కాంగ్రెస్ సమావేశంలో పొన్నం విసుర్లు
Publish Date:Dec 16, 2012
Advertisement
ఈ రోజు అనగా ఆదివారం హైదరాబాద్ యల్.బీ.నగర్ వద్ద జరుగుతున్న కాంగ్రేసు సమావేశాలలో తెలంగాణా కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు పొన్నంప్రభాకర్ తనదయిన శైలిలో మాట్లాడి సభలో కలకలం రేపారు. ఆయన ముందుగా, తెలంగాణాకోసం అమరులయిన యువకుల ఆత్మశాంతికి సభ రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరడంతో వేదిక మీద ఉన్న పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అందుకు అభ్యతరం చేప్పేసరికి సభలో ఒక్కసారిగా కలకలం మొదలయింది. తీవ్ర ఉద్రిక్తులయిన తెలంగాణా సభ్యులందరూ ఒక్కసారిగా నిల్చొని ‘జై తెలంగాణా’ అంటూ నినాదాలు చేసారు. అందుకు పోటీగా సీమాంద్ర ప్రాంతాలనుండి వచ్చినవారు కూడా ‘జై సమైక్యాంద్రా’ అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టేసరికి సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ కలుగ జేసుకొని సభని రెండు నిమిషాలు మౌనం పాటించమని ఆదేశించడంతో పరిస్తితి అదుపులోకి వచ్చింది. తరువాత మళ్ళీ మాట్లాడిన పొన్నం ప్రభాకర్, వేదిక మీద ఆసీనులయిన పెద్దలందరికీ మరింత షాకులు తినిపిస్తూ “ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపటికీ, తెలంగాణాలో పార్టీ కార్యకర్తలెవరూ కూడా సంతృప్తిగా లేరని అన్నారు. సభలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఉద్దేశిస్తూ ‘మాజీ మంత్రి మోపిదేవి వెంకట రామనకో న్యాయం, మంత్రి ధర్మాన ప్రసాద రావుకొక న్యాయం ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణా సమస్యని వెంటనే పరిష్కరించాలని సభ ముఖంగా పార్టీకి ఆయన విజ్ఞప్తి చేసారు.
http://www.teluguone.com/news/content/ponnam-prabhakar-24-19797.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





