Publish Date:Aug 18, 2022
పూర్వం అంతటా సంతానలక్ష్ములే ఉండేవారు. దాదాపు ప్రతీ ఇల్లూ పిల్లలతో సందడిగా ఉండేది. కాల క్రమంలో సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇపుడిక ఆధునిక పోకడలవల్ల, సామాజిక పరిస్థితుల వల్లా ఒక్కరి ద్దరితో సరిపెట్టుకుంటున్నారు. రష్యాలో అధ్యక్షుడు పుతిన్ మాత్రం మళ్లీ పిల్లల సందడి అవసరమని భావించారు. అంటే జనాభా పెరుగుదలను ఆశిస్తున్నారు. కారణం కోవిడ్-19 కావచ్చు. కోవిడ్ వల్ల అనేక దేశాల్లో జనాభా తగ్గిపోయింది. రష్యా కూడా దాని ప్రభావానికి గురైంది.
కనీసం పది మంది పిల్లలకు జన్మనిచ్చే తల్లులకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాది మిర్ పుతిన్ ప్రకటించారు. కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన జనాభా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన నైరాశ్యంతో కూడిన చిట్టచివరి ప్రయత్నమని నిపుణులు చెప్తున్నారు.
జనాభా క్షీణతను అరికట్టేందుకు పుతిన్ ఓ పథకాన్ని ప్రకటించారు. దీనికి మదర్ హీరోయిన్ అని పేరు పెట్టారు. ఈ పథకం క్రింద పదిమంది బిడ్డలకు జన్మనిచ్చే తల్లికి ఆర్థిక సాయం చేస్తారు. అయి తే పది మంది బిడ్డలు జీవించి ఉండటం తప్పనిసరి. పదో బిడ్డకు మొదటి పుట్టినరోజు నాటికి ఒక మిలియన్ రూబుల్స్ (సుమారు రూ.13 లక్షలు) చెల్లిస్తారు. ఈ ఏడాది మార్చి నుంచి రోజువారీ కరోనా వైరస్ కేసుల సంఖ్య అధికంగా ఉండటం, ఉక్రెయిన్పై యుద్ధం వల్ల మరణించినవారి సంఖ్య 50వేలకు చేరుతుండ టం వల్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
పుతిన్ ప్రకటించిన మదర్ హీరోయిన్ పథకం నైరాశ్యంలో చేపట్టిన అంతిమ ప్రయత్నమని రష్యన్ రాజకీ య, భద్రత రంగాల నిపుణుడు డాక్టర్ జెన్నీ మాథర్స్ చెప్పారు. క్షీణిస్తున్న జనాభా సమస్యను పరిష్క రిం చేందుకు దీనిని అమలు చేస్తున్నారన్నారు. పెద్ద కుటుంబాలవారు ఎక్కు వ దేశభక్తిని కలిగి ఉంటారని పుతిన్ చెప్తున్నారని అన్నారు. ఇది సోవియెట్ యూనియన్ కాలంనాటి ప్రోత్సాహకమని చెప్పారు. అయితే ఆర్థిక సాయం కోసం పెట్టిన షరతు వింతగా ఉందన్నారు.
జనాభా తగ్గిపోతుండటం 1990వ దశకం నుంచి ప్రారంభమైందన్నారు. కోవిడ్, ఉక్రెయిన్పై యుద్ధం సమస్యను తీవ్రతరం చేశాయని చెప్పారు. ఎక్కువ మంది పిల్లలను కనడానికి రష్యన్ మహిళలను ప్రోత్సహించడం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. అయితే ఈ డబ్బు కోసం పది మంది పిల్లల్ని పెంచడానికి ఎవరు ముందుకొస్తారన్నారు. ఈ మధ్య కాలంలో వీళ్ళంతా ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. రష్యాలో చాలా ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమస్యలు ఉన్నాయని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/putin-offers-rs13lakhs-for-mothers-39-142187.html
రఘురామకృష్ణం రాజు.. పరిచయం అక్కర్లేని పేరు. గత నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వ అరాచకాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వ్యక్తి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన రఘురామకృష్ణం రోజు.. ఆ తరువాత కొద్ది రోజులకే జగన్ విధానాలతో విభేదించి రెబల్ గా మారారు. నిత్యం జగన్ అరాచకపాలనను విమర్శిస్తూ వచ్చారు.
