ముళ్ల కంచెలో ముచ్చటైన శిల్పాలు
నిర్లక్ష్యపు నీడలో కీ.శ. 9వ శతాబ్ది రాష్ట్రకూట శిల్పాలు
1100 ఏళ్ల పురాతన శిల్పాలను పరిరక్షించుకోవాలి
ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి
కర్నూలు నగరానికి దక్షిణంగా పాతిక కిలోమీటర్ల దూరంలో కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో రాష్ట్ర కూటుల అంటే 9వ శతాబ్దపు అపురూప శిల్పాలు ఆలనాపాలనా లేకుండా పడి ఉన్నాయి. నిర్లక్ష్యానికి గురైన వారసత్వ స్థలాలు, కట్టడాలు, శిల్పాలను గుర్తించి, వాటి చారిత్రక ప్రాధాన్యత, వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి అవగాహన కల్పించే ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిట్ కార్యక్రమంలో భాగంగా ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి ఆదివారం (ఫిబ్రవరి 2) నాయకల్లు గ్రామాన్నిసందర్శించారు. అపురూప శిల్పాలు ఆలనా పాలనా లేకుండా పడి ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. పోలాల్లో ఉన్న శిథిల శివలయాలు, విగ్రహాలను గుర్తించారు.
గ్రామానికి ఉత్తరంగా ఉన్న కల్లాల వద్ద ముళ్ల కంచెల్లో ఉన్న రాష్ట్రకూటల కాలం నాటి నిలువెత్తు ఎర్ర ఇసుకరాతి శివ ద్వారపాలకుడు, నల్ల శాసనపు రాతిలో చెక్కిన రెండు మహిషాసుర మర్ధిని శిల్సాలు, వీరగల్లు శిల్పం, పోలాల్లో ఉన్న శిథిల శివాలయాల పక్కన ముళ్లపొదల్లో చిక్కుకున్న అందమైన నంది విగ్రహం, 1100 ఏళ్ల నాటి చరిత్ర, సంస్కృతికి అద్దం పడుతున్నాయన్నారు.
రెండు మహిషాసుర మర్దిని విగ్రహాలు అలనాటి శక్తి ఆరాధనను, శతృవులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వీరుడు విజయస్వర్గాన్ని అందుకోగా, అతడికి అప్సరసలు పరిచర్యలు చేస్తున్నట్లు తెలిపే నిలువెత్తు వీరగల్లు శిల్పం అలనాటి వీరాదరణను తెలియజేస్తున్నాయన్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ కళా ఖండాలను గ్రామంలోకి తరలించి, పీఠాలపై నిలబెట్టి కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించాని శివనాగిరెడ్డి గ్రామస్తులను కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/preserve-ancient-artifacts-39-192235.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.