అమరావతి రాజధాని కోసం ఎందాకైనా..!

Publish Date:Aug 18, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు అలుపు, సొలుపు, విసుగు, విరామం లేకుండా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఉద్యమం చేపట్టి సెప్టెంబర్ 12 నాటికి వెయ్యి రోజులు పూర్తవుతుంది. తమ ఉద్యమం వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అమరావతి ప్రాంత రైతులు మరో మహా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.

ఇంతకు ముందు వారు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో ఏపీ హైకోర్టు నుంచి తిరుమల వరకు పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సంగతి విదితమే. జగన్   నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు సృష్టించినా.. నిబంధనలు, నిర్బంధాలు పెట్టినా మొక్కవోని దీక్షతో రాజధాని ప్రాంత రైతులు తొలి మహా పాదయాత్రను విజయవంతంగా ముగించారు. తొలిదశలో చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది.

అదే స్ఫూర్తితో.. అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ తో ఇప్పుడు రైతులు మళ్లీ మరో మహా పాదయాత్రకు శ్రీకారం చుడుతుండడం గమనార్హం. అమరావతి పరిధి వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి పాద్రయాత్ర ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి సన్నిధికి చేరుకోవడంతో మలి దశ మహా పాదయాత్రను ముగిస్తారు. రెండు నెలలు కొనసాగే ఈ మహా పాదయాత్ర సందర్భంగా కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని అనేక గ్రామాలు, పలు పుణ్యక్షేత్రాల మీదుగా శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకు యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ను ఉద్యమిస్తున్న రైతు సంఘాల జేఏసీ సిద్ధం చేసింది.  తుళ్లూరు సాయిబాబా కల్యాణ మండపంలో భేటీ అయిన రైతు సంఘాల జేఏసీ మలి దశ పాదయాత్ర ప్రారంభించే సెప్టెంబర్ 12కు ముందు రోజున దీక్షా శిబిరంలో హోమం నిర్వహించాలని నిర్ణయించింది. రాజధానిగా అమరావతినే నిర్ణీత కాలంలోగా అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు చెప్పినా ముడు ముక్కలాటకు వైసీపీ సర్కార్ తెర దించకుండా కొత్త జిత్తులు, ఎత్తులతో ముందుకు సాగుతున్నది.

కోర్టు తీర్పుతోనైనా జగన్ సర్కార్ కు జ్ఞానోదయం కలుగుతుందని ఉద్యమిస్తున్న అమరావతి ప్రాంత రైతులు ఆశించారు. అయినా.. ప్రభుత్వం పాత పాటే పాడుతుండడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని ఏపీ సర్కార్ బేషరతుగా ప్రకటించే వరకు తమ ఉద్యమాన్ని విరమించేది లేదని పోరాట కమిటీ తెగేసి చెప్పింది. ఈ క్రమలోనే రైతులు, రైతు కూలీలు, మహిళలు పాల్గొనే మరో మహా పాదయాత్రకు రైతు సంఘాల జేఏసీ  సిద్ధం అవుతోంది. ఈ మహా పాద యాత్రలో అమరావతి రైతులకు తెలంగాణ రైతులు, హైదరాబాద్ వాసులు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారని చెబుతున్నారు.

కాగా.. మహా పాదయాత్రకు అందరూ సహకరించాలని, అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చేందుకు రాష్ట్రంలోని రైతులు ముందుకు రావాలని అమరావతి రైతుల జేఏసీ విజ్ఞప్తి చేసింది. రాజధాని ఐక్య కార్యాచరణ సమితి, అమరావతి పరిరక్షణ సమితి నేతలు, లీగల్ కమిటీ, మహిళా ఐక్య కార్యాచరణ సమితి, దళిత ఐక్య కార్యాచరణ నేతలు, దీక్షా శిబిరాల నిర్వాహకులు, రైతులు, మహిళలు అమరావతి టూ అరసవిల్లి మహా పాదయాత్ర నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఎన్నో ఉద్యమాలు, ఆందోళనలతో దిగిరాని వైసీపీ సర్కార్ కు తాజాగా తలపెట్టిన మరో మహా పాదయాత్రతోనైనా జ్ఞానోదయం అవుతుందనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఇప్పటికై జగన్  తన మొండి పంతాన్ని వీడి అమరావతినే రాజధానిగా ప్రకటించాలని కోరుతున్నారు.

By
en-us Political News

  
వైసీపీకి ఇప్పుడు అన్ని అపశకునాలే కనిపిస్తున్నాయి. ఏదీ కలిసిరావడం లేదు. గత ఎన్నికలలో అన్నీ కలిసివచ్చి అందలం దక్కింది. ఈ సారి అన్నీ ఎదురుతిరిగి అధికారం దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్వయంగా పార్టీ అధినేత, సీఎం జగన్ రంగంలోకి దిగి బస్సు యాత్ర చేపట్టినా జనంలో స్పందన కనిపించలేదు. చివరాఖరికి సొంత గడ్డ కడపలో కూడా జగన్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం స్టార్ట్ అయింది. ప్ర‌చారంలో ప్రధాన పార్టీల నేత‌లు మాట‌ల‌ ప‌దును పెంచుతున్నారు. రాజ‌కీయ స‌వాళ్ళు, ప్ర‌తిస‌వాళ్ళ‌తో నేత‌లు, ఓట‌ర్ల‌ను వినోదాన్ని పంచుతున్నారు. “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు.
కోడలికి బుద్ధి చెప్పి అత్త మూకుడు నాకిందనే సామెత తెలుగువారందరికీ తెలిసే వుంటుంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన రాజకీయ ఉత్కంఠ, టెన్షన్ భరిత వాతావరణం చాలదన్నట్టుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అగ్నిలో ఆజ్యం పోశారు.
వల్లభనేని వంశీ నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఓటమిని అంగీకరించేశారా? అంటే పరిశీలకలు ఔననే అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం ద్వారా తనకు గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయని చెప్పకనే చెప్పేశారు.
డోన్ నియోజకవర్గం వైైసీసీ అభ్యర్థి మంత్రి  బుగ్గన నామినేషన్ పెండింగ్లో పడింది.   మంత్రి బుగ్గన రాజేంద్రనాథ నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో ఉంచారు.
ఏపీ ఎన్నికల సందర్భంగా జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు.
హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ భార్య వసుంధర నామినేషన్! అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరో వైపు చెల్లెళ్ల విమర్శలు, ఇంకో వైపు పార్టీ నుంచి పెరిగిపోతున్న వలసలు, వెరసి ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారా? ఆఫ్రస్ట్రేషన్ లో సొంత చెల్లెలిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి తనకు తానే నష్టం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఏంటమ్మా జగనూ... మొన్న చెల్లి షర్మిలమ్మ ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు చూశాంలే..
కేసీఆర్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ ను పండించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కారణాలేమైతేనేం చాలా రోజుల పాటు ఎక్కడా బహిరంగంగా మాట్లాడని ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రజల ముందుకు వచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.