తనపై హత్యాయత్నం జరిగింది... పోలీసులకు ఫిర్యాదు చేసిన రఘురామ
Publish Date:Jun 11, 2024
Advertisement
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్పై మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘరామకృష్ణరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఘటనకు సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ బాధ్యులని తెలిపారు. అలాగే, తన గాయాలపై గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.ప్రభావతి కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ను విమర్శిస్తే చంపేస్తానని సునీల్ కుమార్ బెదిరించారని తెలిపారు. తన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. పిచ్చోడి చేయిలో రాయి వుంటే ఎవరి తలనైనా పగలగొట్టుచ్చు . రఘురామ కృష్ణరాజు విషయంలో కూడా అదే జరిగింది. అధికారం కోసమే తన తండ్రి వైఎస్ఆర్ ఉన్న పార్టీని వదిలేసి తండ్రి పేరు వచ్చేలా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన జగన్ 2019లో అధికారంలోకి రాగానే ఒక్కొక్కరిని టార్గెట్ చేశారు. జగన్ అరాచకాలను, అకృత్యాలను నిలదీసిన రఘురామకృష్ణ రాజును ప్రజా ప్రతినిధి అని కూడా వైఎస్ ఆర్ ప్రభుత్వం టార్చర్ చేసింది. అతనిపై 2021 మే 14వ తేదీన తాను హైదరాబాద్లోని తన నివాసంలో పుట్టిన రోజు సందర్భంగా కుటుంబసభ్యులతో వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఏపీ సీఐడీ పోలీసులు ఆయన ఇంటిపై విరుచుకుపడ్డారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అరెస్టు చేసిన తర్వాత గుంటూరులోని సీబీసీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారని తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, వైద్య సహాయం, భోజనం సైతం ఏర్పాటు చేయలేదని తెలిపారు. అరెస్ట్ చేసిన తరువాత తనను రబ్బర్ బెల్ట్ మరియు లాఠీతో కొట్టడంతోపాటు శారీరక వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో రఘురామ వెల్లడించారు. అదే రోజు రాత్రి 11:30 గంటల ప్రాంతంలో అప్పటి సీబీసీఐడీ., డీజీ శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ సీతారామాంజనేయులుతో పాటుగా పోలీసు తనను చిత్రహింసలకు గురిచేసినట్లు రఘురామ తన ఫిర్యాదులో వెల్లడించారు.
గతంలో ప్రధానికి సైతం ఫిర్యాదు చేసిన రఘురామ కృష్ణరాజుపై వైఎస్ ఆర్ ప్రభుత్వం కక్ష్య గట్టింది రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ... గతంలో ఏపీ సీఐడీ రఘురామను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసు కస్టడీలో తనను హింసించినట్లు అప్పట్లో రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ అప్పట్లో ప్రధానికి రఘురామ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పట్లో వైఎస్సార్సీపీ విధానాలను ఆయన ప్రశ్నించడంతో ఆయనపై కక్షగట్టి కస్టోడియల్ టార్చర్ చేసింది వైఎస్ ఆర్ ప్రభుత్వం. స్వంత పార్టీపై విమర్ళల నేపథ్యంలో ఆయనపై కేసులు పెట్టారనే ఆరోపణలు సైతం వచ్చాయి.
తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు జగన్ చేసిన పాపాల చిట్టా ఒక్కోటి విప్పాలని డిసైడ్ అయ్యారు. గతంలో ఆయనను ఓసారి సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందంటూ రఘురామకృష్ణరాజు తాజాగా గుంటూరు పోలీసులను ఆశ్రయించారు. కస్టడీలో తనను అంతమొందించేందుకు ప్రయత్నించారని గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఇటీవలే రాష్ట్రంలో అడుగుపెట్టిన రఘురామ... టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు.స్వ రాష్ట్రంలో తాను ఎంచుకున్న కూటమి విజయం చెందడంతో రఘరామకృష్ణ రాజు జగన్ భరతం పడతారని సర్వత్రా వినపడుతుంది.
http://www.teluguone.com/news/content/raghurama-complaint-against-jagan-39-178316.html





