ఓటమి తప్పని యుద్ధానికి సిద్ధమవుతోన్న సోనియా!

Publish Date:May 26, 2017

Advertisement

 

ఇప్పుడు దేశంలో అందరికీ ఆసక్తి కలిగిస్తోన్న అంశం… నెక్ట్స్ ప్రెసిడెంట్ ఎవరు? అద్వానీ నుంచీ రజినీకాంత్ దాకా చాలా మంది పేర్లే వినిపించాయి. అయితే, అటు అద్వానీ కాని… ఇటు రజినీకాంత్ కాని రాష్ట్రపతి అవ్వకపోవచ్చని ఆల్రెడీ సంకేతాలు వచ్చేస్తున్నాయి. అద్వానీ మీద కోర్టు విచారణ రాష్ట్రపతి ఎన్నికల కంటే వేగంగా దూసుకొస్తోంది. ఇటు రజినీకాంత్ తన స్వంత పార్టీ పెట్టి తమిళనాడు సీఎం అవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది! మరి తరువాతి రాష్ట్రపతి ఎవరు?

 

ప్రణబ్ తరువాత రాష్ట్రపతి భవన్ ఎవరిదో తెలియదుగాని… ప్రణబ్ మాత్రం ఇక సెలవు అంటున్నారు దిల్లీకి! మరో రెండు నెలల్లో తన పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి తనతో పని చేస్తోన్న అధికారుల్ని వారి వారి మంత్రిత్వ శాఖలకి తిప్పి పంపేస్తున్నాని ఆయన చెప్పారు. అంటే అర్థం ప్రణబ్ దా ఇక నేరుగా కోల్ కతా ఫ్లైట్ ఎక్కేస్తారనే! ఆయన ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూల్లో శేష జీవితం స్వరాష్ట్రంలో గడుపుతానని అన్నారు!

 

ప్రణబ్ తనకు రెండోసారి రాష్ట్రపతి రేసులో వుండే ఉద్దేశం లేదని చెప్పటానికి కారణం పదవి మీద ఇష్టం లేక కాదు. ప్రస్తుతం మెజార్టీ వున్నా బీజేపికాని, ఎన్డీఏ కూటమి కాని ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చే ఉద్దేశంలో లేవు. అటువంటప్పుడు ప్రతిపక్షాల్ని నమ్ముకుని పోటీలో వుండటం కోరి ఓడిపోవటమే తప్ప మరోటి కాదు. అందుకే, గౌరవంగా పక్కకు తప్పుకుంటున్నాడు మన సీనియర్ కాంగ్రెస్ లీడర్. కాని, ట్విస్ట్ ఏంటంటే… ఒకవైపు ప్రణబ్ ముఖర్జీ తాను రెండోసారి రాష్ట్రపతి రేసులో వుండనని చెబుతోంటే మరో వైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా అపొజిషన్ పార్టీలతో రాష్ట్రపతి అభ్యర్థి గురించి మీటింగ్ పెడుతున్నారు. కాంగ్రెస్ తో పాటూ చాలా పార్టీలు ప్రణబ్ తమకు ఓకే అని చెప్పాయి. కాని, మోదీ సర్కార్ ఎంత మాత్రం అలాంటి ఆలోచనలో లేదు!

 

సోనియా ఎలాగైనా మోదీ ప్రతిపాదించే అభ్యర్థిపై తమ క్యాండిడేట్ ను పోటీకి నిలపాలని ప్రయతిస్తన్నారు. గెలవటం కోసం కాకపోయినా… ప్రతిపక్ష పార్టీలన్నిటికీ రాష్ట్రపతి ఎన్నికని అడ్డుపెట్టుకుని తాము నేతృత్వం వహించాలని కాంగ్రెస్ ప్లాన్. కాని, సోనియా ఎన్నో ఆశలు పెట్టుకున్న బెంగాల్ ఫైర్ బ్రాండ్ మమత కూడా మోదీతో మాటా మంతీ అయ్యాక టోన్ మార్చారు! ప్రతిపక్షాలకు కూడా అంగీకారమయ్యే అభ్యర్థిని ఎన్డీఏ ప్రతిపాదిస్తే తాము మద్దతిస్తామనీ, రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమైతే బెటరని దీదీ అన్నారు! ఎలాగైనా ఎలక్షన్ జరిగేలా చూసి… మోదీకి గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోన్న సోనియాకి ఇది నిజంగా చిరాకు పరిచే స్టేట్మెంటే! అందరికీ అమోదయోగ్యం అయ్యే అబ్దుల్ కలామ్ లాంటి అభ్యర్థి అంటూ మమతా బెనర్జీ క్లాజులు పెట్టడం మోదీకి వెసులుబాటు కలిగించే అంశం! ఒడిషాకు చెందిన జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్మూ లాంటి వారిని రేపు బీజేపి తమ అభ్యర్థిగా నిలబెడితే… మమతా బెనర్జీ ఆమె గిరిజన మహిళ అంటూ మద్దతు ప్రకటించవచ్చు! అప్పుడు కాంగ్రెస్ టీమ్ లోంచి ఓ కీలక వికెట్ పడిపోయినట్టే!

 

కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడూ లేనంత బలహీనంగా వున్న వేళ వస్తోన్న ఈ రాష్ట్రపతి ఎన్నికలు ఖచ్చితంగా హస్తానికి తప్పనిసరి ఓటమే అవ్వనున్నాయి!

By
en-us Political News

  
ఇప్పటికే గంటల తరబడి విజయ్ ను విచారించిన సీబీఐ మరో మారు ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు పంపింది. అయితే ఈ వేధింపుల వెనుక ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేనని పరిశీలకులు అంటున్నారు.
తన కృషికి తగిన గుర్తింపు రాలేదన్న కినుకతో ఏబీవీ ఉన్నట్లు కనిపిస్తున్నారు.ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని చేపట్టలేదు. జగన్ హయాంలో జరిగిన అవకతవకలపై విమర్శలతో పాటుగా, ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలనూ ప్రశ్నించడం ఆరంభించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు.
రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి.
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.