కింద పడ్డా మాదే పై చేయి.. సజ్జల వితండ వాదన!

Publish Date:May 13, 2022

Advertisement

గడప గడపకూ ప్రభుత్వం పేరుతో జగన్ సర్కార్ చేపట్టిన కార్యక్రమంలో గడప గడపకూ ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తమౌతుంటే.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం అందుకు ససేమిరా అంగీకరించడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వారెవరికీ ఆ అర్హత లేదంటున్నారు. గడప గడపకూ కార్యక్రమంలో నిరసనలు ఎదురౌతున్నాయని అంగీకరిస్తూనే కింద పడినా పై చేయి మాత్రం మాదేనంటూ వితండ వాదనను తెరపైకి తీసుకువస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మీడియాలో విస్తృత ప్రచారం రావడం, సామాజిక మాధ్యమంలో ప్రభుత్వంపై ట్రోలింగ్ పెరగడంతో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారని పిస్తోంది. జగన్ సర్కార్ లో ప్రభుత్వ సలహాదారు హోదాలో సూపర్ మంత్రిగా అన్ని శాఖల ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న సజ్జల గడప గడపకూ కార్యక్రమంపై ప్రభుత్వ రియాక్షన్ చెప్పేందుదుకు మీడియా ముందుకు వచ్చారు. ప్రజా నిరసనలను తగ్గించి చూపే ప్రయత్నం చేశారు. నిరసనలు ఎదురౌతున్న మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే ఆ నిరసనలు చేసే వారెవరికీ ఆ అర్హత లేదని, అలా నిరసనలు చేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలకు అర్హత లేనివారేనని తీర్మానించేశారు.

అర్హత లేకుండా తమకు కూడా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని కోరుతూ వారు నిరసనలకు దిగుతున్నారని కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు.   పథకాలకు నిబంధనల సంకెళ్లు వేసి ఎవరికీ అందకుండా విధానాలు రూపొందించిన ఘనత వహించిన ప్రభుత్వం.. పథకాల గురించి తప్ప అభివృద్ధి గురించి, సమస్యల గురించి మాత్రం గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ప్రస్తావించడం లేదు. లబ్ధిదారుల జాబితాలతో లబ్ధిదారుల గడప కు వెళ్లి ఘనంగా ప్రచారం చేసుకుందామనుకున్న ప్రభుత్వానికి తొలి రోజునే నిరసనల సెగ తగలడంతో ఉక్కిరి బిక్కిరైంది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం కేబినెట్ సమావేశం తరువాత మంత్రులతో మళ్లీ ప్రత్యేకంగా సమావేశమై ( ఈ సమావేశానికి అధికారులెవరినీ అనుమతించలేదు) గడప గడపకూ కార్యక్రమంపై మరోసారి దిశా నిర్దేశం చేశారు.

అయితే ప్రజా నిరసనల ఉధృతిని స్వయంగా అనుభవించిన నేతలు.. కార్యక్రమాన్ని కొన్ని రోజులు వాయిదా వేసి.. ఏవో కొన్ని ప్రజోపయోగకరమైన పనులను ప్రారంభించి తరువాత కొనసాగిద్దామని ప్రతిపాదించినా సీఎం ససే మిరా అన్నారట. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి గడప గడపకూ కార్యక్రమం బ్రహ్మాండంగా సాగుతోందని నమ్మించడానికి ప్రయత్నిస్తూ.. నిరసనలు వాస్తవమే కానీ, అనర్హుల నిరసనలవి అని భాష్యం చెబుతున్నారు.

 గడప గడపకూ కార్యక్రమం వల్ల పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ ఒనగూరే ప్రయోజనం ఇసుమంతైనా లేదని వైసీపీ క్యాడర్ చెబుతున్నారు. సంక్షేమ పథకాలలో లబ్ధిరాదుల సంఖ్యను కుదిస్తూ పోవడం వల్లనే ప్రజాగ్రహం పెల్లుబుకుతోందనీ, విద్యుత్ చార్జీల బిల్లులు కూడా గతం కంటే 70 నుంచి 75 శాతం అధికంగా రావడం వల్ల కూడా జనాగ్రహం తీవ్రంగా వ్యక్తమౌతోందని వారు చెబుతున్నారు.  

By
en-us Political News

  
సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమయ్యారన్న కేసు దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల మేరకు ఇందులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవు. సీదిరి అప్పలరాజు చేసిన అతే.. ఆయనను చట్టపరంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఎప్పుడో ఓ సారి జైల్లో ఉన్న నేతకు పరామర్శ పేరుతో బయటకు వచ్చే సందర్భాలలో కూడా సదరు నేతను పరామర్శించడం కంటే.. బల ప్రదర్శనకు, తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకునే ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన అలా బయటకు వచ్చిన ప్రతి సారీ అభాసుపాలౌతూనే ఉన్నారు.
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.