Publish Date:Aug 15, 2025
అవి ఎమర్జెన్సీ తర్వాతి కాలం రోజులు.. అప్పుడు వైఎస్ఆర్ ఏమంత గొప్ప ఇందిరాగాంధీ కుటుంబ భక్తుడు కాడు. పైపెచ్చు కుటుంబ పాలనకు సంబంధించి తీవ్రంగా దుయ్యబడుతూ ఉండేవారాయన. ఆ సమయంలో.. ఒరిజినల్ కాంగ్రెస్ నుంచి ఇందిరను, ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీని బహిష్కరించగా.. అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న ఇండియా అంటే ఇందిర- ఇందిర అంటే ఇండియా అనే ఒకానొక స్లోగన్ కొద్ది.. ఆమె ఎక్కడుంటే అదే కాంగ్రెస్ అనే కోణంలో కాంగ్రెస్ ఐ స్థాపన.. ఆపై వైయస్ ఆర్ ఒరిజినల్ కాంగ్రెస్ నుంచి గెలుపు.
సరిగ్గా అదే సమయంలో వైయస్ ఒకే ఒక్కడుగా ఉమ్మడి ఆంధ్రలో గెలిచిన.. ఆ ఒక్క సీటు గల ఒరిజినల్ కాంగ్రెస్ కాస్తా కాంగ్రెస్ ఐలో చేరడంతో.. ఆయన కూడా కాంగ్రెస్ ఐ కి షిఫ్ట్ అయ్యారు. ఆనాటి నుంచి పులివెందులలో వైయస్ లేదా ఆయన కుటుంబ ప్రాతినిథ్య పార్టీ వైయస్ఆర్సీపీ విజయం సాధిస్తూ వచ్చాయి. అక్కడ పూచిక పుల్లను నిలబెట్టినా.. కూడా వైయస్ కుటుంబం పేరు మీద నిలిచి గెలిచేదనే పేరుంది.
అలాంటి చరిత్రకు చెదలు పట్టిందా? అన్నట్టు నేడు పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలాడింది. అలాగని అదిప్పటి నుంచే కాదు గత రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో వైయస్ కుటుంబం పవరు తగ్గిందా? అన్నట్టు పరిస్థితి మారుతూ వచ్చింది. గత 2024 ఎన్నికల్లో కడపలోనూ వైసీపీ భారీ పరాభవం మూటగట్టుకుంది.
దీనంతటికీ కారణం వైయస్ కుటుంబ లెగసీని వైయస్ జగన్ దిగజార్చుతూ వచ్చారనడానికన్నా.. మించి భారతీరెడ్డి ఈ క్రతువును ముందుండి నడిపిస్తున్నారా? అనిపిస్తోంది. కారణం.. భారతీ రెడ్డి జగన్ ని అడ్డు పెట్టుకుని వైయస్ఆర్ బ్రాండ్ ని తమ కుటుంబం అంటే తాను, అవినాష్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే సెకండ్ గ్రేడ్ వైఎస్ ఫ్యామిలీకి అడాప్ట్ చేసుకోవాలన్న తలంపు కారణంగా ఆమె.. తీసుకుంటూ వస్తున్న నిర్ణయాలు వరుస వెంబడి బెడిసి కొడుతూ వస్తున్నాయి.
కుప్పం మున్సిపాల్టీలతో విజయం సాధించిన ఆ ఊపు ఉత్సాహం కాస్తా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల గెలుపుతో మట్టికొట్టుకుపోవడం మాత్రమే కాదు.. వైయస్ ఫ్యామిలీకున్న ప్రభ నానాటికీ తగ్గుతూ వస్తోందనడానికి ఒక నిదర్శనంగా నిలుస్తోందని అంటారు విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pulivendula-39-204275.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.