అధికారిక కోతలు మొదలు

Publish Date:Feb 28, 2013

Advertisement

 

కొత్త సంవత్సరంలో జనవరి నెల నుండే అనధికారిక విద్యుత్ కోతలు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, మార్చి1వ తేది నుండి అధికారికంగా కోతలు మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. హైదరాబాదుతో సహా అన్ని ప్రధాన నగరాలలో రోజుకు 2గంటలు చొప్పున కోతలు విదించబోతున్నారు.

 

ఇక ఇప్పటికే, రోజుకి 3-4గంటలు కోతలు విదిస్తున్న జిల్లా కేంద్రాలలో ఇప్పుడు రోజుకి 4గంటలు, పురపాలక సంఘాలలో 6 గంటలు, మండల కేంద్రాలలో 8 గంటలు, గ్రామాలలో రోజుకి 12 గంటలు విద్యుత్ కోతలు రేపటి నుండి ఖచ్చితంగా అమలుకానున్నాయి. బహుశః ప్రస్తుతం ఉన్న అనధికారిక కోట్లకు ఇవి అదనంగా ఉండవచ్చును. అంటే, ప్రస్తుతం నగరాలలో అనడికారికంగా 2 నుంచి 3గంటలవరకు విద్యుకోతలు అమలవుతున్నాయి. అవి ఇక రోజుకి 5గంటలు అయ్యే అవకాశం ఉంది. నగరాలలో పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే, ఇక పల్లెలో ఎలాఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

 

మర్చి నెల మొదటివారంలో ఇంతభారీ విద్యుత్ కోతలు తప్పనపుడు, మే జూన్ నెలల్లో పరిస్థితిని తలుచుకోవడానికే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావం వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపారాలు, ముఖ్యంగా చిన్న వ్యాపారస్తులు బాగా దెబ్బతినే అవకాశం ఉంది. తద్వారా నిరుద్యోగం పెరిగి అది సామజిక సమస్యలకు దారి తీసే అవకాశం కూడా ఉంది.

 

గత రెండు మూడు సంవత్సరాలుగా నానాటికి విద్యుత్ సమస్య తీవ్రతరం అవుతున్నదని గ్రహించినప్పటికీ, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేప్పట్టకుండా, కొత్త విద్యుత్ ప్లాంటుల స్థాపనకు పూనుకొనక, కేవలం తెలంగాణా అంశం, పార్టీలో అసమ్మతి రాజకీయాలు వంటి వాటితో కాలక్షేపం చేస్తువచ్చిన ప్రభుత్వం, విద్యుత్ సంక్షోభం నివారణకు కనీస చర్యలు కూడా చేప్పటకపోవడమే నేటి ఈ దుస్థితికి కారణం.

 

దాహం వేసినప్పుడు నుయ్యి త్రవ్వడం మొదలుపెట్టినట్లు, విద్యుత్ సంక్షోభం తీవ్రతరమయిన తరువాత, కిరణ్ కుమార్ గుజరాత్ రాష్ట్రం నుండి గ్యాస్ ఇప్పించమని కోరడం విచిత్రం. ఆ రాష్ట్రంలో ఇదే దుస్థితి నెలకొన్నపుడు అక్కడి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆ పరిస్థితులను ఏవిధంగా అదిగమించాడో తెలుసుకోవాలంటే పార్టీల బేషజాలు, అహం అడ్డొస్తాయి. ప్రభుత్వాల చేతకానితనానికి, నిర్లిప్త వైఖరికి ప్రతీసారీ ప్రజలే మూల్యం చెల్లించక తప్పట్లేదు.

By
en-us Political News

  
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.