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను క్యాట్ కొట్టేసింది. తనను రెండో సారి జగన్ సర్కార్ సస్పెండ్ చేయాడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ లో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెచ్చి జగన్ ఏపీ ప్రజల భూములను దోచుకోవడానికి ప్లాన్ వేశారంటూ పెద్దయెత్తున ప్రచారం చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన చట్టమని, దీనివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని వైసీపీ చెబుతున్నప్పటికీ అది ఎంత మేరకు రైతుల మైండ్ కు చేరుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న
ఈ ఎన్నికలలో ఎవరైనా ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ ఓటరు ఈ క్రింది విషయాలను ఒప్పుకున్నట్లే అని సోషల్ మీడియాలో ఒక బాధ్యతగల పౌరుడు స్పందించాడు. నిప్పులాంటి నిజాలను గుర్తు చేశాడు.
వైసీపీకి ఇవే చివరి ఎన్నికలంటూ అభ్యర్థి కాకర్ల సురేష్ తన దైన స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ టీడీపీ కూటమికే జైకొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే, అన్నీ సర్వేల్లో తేలిపోయింది. ఉదయగిరి నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మారుస్తానని, ఉదయగిరి కోటను, సిద్దేశ్వరం, శ్రీ వెంగమాంబ టెంపుల్, గండిపాలెం రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా మార్చి ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు సురేష్ హామీలు ఇస్తున్నారు.
వైసీపీలో కొన్ని రోజుల నుంచీ ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి, కీలక నేతలైన విజయసాయిరెడ్డి వంటి వారి వరకూ అందరూ అన్యాపదేశంగా తమ పార్టీ ఓటమి తథ్యమన్న సంకేతాలే ఇస్తున్నారు. ముందుగా జగన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లపై నమ్మకం పోయిందంటూ చేతులెత్తేశారు.
రాజకీయంగా సీనియర్ కూడా అయిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తన మార్కు రాజకీయాలు చేస్తున్నారు. బాలశౌరికి రాజకీయంగా ఎంతో అనుభవం ఉంది. ముఖ్యంగా ప్రజలను తనవైపు తిప్పుకోవడంలోనూ ఆయన నేర్పుగా ముందుకు సాగుతారనే పేరు తెచ్చుకున్నారు.
గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందన్నది సామెత. సినీ పరిశ్రమలు అన్ని విధాలుగా అవమానించిన ఏపీ సీఎం జగన్ కు సరిగ్గా ఎన్నికల వేళ ఆ సినీ పరిశ్రమ నుంచి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సినీ పరిశ్రమ నుంచి ఒక్కరొక్కరుగా జగన్ కు వ్యతిరేకంగా జనసేనానికి మద్దతుగా బయటకు వచ్చి గొంతు విప్పుతున్నారు.
చినుకు పడితే హైదరాబాద్ జంటనగరాలు చిగురుటాకులా వణికిపోవడం కొత్త కాదు. ప్రతి ఏటా వానాకాలంలో భాగ్యనగర వాసులు నరకం చూడటమూ కొత్త కాదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో మంగళవారం(మే7)న కురిసిన వర్షంతో భాగ్యనగరం కాస్తా భాగ్యనరకంగా మారిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలంగాణ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాయపడ్డారు. ఎన్నికలకు గట్టిగా ఐదు రోజుల సమయం కూడా లేదు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూనే, కూటమి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా పవన్ కూటమి శ్రేణుల్లో జోష్ నింపేలా ప్రసంగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంత కాలం ఓ నమ్మకం ఉండేది. తాను ఎంత అరాచకపాలన సాగించినా, ఎంత ఆర్థిక అవకతవకలకు పాల్పడినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీ తనకు అండగా నిలుస్తారనీ, ఎన్నికల గండం నుంచి గట్టెక్కిస్తారని. అయితే తెలుగుదేశం, జనసేనతో ఏపీలో బీజేపీ జతకట్టడంతో ఆ ఆశలు అడియాసలయ్యాయి.
ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శరంగా జరుగుతాయన్న నమ్మకం జగన్ లో పోయింది. తనకు అనుకూలంగా, తన అనుకూల అధికారుల కనుసన్నలలో, తన కోసం తానే సృష్టించుకున్న వాలంటీర్ల వ్యవస్థ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికలను ఎన్నికల సంఘం చర్యల కారణంగా భ్రష్టుపట్టిపోతున్నాయని జనగ్ ఇప్పుడు ఊరూవాడా కోడై కూస్తున్నారు.