భయంతో ఆయన శలవుకి అంత ‘హైప్’ ఏర్పడకుండా ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ నేతలు తమకు తెలిసిన ఇటువంటి రకరకాల తక్కు టమార గారడీ విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారని భావించవచ్చును. స్వామీ కార్యంతో బాటు స్వకార్యం కూడా వారు చక్కబెట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని భావించవచ్చును. వాటికి ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు అనే కలరింగ్ ఇచ్చుకొంటున్నారు అంతే!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.