అట్టుడికిన అమలాపురం.. కోనసీమ జిల్లా పేరు మార్పుపై భగ్గుమన్నజిల్లా

Publish Date:May 24, 2022

Advertisement

కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ప్రశాంతంగా ఉండే పట్టణం ఒక్కసారిగా రగిలిపోయింది. ఆందోళనలు హింసాత్మకం రూపం దాల్చాయి. మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ క్యాంపు ఆఫీసుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.

ఐదు బస్సులను దగ్ధం చేశారు. పోలీసు వాహనాలపై రాళ్ల దాడి చేశారు. పలువురు పోలీసులు ఈ దాడిలో గాయపడ్డారు. ఎస్పీ తలకు గాయమైంది. ఈ ఆందోళనకు కారణం కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చడమే. మార్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు ప్రారంభం కావడంతో జిల్లా అంతటా 144వ సెక్షన్ విధించారు. అయితే ఆంక్షలను ఉల్లంఘించి వేలాది మంది అమలాపురంలో రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.  

పోలీసుల లాఠీ చార్జితో పరిస్థితి అదుపు తప్పింది.  ప్రభుత్వ వాహనాలు, భవనాలే లక్ష్యంగా ఆదోళనకారులు విధ్వంసానికి తెగబడ్డారు. అసలీ పరిస్థితికి కారణం ప్రభుత్వమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా పేరు మార్చడంతోనే సమస్య ఉత్పన్నమైందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తొలుతే బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టి ఉంటే ఎలాంటి సమస్యా ఉండేది కాదని అంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో జిల్లాకు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టాలన్న అభ్యర్థనలు వచ్చినా పట్టించుకోని సర్కార్ జిల్లాకు కోనసీమ అని పేరు ఖరారు చేసింది.

అప్పట్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు కూడా కోనసీమ జిల్లా పేరు మార్పు ప్రసక్తే లేదనీ, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత ఇక పునరాలోచన ఉండదనీ స్పష్టం చేశారు. కానీ ఇన్ని రోజులు గడిచిన తరువాత మరే జిల్లా విషయంలోనూ లేని విధంగా కోనసీమ జిల్లా పేరు మార్పునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేయడంతోనే సమస్య ఉత్పన్నమైందంటున్నారు. కోనసీమ సాధన సమితి నాయకులు కూడా ఇదే చెబుతున్నారు. తాము అంబేడ్కర్ కు కానీ జిల్లాకు ఆయన పేరు పెట్టడానికి కానీ తాము వ్యతిరేకంకాదనీ అయితే.. ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పేరు మార్పు విన్యాసాలు చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారు. అంబేడ్కర్ అంటే తమకు అపారమైన గౌరవమనీ, ఇలా ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఆయన పేరును వాడుకుని అవమానించడాన్నే తాము తప్పుపడుతున్నామని చెబుతున్నారు. 

ప్రశాంతతకు మారుపేరైన కోససీమ  ఇప్పడు ఆందోళనల సెగతో వేడెక్కడానికి జగన్ సర్కార్ తప్పిదమే కారణమనీ, కొత్త జిల్లాల ఏర్పాటు, వాటికి పేర్ల విషయంలో ఎలాంటి కసరత్తూ లేకుండా తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు కోనసీమలో అనవసర చిచ్చుకు, రచ్చకు కారణమైందనీ తెలుగువన్ గతంలోనే చెప్పింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటించిన సమయంలోనే పలు దళిత సంఘాలు కోనసీమకు డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరాయి. అప్పడు వాటి వినతిని పెడచెవిన పెట్టి కోనసీమ జిల్లాగా నామకరణం చేసి ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం జిల్లా పేరు మార్పునకు నిర్ణయించడం వల్లనే కోనసీమలో ఆందోళనలు ఉవ్వెత్తున రేగాయని తెలుగువన్ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించినప్పుడే పేర్కొంది. ప్రజల ఇష్టాయిష్టాలూ, భావోద్వేగాలతో సంబంధం లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం వెంపర్లాడటం వల్లనే ఎప్పడూ ప్రశాతంగా ఉండే కోనసీమ నేడు రగిలిపోతున్నది. కాగా   అధికార పార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగానే కోనసీమలో ప్రస్తుత పరిస్థితి అన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న జగన్ సర్కార్ దుష్టపన్నాగమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.